Karnataka: “బీజేపీకి పాకిస్తాన్ శత్రు దేశం, మాకు కాదు”.. కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: కర్ణాటక రాజకీయాల్లో ‘‘పాకిస్తాన్ జిందాబాద్’’ నినాదాల రచ్చ నడుస్తోంది. నిన్న రాజ్యసభ ఎన్నికల్లో విజయం తర్వాత కాంగ్రెస్ నేత నసీర్ హుస్సేన్ మద్దతుదారులు పాక్ అనుకూల నినాదాలు చేశారు. దీనిపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ వివాదంపై రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందిస్తూ.. ఇది నిజమని తేలితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. బీజేపీ కావాలనే ఇలాంటి కుట్రలకు తెరతీస్తోందని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆరోపించారు. బీజేపీ ఆరోపణల్ని కొట్టిపారేశారు.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ నేత పాకిస్తాన్ అనుకూల వ్యాఖ్యలు చేయడం మరోసారి వివాదాస్పదమైంది. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్సీ హరిప్రసాద్ మాట్లాడుతూ.. బీజేపీకి పాకిస్తాన్ శత్రుదేశం కావచ్చని, కాంగ్రెస్కి మాత్రం పొరుగు దేశమని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ, కాంగ్రెస్ దేశ వ్యతిరేక సెంటిమెంట్లను కలిగిస్తోందని ఆరోపించింది. పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేశారంటూ బీజేపీ ఆరోపణలపై హరిప్రసాద్ స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read
- INS Nipun: భారత నౌకాదళంలోకి స్వదేశీ డైవింగ్ షిప్.. 300 మీటర్ల లోతు వరకు ఆపరేషన్స్
- Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
- GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
- Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
Read Also: Anchor Geetha : స్టేజ్ పైనే రచ్చ రవికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన యాంకర్..
‘‘ వారికి పాకిస్తాన్ శత్రుదేశం. మనకు పాకిస్తాన్ శత్రు దేశంకాదు. అది మన పొరుగు దేశం. బీజేపీ పాకిస్తాన్ శత్రు దేశంగా భావిస్తోందని, ఇటీవల బీజేపీ ఎల్కే అద్వానీకి భారతరత్న అవార్డు ఇచ్చిందని, ఆయన లాహోర్ వెళ్లి జిన్నా సమాధి వద్ద, ఆయన లాంటి సెక్యులర్ నాయకుడు లేరని చెప్పారు. అప్పుడు పాకిస్తాన్ శత్రుదేశంగా కనిపించలేదా..?’’ అంటూ హరిప్రసాద్ శాసనమండలిలో అన్నారు.
ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఘాటుగా స్పందించింది. నాలుగు సార్లు భారత్పై యుద్ధం చేసినా పాకిస్తాన్ని కాంగ్రెస్ శత్రుదేశంగా చూడటం లేదని, ఆ పార్టీ దేశవ్యతిరేక భావాలను కలిగి ఉందని విమర్శించింది. పాకిస్తాన్ పట్ల కాంగ్రెస్ వైఖరిని హరిప్రసాద్ వ్యాఖ్యలు స్పష్టం చేశాయని, జవహర్ లాల్ నెహ్రూ-మహ్మద్ అలీ జిన్నా మధ్య సాన్నిహిత్యం నేటికి కొనసాగుతోందని కర్ణాటక కాంగ్రెస్ స్పష్టం చేసిందని కర్ణాటక బీజేపీ ఎక్స్ వేదికగా ఆరోపించింది. అసెంబ్లీ పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన వారికి అండగా నిలవడమే కాకుండా, భారత్పై నాలుగు సార్లు యుద్ధం చేసిన పాకిస్తాన్ని శత్రుదేశంగా పేర్కొనకపోవడం కాంగ్రెస్ మైండ్సెట్ని తెలియజేస్తోందని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బాదుడే బాదుడే.. కేవలం 26 బంతుల్లోనే..
-
America Deportations: వలసదారులను నరకంలోకి గెంటేస్తోన్న ట్రంప్ సర్కార్.. అమెరికా భయంకర ముఖం ఇదే!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
Rashmika Mandanna: రీఎంట్రీకి సిద్ధమైన రష్మిక.. త్వరలోనే కెమెరా ముందుకు నేషనల్ క్రష్
-
Vaibhav Sooryavanshi: ఫార్మేట్ ఏదైనా ఓకే.. బాదుడు మాత్రం కామన్.. మరో చరిత్ర సృష్టించిన వైభవ్.!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!