Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Pakistan Isi Second Generation Terror Plan Against India

Pakistan ISI Terror Plan: భారత్‌పై ‘సెకండ్ జనరేషన్’ ఉగ్రదాడులకు కుట్ర.. వెలుగులోకి ఐఎస్ఐ- పాక్ సైన్యం కొత్త ప్లాన్..!

Published Date :January 15, 2026 , 8:36 am
By Chandra Shekhar Pamena
  • భారత్‌పై ‘సెకండ్ జనరేషన్’ ఉగ్రదాడులకు ఐఎస్ఐ- పాక్ సైన్యం కొత్త వ్యూహం..
  • ఉగ్రవాదానికి వారసత్వ రాజకీయాలు.. హఫీజ్, మసూద్ వారసులతో ఐఎస్ఐ ప్లాన్..
  • మురిడ్కేలో మళ్లీ ఉగ్ర శిబిరాలు యాక్టివ్.. 2026 బ్యాచ్‌కు శిక్షణ పూర్తి
Pakistan ISI Terror Plan: భారత్‌పై ‘సెకండ్ జనరేషన్’ ఉగ్రదాడులకు కుట్ర.. వెలుగులోకి ఐఎస్ఐ- పాక్ సైన్యం కొత్త ప్లాన్..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Pakistan ISI Terror Plan: పాకిస్థాన్ గడ్డపై ఉగ్రవాద కార్యకలాపాలను మళ్లీ పునరుద్ధరించేందుకు.. అలాగే, భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుని ‘రెండవ తరం’ ఉగ్రవాద దాడులను ప్రోత్సహించేందుకు ఆ దేశ నిఘా సంస్థ ఐఎస్ఐ (ISI), పాక్ సైన్యం భారీ కుట్రకు తెరలేపినట్లు భారత నిఘా వర్గాలు వెల్లడించాయి. దీనికి సంబంధించిన కీలక సమాచారాన్ని భద్రతా సంస్థలు తాజాగా బయట పెట్టాయి. ఐఎస్ఐ ప్రస్తుతం ఉగ్రవాదంలో కొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది.. హఫీజ్ సయీద్, మసూద్ అజార్ లాంటి పాత తరం ఉగ్రవాదుల నుంచి వారి కుమారులు, సన్నిహిత బంధువులకు నాయకత్వ బాధ్యతలను బదలాయిస్తోంది. ఉగ్రవాద సంస్థల్లో కొత్త రక్తాన్ని నింపి, కార్యకలాపాలను నిరంతరంగా కొనసాగించడమే ఈ వ్యూహం యొక్క ప్రధాన లక్ష్యంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Read Also: NTV journalists: సీసీఎస్ పోలీసుల హైడ్రామాకు తెర.. జర్నలిస్టులు దొంతు రమేష్, సుధీర్‌కు బెయిల్!

అయితే, ఇటీవల పాకిస్థాన్‌లోని బహవల్‌పూర్‌లో ఐఎస్ఐ అధికారులు, పాక్ సైన్యం ప్రతినిధులతో పాటు వివిధ ఉగ్రవాద సంస్థల కీలక నేతల మధ్య ఉన్నత స్థాయి రహస్య సమావేశం జరిగినట్లు తెలుస్తుంది. ఈ సమావేశంలో జమ్మూ- కాశ్మీర్‌లోకి భారీగా చొరబాట్లు చేయడం, సమన్వయంతో ఉగ్రదాడులు చేపట్టడంపై చర్చించినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ఈ భేటీలో లష్కరే తోయిబా నేతలు తల్హా సయీద్, సైఫుల్లా కసూరి, అలాగే జైషే మహ్మద్ కమాండర్ అబ్దుర్ రవూఫ్ అస్గర్ పాల్గొన్నట్లు తెలుస్తుంది. ఇక, తల్హా సయీద్‌ను లష్కరే తోయిబా భవిష్యత్ నాయకుడిగా తీర్చిదిద్దుతున్నట్లు సమాచారం. అతడికి ఉగ్రవాద భావజాలంతో పాటు సంస్థ నిర్వహణ, నిధుల సమీకరణ, అంతర్జాతీయ నెట్‌వర్క్‌ల నిర్వహణలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. మరోవైపు మసూద్ అజార్ సోదరుడు అబ్దుర్ రవూఫ్ అస్గర్‌కు ఐఎస్ఐ నేరుగా మద్దతు ఇస్తూ, సరిహద్దు దాడులను పర్యవేక్షించే కీలక బాధ్యతలను అప్పగించినట్లు భారత నిఘా వర్గాలు పేర్కొన్నాయి.

Read Also: Mohammed Siraj Captain: కెప్టెన్‌గా మహ్మద్‌ సిరాజ్‌!

ఇక, లష్కరే తోయిబా ప్రధాన కేంద్రమైన మురిడ్కేలోని ‘మర్కజ్-ఏ-తైబా’ మళ్లీ పూర్తిస్థాయిలో క్రియాశీలకంగా మారింది. గతంలో దెబ్బతిన్న భవనాలను పాక్ సైన్యం, ఐఎస్ఐ నిధులతో తిరిగి నిర్మిస్తున్నాయి. ఈ నెల చివరలో శిక్షణ పూర్తి చేసుకున్న 2026 బ్యాచ్ ఉగ్రవాదులకు ‘గ్రాడ్యుయేషన్ వేడుక’ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీరికి కఠినమైన సైనిక శిక్షణతో పాటు తీవ్రవాద భావజాలాన్ని లోతుగా నూరిపోస్తున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. కాగా, అంతర్జాతీయ వేదికలపై ఉగ్రవాదంపై చర్యలు తీసుకుంటున్నామని పాకిస్థాన్ చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయని భారత భద్రతా సంస్థలు హెచ్చరిస్తున్నాయి. లష్కరే తోయిబా, జైషే మహ్మద్ సంస్థలు కలిసి పని చేయడం ప్రాంతీయ శాంతికి తీవ్ర ముప్పుగా మారే అవకాశం ఉందని ఇండియన్ ఇంటెలిజెన్స్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • India Pakistan security threat
  • ISI Pakistan army conspiracy
  • Jaish-e-Mohammed terror plot
  • Kashmir terror infiltration
  • Lashkar-e-Taiba revival

తాజావార్తలు

  • Israel-Iran War: ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఎక్కడ..?

  • Korralu Upma Benefits : కొర్రల ఉప్మా.. షుగర్ ఉన్నవారికి ఒక వరం.. నరాల బలహీనతకు చెక్..

  • Russia On Iran War: “ట్రంప్ అసలు రంగు బయటపడింది”.. ఇజ్రాయిల్-ఇరాన్‌ యుద్ధంపై రష్యా..

  • Kakinada Firecracker Factory Blast: బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. చంద్రబాబు, జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి..

  • Israel-Iran War: ఇజ్రాయిల్‌పై ముప్పేట దాడి.. హౌతీ-హిజ్బుల్లా-ఇరాన్ అటాక్..

ట్రెండింగ్‌

  • Chaganti Koteswara Rao: “ఇంతకంటే అడుక్కు తినడం మంచిది”.. అలాంటి యూట్యూబర్స్‌పై చాగంటి ఫైర్..

  • 100W ఫాస్ట్ ఛార్జింగ్, IP68/IP69 రేటింగ్ తో Huawei Mate 80 Pro గ్లోబల్ లాంచ్‌..!

  • Ragi Poori Recipe: డయాబెటిక్ పేషెంట్లకు బెస్ట్ బ్రేక్ ఫాస్ట్.. బంతిలా పొంగే ‘రాగి పూరీ’లు ఇలా చేయండి!

  • Planetary Alignment: ఆకాశంలో గ్రహాల సందడి.. ఒకే వరుసలో ఆరు గ్రహాలు!

  • Ragi Barfi Recipe: రుచితో పాటు పోషకాలు.. హోమ్‌ మేడ్ ‘రాగి బర్ఫీ’ ఎలా చేయాలంటే!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions