Pahalgam Terrorists: పహల్గామ్ ఉగ్రవాదులు హతం.. వెలుగులోకి ఫొటోలు
- పహల్గామ్ ఉగ్రవాదులు హతం
- వెలుగులోకి ఫొటోలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పహల్గామ్లో మారణహోమం సృష్టించిన ముష్కరులు హతమయ్యారు. సైన్యం చేపట్టిన ఆపరేషన్ మహాదేవ్లో ముగ్గురు ఉగ్రవాదులు కుక్కచావు చచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా సైన్యం అధికారికంగా ధృవీకరించినట్లు ఆలిండియా రేడియో వైబ్సైట్లో పేర్కొంది. దట్టమైన అడవీ ప్రాంతంలో ఒక డేరాలో వారు ఉన్నట్లుగా ఫొటోలో కనిపిస్తోంది. అస్సాల్ట్ రైఫిళ్లతో ఉగ్రవాదుల మృతదేహాలు కనిపించాయి. చెట్ల మధ్య ఒక పెద్ద ఆకుపచ్చ దుప్పటి వేలాడుతూ కనిపించింది. తాత్కాలిక డేరాలో బట్టలు, దుప్పట్లు, ప్లాస్టిక్ సంచులు, ఆహారం, ప్లేట్ల చిందరవందరగా ఉన్న కుప్ప కనిపిస్తోంది.
ఇది కూడా చదవండి: Rajnath Singh: ఆపరేషన్ సిందూర్తో పాక్కు బుద్ధి చెప్పాం
Also Read
- PM Modi: నార్వే నుంచి ఇటలీకి బయల్దేరిన మోడీ.. జార్జియా మెలోనితో భేటీకానున్న ప్రధాని
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పండగలాంటి న్యూస్.. ఇకపై నిమిషాల్లోనే జేబుల్లోకి క్యాష్!
- PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
- CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
భద్రతా దళాలు సోమవారం ‘ఆపరేషన్ మహాదేవ్’ ప్రారంభించింది. శ్రీనగర్ సమీపంలోని లిద్వాస్లోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు హతమయ్యారని భారత సైన్యం తెలిపింది. హతమైన వారిలో లష్కరే తోయిబా ఉగ్రవాది సులేమాన్ ఉన్నాడు. ఇతడే పహల్గామ్ ఉగ్ర దాడిలో ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు. మరో ఇద్దరు ఉగ్రవాదులను అబూ హమ్జా, యాసిర్గా గుర్తించారు. ప్రస్తుతం ఇంకా ఆపరేషన్ కొనసాగుతోందని సైన్యం వెల్లడించింది.
ఉగ్రవాదుల నుంచి అనేక గ్రెనేడ్లు, ఏకే-47 రైఫిళ్లు స్వాధీనం చేసుకున్నారు. 14 రోజుల క్రితం అనుమానాస్పద సంభాషణను సైన్యం పసిగట్టింది. అంతేకాకుండా సంచార జాతుల వారు ఇచ్చిన పక్కా సమాచారంతో సైన్యం ఆపరేషన్ చేపట్టి చంపేసినట్లుగా తెలుస్తోంది.
సోమవారం ఉదయం 11:30 గంటల ప్రాంతంలో సైన్యం ఉగ్రవాదుల జాడను గుర్తించాయి. ఆ సమాచారాన్ని సంచార జాతుల వారు కూడా పక్కాగా నిర్ధారించారు. అంతే అత్యంత వ్యూహాత్మకంగా సైన్యం ప్రణాళికను అమలు చేసింది. ఉన్న చోటనే ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది.
ఏప్రిల్ 22న పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. మతం పేరుతో 26 మందిని పొట్టనపెట్టుకున్నారు. భార్య, పిల్లల ఎదుటే భర్తలను చంపేశారు. ఈ ఘటన యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అనంతరం భారత ప్రభుత్వం మే 7న ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. వంద మంది ఉగ్రవాదులను హతమార్చారు. అంతేకాకుండా పాకిస్థాన్ వైమానిక స్థావరాలను కూడా ధ్వంసం చేశారు. ఇక పహల్గామ్ ఉగ్రవాదుల కోసం సైన్యం ఎప్పటి నుంచి వేటాడుతోంది. అనూహ్యంగా సోమవారం పార్లమెంట్లో ఆపరేషన్ సిందూర్పై చర్చ జరుగుతున్న సమయంలో ఉగ్రవాదుల్ని ఆశ్చర్యంగా సైన్యం హతమార్చింది. ఇక ఉగ్రవాదులు హతం కావడంతో బాధిత కుటుంబాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. దేశమంతా సంబరాలు చేసుకుంటున్నారు.

తాజావార్తలు
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
-
RR Vs LSG: మార్ష్ వీర విహారం.. రాజస్థాన్ రాయల్స్ ముందు భారీ టార్గెట్..
-
Chairmans Desk : ప్రపంచమంతా మాంద్యం గుప్పిట్లో ఉంటే.. దక్షిణాది మాత్రం సేఫ్ జోన్లోనే ఉందా..? |
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!