Asaduddin Owaisi: ‘‘నా టోపీ, గడ్డాన్ని చూసి అలా పిలుస్తావా.?’’ తేజస్వీపై ఓవైసీ ఆగ్రహం..
- తేజస్వీ యాదవ్కు ఓవైసీ సవాల్..
- ‘‘ఉగ్రవాది’’ని ఇంగ్లీష్లో రాయగలవా..?
- నా టోపీ, గడ్డాన్ని చూసి అలా అంటావా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddin Owaisi: బీహార్ ఎన్నికలకు మరో కొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో అందరు నేతలు ప్రచారాన్ని తీవ్రం చేశారు. తాజాగా, ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తేజస్వీ యాదవ్, ఓవైసీని ‘‘ఉగ్రవాది’’గా పిలవడం కొత్త వివాదానికి కారణమైంది. దీనిపై ఓవైసీ స్పందిస్తూ.. ‘‘బాబు ఉగ్రవాది(extremist)ని ఇంగ్లీషులో రాయగలరా..?’’ అంటూ సెటైర్లు వేశారు.
Read Also: Chevella Bus Accident: గతంలో ప్రయాణికులను కాపాడిన బస్సు డ్రైవర్ దస్తగిరి.. ఈ ప్రమాదంలో మృతి!
Also Read
- PM Modi: GSLV-F17 సక్సెస్.. ‘భారత్ అంతరిక్ష శక్తి మరింత పెరుగుతోంది’.. ISROపై మోడీ ప్రశంసలు!
- Sugar Price: సామాన్యులకు గుడ్న్యూస్! కేంద్రం సంచలన నిర్ణయం.. చక్కెర ధరలు దిగి వస్తాయా?
- Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
- Chatgpt: చాట్ జీపీటీలో అంతరాయం.. వినియోగదారుల్లో ఆందోళన
కిషన్ గంజ్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఓవైసీ మాట్లాడుతూ.. ‘‘ ఓవైసీతో ఎందుకు పొత్తు పెట్టుకోలేదు అని ఒక ఇంటర్వ్యూలో తేజస్వీ యాదవ్ను అడిగారు. ఓవైసీ ఒక ఉగ్రవాది, ఒక మతోన్మాది, ఒక ఉగ్రవాది అని తేజస్వీ అన్నారు. నేను నా మతాన్ని గర్వంగా అనుసరిస్తున్నాను కాబట్టి ఆయన నన్ను ఉగ్రవాది అని పిలుస్తారు’’ అని అడిగారు. ‘‘నీ ముందు వంగి నమస్కరించని వాడిని, అడుక్కోని వాడిని, నీ తండ్రి(లాలూ ప్రసాద్ యాదవ్)కు భయపడిని వాడిని.. నువ్వు అతడిని పిరికి వాడు అంటావా.? నా ముఖం మీద గడ్డ, తలపై టోపీ.. అది నన్ను ఉగ్రవాదిగా చేస్తుందా..? నీలో ఎంత ద్వేషం ఉంది’’ అని ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తేజస్వీ యాదవ్ పాకిస్తాన్ భాష మాట్లాడుతున్నాడు అని ఫైర్ అయ్యారు. తేజస్వీ యాదవ్ పూర్తిగా సీమాంచల్ ప్రాంతాన్ని అవమానించారని అన్నారు.
ఎన్నికల ముందు ఓవైసీ, తేజస్వీతో పొత్తుపై చర్చలు జరిగాయి. ఎంఐఎంకు ఆరు సీట్లు ఇస్తామని ఆర్జేడీ ఆఫర్ చేసినట్లు వార్తలు వచ్చాయి, దీనిని ఎవరూ అంగీకరించలేదు. దీంతో ఎంఐఎం బీహార్లోని 243 సీట్లలో 100 సీట్లలో ఒంటరిగా పోటీ చేయాలని ప్రణాళిక వేసింది. తాము మూడో ఫ్రంట్ను ఏర్పాటు చేస్తామని ఎంఐఎం ఆశాభావం వ్యక్తం చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న సీమాంచల్ ప్రాంతంలో ఐదు సీట్లు సాధించింది. ఆ తర్వాత ఇందులో నలుగురు ఎమ్మెల్యేలు ఆర్జేడీ పార్టీలో చేరగా, ఒక వ్యక్తి మరణించారు.
#WATCH | Kishanganj, Bihar | AIMIM Chief Asaduddin Owaisi says, "… Today an interviewer asked Tejashwi Yadav why he didn't align with Owaisi. Tejashwi said that Owaisi is an extremist, a fanatic, a terrorist… I ask Tejashwi, 'babu extremist ko tum zara angrezi mein likh ke… pic.twitter.com/vNiIgtm20h
— ANI (@ANI) November 2, 2025
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బీసీసీఐ సమీక్ష సమావేశం.. వైభవ్ సూర్యవంశీపై కీలక నిర్ణయం!
-
Hanuman Ansh: సెహ్వాగ్ ప్రశంసలతో ఉబ్బితబ్బిపోయిన దర్శకుడు.. ఇప్పుడు విరాట్, అనుష్కపై కన్ను!
-
Motorola Edge 70 Plus: 200MP కెమెరా.. 6500mAh బ్యాటరీ! Motorola Edge 70 Plus ఫోన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Siva Nirvana: తమిళ స్టార్తో ‘ఇరుముడి’ డైరెక్టర్ సినిమా.. ఈ కాంబో నిజమైతే మామూలుగా ఉండదు!
-
PM Modi: GSLV-F17 సక్సెస్.. ‘భారత్ అంతరిక్ష శక్తి మరింత పెరుగుతోంది’.. ISROపై మోడీ ప్రశంసలు!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!