Asaduddian Owaisi: ఓటింగ్ అడ్డుకోవడానికి బీజేపీ ముస్లిం మహిళల్ని బీజేపీ టార్గెట్ చేస్తోంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddian Owaisi: ముస్లిం మహిళల్ని లక్ష్యంగా చేసుకుని ఓటింగ్ సమయంలో అడ్డంకులు సృష్టించాలని బీజేపీ భావిస్తోందని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. మే 25న ఢిల్లీలోని 7 ఎంపీ స్థానాలకు జరిగే ఎన్నికల్లో ఓటింగ్ ప్రక్రియ ముస్లింల మహిళల్ని అడ్డుకోవాలని బీజేపీ అనుకుంటోందని ఆయన గురువారం అన్నారు. ఓటింగ్ సమయంలో బురఖా ధరించిన మహిళల్ని సరైన ధృవీకరణ చేయాలని బీజేపీ ఢిల్లీ యూనిట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ని కోరింది. దీని తర్వాత అసదుద్దీన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘బురఖా ధరించిన మహిళలను ప్రత్యేకంగా తనిఖీ చేయాలని బీజేపీ ఢిల్లీ విభాగం ఎన్నికల కమిషన్కు తెలిపింది. తెలంగాణలో ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల సందర్భంగా, వారి అభ్యర్థి ముస్లిం మహిళలను బహిరంగంగా అవమానించారు మరియు వేధించారు. ప్రతి ఎన్నికలలో, బీజేపీ కొంత మందిని లక్ష్యంగా చేసుకుంటుంది. ముస్లిం మహిళలను లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారు’’ అని ఎక్స్ వేదికగా ఆరోపిస్తూ ట్వీట్ చేశారు.
Also Read
- Punjab: జంతర్ మంతర్-ఉగ్రకుట్ర కేసు ప్రకంపనలు.. అమృత్సర్ పోలీస్ చీఫ్కు ట్రాన్స్ఫర్
- Biogas Blended CNG: E20 తర్వాత ఇప్పుడు CNGలో బయోగ్యాస్ మిశ్రమం.. మీ కారుపై ప్రభావం ఉంటుందా..?
- Monsoon: హిందూ మహాసముద్రంలో భారీ మేఘం.. భారీ వర్షాలు కురిసే అవకాశం
- Nirmala Sitharaman: యూపీఐపై గుడ్న్యూస్ చెప్పిన నిర్మలా సీతారామన్
Read Also: Bangladesh MP: చర్మం వలిచి, శరీరం నుంచి ఎముకలు వేరు చేసి.. బంగ్లా ఎంపీ హత్య కేసులో సంచలన విషయాలు..
‘‘బురఖాలో ఉన్నా మహిళకు ఎన్నికల సంఘం స్పష్టమైన నియమాలను, నిబంధనల్ని కలిగి ఉంది, ధృవీకరణ లేకుండా ఎవరూ ఓటు వేయడానికి అనుమతించరు, కాబట్టి బిజెపి ఎందుకు ఇంత ప్రత్యేక డిమాండ్ చేయాల్సి వచ్చింది? ముస్లిం మహిళలను లక్ష్యంగా చేసుకుని, వారిని వేధించి, ఓటు వేయకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారు.’’ అని అన్నారు.
ఢిల్లీలోని ఎమ్మెల్యేలు అజయ్ మహావర్, మోహన్ సింగ్ బిష్త్, రాష్ట్ర కార్యదర్శి కిషన్ శర్మ, న్యాయవాది నీరజ్ గుప్తాలతో కూడిన ఢిల్లీ బీజేపీ ప్రతినిధి బృందం బుధవారం ఢిల్లీ సీఈవోను కలిసి బురఖా ధరించి ఓటు వేసేందుకు వస్తున్న మహిళా ఓటర్లను సరైన రీతిలో ధృవీకరించాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రం సమర్పించింది. ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించిన మహావర్ మాట్లాడుతూ.. బురఖా లేదా ముఖానికి మాస్క్లు ధరించి ఓటు వేయడానికి వచ్చే వారిని సమగ్ర విచారణ తర్వాతే ఓటు వేయడానికి అనుమతించాలి. మహిళా అధికారి లేదా మహిళా పోలీసు అధికారి వారి ముఖాన్ని తనిఖీ చేయాలని కోరారు.
తాజావార్తలు
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
-
OTR: ఖద్దర్ వర్సెస్ కలెక్టర్
-
OTR : నిజామాబాద్ గులాబీ కోటలో గందరగోళం.. నేతల తీరు చర్చనీయాంశం!
-
CM Revanth Reddy: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మార్చేలా వ్యూహం.. సీఎం రేవంత్, అరవింద్ సుబ్రమణియన్ చర్చలు..
-
AP IAS Transfers 2026: 22 మంది IAS అధికారుల బదిలీలు.. కీలక శాఖల్లో మార్పులు.. ఆమ్రపాలికి నో పోస్టింగ్..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!