Asaduddian Owaisi: ఓటింగ్ అడ్డుకోవడానికి బీజేపీ ముస్లిం మహిళల్ని బీజేపీ టార్గెట్ చేస్తోంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddian Owaisi: ముస్లిం మహిళల్ని లక్ష్యంగా చేసుకుని ఓటింగ్ సమయంలో అడ్డంకులు సృష్టించాలని బీజేపీ భావిస్తోందని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. మే 25న ఢిల్లీలోని 7 ఎంపీ స్థానాలకు జరిగే ఎన్నికల్లో ఓటింగ్ ప్రక్రియ ముస్లింల మహిళల్ని అడ్డుకోవాలని బీజేపీ అనుకుంటోందని ఆయన గురువారం అన్నారు. ఓటింగ్ సమయంలో బురఖా ధరించిన మహిళల్ని సరైన ధృవీకరణ చేయాలని బీజేపీ ఢిల్లీ యూనిట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ని కోరింది. దీని తర్వాత అసదుద్దీన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘బురఖా ధరించిన మహిళలను ప్రత్యేకంగా తనిఖీ చేయాలని బీజేపీ ఢిల్లీ విభాగం ఎన్నికల కమిషన్కు తెలిపింది. తెలంగాణలో ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల సందర్భంగా, వారి అభ్యర్థి ముస్లిం మహిళలను బహిరంగంగా అవమానించారు మరియు వేధించారు. ప్రతి ఎన్నికలలో, బీజేపీ కొంత మందిని లక్ష్యంగా చేసుకుంటుంది. ముస్లిం మహిళలను లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారు’’ అని ఎక్స్ వేదికగా ఆరోపిస్తూ ట్వీట్ చేశారు.
Also Read
- El Nino-Centre: ఎల్నినోపై కేంద్రం అలర్ట్.. వాటి విషయంలో ఆందోళన అక్కర్లేదని భరోసా
- CM Vijay: తిరుచ్చిలో విజయ్ భారీ సభ.. సీఎంగా కాదు.. సేవకుడిగా వచ్చా.. అదే టార్గెట్..!
- Bengaluru Traffic: కడుపుతో ఉన్న భార్య కోసం ఖాకీలతోని కొట్లాట.. నడిరోడ్డుపై కూర్చున్న సామాన్యుడు! వీడియో వైరల్..
- Kalita Majhi: బెంగాల్ రాజకీయాల్లో సామాన్య ఆడబిడ్డ సంచలనం .. రాష్ట్ర మంత్రిగా ఇళ్లల్లో పనులు చేసుకునే మహిళ !
Read Also: Bangladesh MP: చర్మం వలిచి, శరీరం నుంచి ఎముకలు వేరు చేసి.. బంగ్లా ఎంపీ హత్య కేసులో సంచలన విషయాలు..
‘‘బురఖాలో ఉన్నా మహిళకు ఎన్నికల సంఘం స్పష్టమైన నియమాలను, నిబంధనల్ని కలిగి ఉంది, ధృవీకరణ లేకుండా ఎవరూ ఓటు వేయడానికి అనుమతించరు, కాబట్టి బిజెపి ఎందుకు ఇంత ప్రత్యేక డిమాండ్ చేయాల్సి వచ్చింది? ముస్లిం మహిళలను లక్ష్యంగా చేసుకుని, వారిని వేధించి, ఓటు వేయకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారు.’’ అని అన్నారు.
ఢిల్లీలోని ఎమ్మెల్యేలు అజయ్ మహావర్, మోహన్ సింగ్ బిష్త్, రాష్ట్ర కార్యదర్శి కిషన్ శర్మ, న్యాయవాది నీరజ్ గుప్తాలతో కూడిన ఢిల్లీ బీజేపీ ప్రతినిధి బృందం బుధవారం ఢిల్లీ సీఈవోను కలిసి బురఖా ధరించి ఓటు వేసేందుకు వస్తున్న మహిళా ఓటర్లను సరైన రీతిలో ధృవీకరించాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రం సమర్పించింది. ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించిన మహావర్ మాట్లాడుతూ.. బురఖా లేదా ముఖానికి మాస్క్లు ధరించి ఓటు వేయడానికి వచ్చే వారిని సమగ్ర విచారణ తర్వాతే ఓటు వేయడానికి అనుమతించాలి. మహిళా అధికారి లేదా మహిళా పోలీసు అధికారి వారి ముఖాన్ని తనిఖీ చేయాలని కోరారు.
తాజావార్తలు
-
Telangana Farmers: ఆ రైతులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. టన్నుకు రూ.351 పెంపు..
-
Origin of Telangana: ‘తెలంగాణ’ పేరు ఎప్పడిదో తెలుసా? వందల ఏండ్ల కిందటి ఈ సీక్రెట్ హిస్టరీ సూస్తే మైండ్ పోవాల్సిందే!
-
El Nino-Centre: ఎల్నినోపై కేంద్రం అలర్ట్.. వాటి విషయంలో ఆందోళన అక్కర్లేదని భరోసా
-
Pawan Kalyan: పవన్ కల్యాణ్కు తెలంగాణ పోలీసుల షాక్.. నో పర్మిషన్..
-
Vaibhav Vs Jaiswal: పాపం యశస్వి జైస్వాల్.. ‘ఎంత పని చేశావ్ వైభవ్ సూర్యవంశీ’..
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!