Pakistan: ఎర్రకోట నుంచి కాశ్మీర్ అడవుల వరకు భారత్పై దాడులు చేస్తాం..
- ఎర్రకోట నుంచి కాశ్మీర్ అడవుల వరకు భారత్పై దాడులు చేస్తాం..
- ఢిల్లీ కార్ బ్లాస్ట్, పహల్గామ్ దాడుల గురించి పాక్ లీడర్ వ్యాఖ్యలు..
- ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నట్లు పరోక్షంగా ఒప్పుకున్న అన్వరుల్ హక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందనేది ప్రపంచానికి తెలుసు. ఇటీవల, ఎర్రకోట కార్ బాంబ్ బ్లాస్ట్ వెనక కూడా పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ఉన్నట్లు మన భద్రతా ఏజెన్సీలు తేల్చాయి. ఇదిలా ఉంటే, ఇప్పుడు పాకిస్తానీ లీడర్ చౌదరి అన్వరుల్ హక్ కూడా తాము ఉగ్రవాదానికి పాల్పడుతున్నామని బహిరంగంగా ఒప్పుకున్నాడు. ‘‘ఎర్రకోట నుంచి కాశ్మీర్ అడవుల వరకు’’ భారత్పై దాడులు చేస్తామని చెప్పారు. ఆయన వ్యాఖ్యలు ఇటీవల, ఎర్రకోట ఉగ్రదాడిని ప్రస్తావిస్తోంది. డాక్టర్ ఉగ్రవాది ఉమర్ నబీ ఆత్మాహతికి పాల్పడి, 14 మంది ప్రాణాలు తీశాడు. ఇతడికి జైష్తో సంబంధాలు ఉన్నాయి.
Read Also: Bhuvneshwar Kumar: ఇప్పుడేం కొత్త కాదుగా.. కోల్కతా పిచ్పై భువీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు!
Also Read
- MK Stalin: “విజయ్ ప్రభుత్వం డీఎంకే దయపైనే”.. స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
- Ebola outbreak: ఎబోలా అలర్ట్.. 3 ఆఫ్రికా దేశాలకు వెళ్లొద్దన్న భారత్
- IMD Rain Alert: మండే ఎండల్లో వాతావరణ శాఖ కూల్ అప్ డేట్.. వేగం పుంజుకున్న రుతుపవనాలు.. ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
- West Bengal Re-Poll: బెంగాల్ ఫల్తా ఓట్ల లెక్కింపు ప్రారంభం.. బీజేపీకి ఈ గెలుపు చాలా ముఖ్యం..
హక్ వ్యాఖ్యలు ఇటీవల ఎర్రకోట దాడితో పాటు జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రవాద దాడిని కూడా ప్రస్తావిస్తున్నాయి. పహల్గామ్ దాడిలో 26 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పో్యారు. లష్కరే తోయిబా ప్రాక్సీ సంస్థ అయిన ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ ఈ దాడికి పాల్పడినట్లు బాధ్యత ప్రకటించుకుంది. ఇప్పుడు హక్ వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ‘‘మీరు బలూచిస్తాన్ను రక్తస్రావం చేస్తూనే ఉంటే, ఎర్రకోట నుండి కాశ్మీర్ అడవుల వరకు భారతదేశాన్ని తాకిస్తామని నేను ఇంతకు ముందే చెప్పాను. అల్లా దయతో, మేము దీన్ని చేసాము. వారు ఇప్పటికీ మృతదేహాలను లెక్కించలేకపోతున్నారు.’’ అని అన్నారు. కొన్ని రోజుల క్రితం సాయుధ వ్యక్తులు ఢిల్లీలోకి ప్రవేశించి దాడి చేశారు, వారు ఇప్పటికీ మృతదేహాలను లెక్కించుకుంటున్నారని అని అన్నారు.
పాకిస్తాన్ బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రాంతాల అశాంతి వెనక భారత్ ఉందని ఆరోపిస్తోంది. బలూచ్లో స్వాతంత్ర్యం కోసం బలూచిస్తాన్ లిబరేషర్ ఆర్మీ(బీఎల్ఎఫ్) పాక్ సైన్యం టార్గెట్గా దాడులు చేస్తోంది. ఖైబర్ ప్రాంతంలో పాక్ తాలిబాన్లు ఆ దేశ సైన్యానికి చుక్కలు చూపిస్తున్నారు. సొంత దేశంలో అశాంతిని కట్టడి చేయలేని పాకిస్తాన్, ఆ నిందల్ని భారత్పై తోస్తోంది.
తాజావార్తలు
-
MK Stalin: “విజయ్ ప్రభుత్వం డీఎంకే దయపైనే”.. స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
-
Hyderabad: మాదాపూర్లో అర్ధరాత్రి బైకులు, కార్లతో రేసర్ల హంగామా.. పోలీసులు ఏం చేశారో చూడండి..
-
Motorola Edge 50 Ultra 5G: మోటరోలా ఎడ్జ్ 50 అల్ట్రా 5G పై రూ.26000 డిస్కౌంట్.. 64MP టెలిఫోటో కెమెరా, pOLED డిస్ప్లే
-
AR Rahman Peddi: ‘బాహుబలి’ చూసాకే తెలుగు సినిమాపై ప్రేమ పెరిగింది..
-
SRH: ఐపీఎల్ చరిత్రలో ఆ అరుదైన ఘనత సాధించిన ఏకైక జట్టు ఎస్ఆర్హెచ్.. మళ్లీ 2016 నాటి మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?