Bilawal Bhutto Zardari: “బిన్ లాడెన్ చనిపోయాడు.. కానీ..” ప్రధాని మోదీపై పాక్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు.. భారత్ ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Foreign Minister’s Controversial Comments on Prime Minister Modi: భారత ప్రధాని నరేంద్రమోదీపై పాకిస్తాన్ విదేశాంగశాఖ మంత్రి బిలావల్ భుట్టో జర్ధారీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యూఎన్ భద్రతా మండలిలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడుతూ.. పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడాన్ని తూర్పారపట్టారు. ఒసామా బిన్ లాడెన్ వంటి ఉగ్రవాదికి పాకిస్తాన్ ఆశ్రయం ఇచ్చిందని.. ఇటువంటి దేశం ఉగ్రవాదంపై నీతులు చెబుతుందని విమర్శించారు.
ఇదిలా ఉంటే జైశంకర్ చేసిన ఈ వ్యాఖ్యలపై పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో మాట్లాడుతూ.. ‘‘ఒసామా బిన్ లాడెన్ చనిపోయాడు, అయితే గుజరాత్లోని కసాయి బ్రతికున్నాడని, అతను భారత ప్రధాని అని నేను భారతదేశానికి చెప్పాలనుకుంటున్నాను’’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. నరేంద్రమోదీ ప్రధాని అయ్యేంత వరకు అమెరికా ఈ దేశంలోకి రాకుండా నిషేధించిందని.. ఆర్ఎస్ఎస్ ప్రధాని, ఆర్ఎస్ఎస్ విదేశాంగ మంత్రి అంటూ మోదీ, జైశంకర్ లను విమర్శించాడు. ఆర్ఎస్ఎస్ హిట్లర్ నుంచి స్ఫూర్తి పొందిందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
Read Also: Crime News: కూతురిపై కన్నతండ్రి అత్యాచారం.. గర్భం దాల్చడంతో దారుణం.. చివరికి
ఇదిలా ఉంటే ఈ వ్యాఖ్యలపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పాకిస్తాన్ మరోసారి అధమ స్థితికి చేరుకుందని.. అనాగరిక ప్రేలాపన చేస్తోందని విదేశాంగ శాఖ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. 1971లో బంగ్లాదేశ్ లోని బెంగాలీలు, హిందువులపై జరిగిన మారణహోమాన్ని పాకిస్తాన్ మరిచిపోయిందని, పాక్ పాలకులు సాగించిన మారణ హోమం కనిపించడం లేదని మైనారిటీల పట్ల పాక్ తీరు మారడం లేదని విమర్శలు గుప్పించారు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ. ముంబై, న్యూయార్క్, లండన్, పఠాన్ కోట్, పుల్వామా దాడులు అన్నీ పాకిస్తాన్ కేంద్రంగానే జరిగాయాని అన్నారు. ఒసామా బిన్ లాడెన్ను అమరవీరుడని కీర్తిస్తూ, లఖ్వీ, హఫీజ్ సయీద్, మసూద్ అజార్, సాజిద్ మీర్ , దావూద్ ఇబ్రహీం వంటి ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న దేశం పాకిస్థాన్ అని కేంద్ర మంత్రి మీనాక్షీ లేఖీ విమర్శించారు. బిలావల్ భుట్టో వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులు ఢిల్లీలోని పాకిస్తాన్ ఎంబసీ ముందు ఆందోళన నిర్వహించారు.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!