Pakistan: కాశ్మీర్లోకి ఉగ్రవాదుల్ని పంపేందుకు.. తన పోస్టును తగలబెట్టుకున్న పాక్ ఆర్మీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: దాయాది దేశం పాకిస్తాన్, భారత్లో అలజడి రేపేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. ముఖ్యంగా జమ్మూకాశ్మీర్లో ఉన్న శాంతి పరిస్థితులు పాకిస్తాన్కి నచ్చడం లేదు. కాశ్మీర్లో దాడులు చేసేందుకు పాక్ స్పాన్సర్డ్ ఉగ్రవాదుల్ని నియంత్రణ రేఖ దాటించి భారత్లోకి పంపేందుకు ప్రయత్నిస్తోంది. అయితే గత రాత్రి నలుగురు ఉగ్రవాదుల్ని, భారత్ లోకి ప్రవేశపెట్టేందుకు పాకిస్తాన్ ఆర్మీ తీవ్రంగా ప్రయత్నించింది.
ఉగ్రవాదుల్ని సరిహద్దులు దాటించేందుకు, భారత నిఘాను మళ్లించేందుకు పాకిస్తాన్ తన సైనిక పోస్టును తానే నిప్పుపెట్టుకుంది. అయితే భారత సైన్యం చొరబాటు ప్రయత్నాలను తిప్పికొట్టింది. భారత సైన్యం జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించగా.. మరో ఇద్దరు పాకిస్తాన్ వైపు పారిపోయారు.
Also Read
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
- Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
- PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
తెల్లవారుజామున ఇండియన్ ఆర్మీ 16 కార్ప్స్, అఖ్నూర్ సెక్టార్లో నలుగురు ఉగ్రవాదుల కదలికల్ని పసిగట్టింది. ఉగ్రవాదులు, సైన్యానికి మధ్య కాల్పులు జరిగాయి. ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. ఒకరి మృతదేహాన్ని మిగిలిన ఉగ్రవాదులు లాక్కెల్లడం కనిపించింది. ఉగ్రవాదులకు ప్రత్యక్షంగా పాకిస్తాన్ ఆర్మీ సహకరిస్తోంది. సరిహద్దుకు అవతల పాకిస్తాన్ ఆక్రమిత్ కాశ్మీర్(పీఓకే)లో ఎల్ఓసీని ఆనుకుని పలు ఉగ్రవాద తండాలు ఉన్నాయి. వీటిని లాంచింగ్ ప్యాడ్స్గా ఉపయోగించుకుని ఉగ్రవాదుల్ని భారత్ లోకి ప్రవేశపెట్టేందుకు పాక్ ఆర్మీ ప్రయత్నిస్తోంది.
ఇదిలా ఉంటే గురువారం పూంచ్ లో ఉగ్రవాదులు ఆర్మీ వాహనాలపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు ఆర్మీ సిబ్బంది వీరమరణం పొందారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం ఇండియన్ ఆర్మీ భారీ ఆపరేషన్ ప్రారంభించింది.
తాజావార్తలు
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App Update: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
-
Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
-
Bill Gates: నేనెవరినీ వేధించలేదు.. ఎప్స్టీన్ కేసు విచారణలో బిల్గేట్స్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!