Abhishek banerjee: మేము అధికారంలోకి వస్తే, వారి ఇళ్లలోకి వెళ్లి చంపేస్తాం..
- పాకిస్తాన్ వెళ్లి చంపేస్తాం..
- ఎంపీ అభిషేక్ బెనర్జీ వార్నింగ్..
- పాక్ రక్షణమంత్రి వ్యాఖ్యలపై టీఎంసీ..
- బీజేపీ మౌనంపై మమతా బెనర్జీ విమర్శలు..
TMC: పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం ఉద్రిక్తంగా మారుతోంది. టీఎంసీ, బీజేపీల మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. ఇప్పుడు, పాకిస్తాన్ కేంద్రంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా అసిఫ్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. మరోసారి భారత్ దాడి చేస్తే, కోల్కతాపై దాడులు చేస్తామని పాకిస్తాన్ బలుపు మాటలు మాట్లాడుతోంది.
ఈ వ్యాఖ్యలపై మమతా బెనర్జీ మేనల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీ విరుచుకుపడ్డారు. పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ కోల్కతాపై దాడులు చేస్తామని హెచ్చరించినప్పటికీ, ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మౌనం వహిస్తున్నారని ఆరోపించారు. ‘‘ఇండియా కూటమి, మమతా బెనర్జీ కేంద్రంలో అధికారంలోకి వస్తే, పాకిస్తాన్లో వారి ఇళ్లలోకి వెళ్లి దాడులు చేస్తాం’’ అంటూ అభిషేక్ హెచ్చరించారు.
Also Read
Read Also: Kevin Pietersen: ‘ఐపీఎల్ వల్ల నా కెరీర్ నాశనమైంది’.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ సంచలన ప్రకటన
మరోవైపు, టీఎంసీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ కూడా పాక్ రక్షణ మంత్రి వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కేంద్రంపై మండిపడ్డారు. కోల్కతా వంటి నగరంపై దాడులు చేస్తామని బెదిరిస్తుంటే, కేంద్రం స్పందించకపోవడం బాధాకరమని ఆమె అన్నారు. ఎన్నికల సమయంలోనే బీజేపీ బెంగాల్ను గుర్తు చేసుకుంటుందని, ప్రజల భద్రతను పట్టించుకోదని ఆమె ఆరోపించారు.
పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ మాట్లాడుతూ.. భారతదేశం తమపై దాడులకు పాల్పడితే, పాకిస్తాన్ త్వరగా, కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. కోల్కతా లక్ష్యంగా దాడులు చేస్తామని హెచ్చరించారు. దీనికి ముందు, భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ ఇంకా ఆన్లోనే ఉందని, పాకిస్తాన్ ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
తాజావార్తలు
-
Mukesh Ambani: స్టాక్ మార్కెట్లో రిలయన్స్ లాభాల జోరు.. 3 రోజుల్లోనే రూ.1.35 లక్షల కోట్ల ప్రాఫిట్! ఎలా వచ్చాయో తెలుసా?
-
E85 Petrol: పెట్రోల్లో 85% ఇథనాల్.. ఇంధన పరివర్తన దిశగా భారత్..
-
Supplementary exams: పది ఫెయిల్ అయిన విద్యార్థులకు అలర్ట్.. జూన్ 5 నుంచి పరీక్షలు..
-
Pan Masala: గుట్కా ప్రియులకు షాక్.. పాన్ మసాలా ప్యాకెట్లపై కేంద్రం సంచలన నిర్ణయం!
-
UAE OPEC Exit: యూఏఈ ఒపెక్ ఎగ్జిట్.. భారత్కు లాభం, పాకిస్తాన్కు నష్టం..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో