Asaduddian Owaisi: ఓటింగ్ అడ్డుకోవడానికి బీజేపీ ముస్లిం మహిళల్ని బీజేపీ టార్గెట్ చేస్తోంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddian Owaisi: ముస్లిం మహిళల్ని లక్ష్యంగా చేసుకుని ఓటింగ్ సమయంలో అడ్డంకులు సృష్టించాలని బీజేపీ భావిస్తోందని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. మే 25న ఢిల్లీలోని 7 ఎంపీ స్థానాలకు జరిగే ఎన్నికల్లో ఓటింగ్ ప్రక్రియ ముస్లింల మహిళల్ని అడ్డుకోవాలని బీజేపీ అనుకుంటోందని ఆయన గురువారం అన్నారు. ఓటింగ్ సమయంలో బురఖా ధరించిన మహిళల్ని సరైన ధృవీకరణ చేయాలని బీజేపీ ఢిల్లీ యూనిట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ని కోరింది. దీని తర్వాత అసదుద్దీన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘బురఖా ధరించిన మహిళలను ప్రత్యేకంగా తనిఖీ చేయాలని బీజేపీ ఢిల్లీ విభాగం ఎన్నికల కమిషన్కు తెలిపింది. తెలంగాణలో ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల సందర్భంగా, వారి అభ్యర్థి ముస్లిం మహిళలను బహిరంగంగా అవమానించారు మరియు వేధించారు. ప్రతి ఎన్నికలలో, బీజేపీ కొంత మందిని లక్ష్యంగా చేసుకుంటుంది. ముస్లిం మహిళలను లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారు’’ అని ఎక్స్ వేదికగా ఆరోపిస్తూ ట్వీట్ చేశారు.
Also Read
- Nitesh Rane: అమీర్ ఖాన్ మూడో పెళ్లిపై బీజేపీ మంత్రి నితేష్ రాణే విమర్శలు.. 'లవ్ జిహాద్ బ్రాండ్ అంబాసిడర్' అంటూ ఫైర్!
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
- Bankra mosque: కోల్కతా ఎయిర్పోర్టు పక్కన 136 ఏళ్ల మసీదు తరలింపు..
Read Also: Bangladesh MP: చర్మం వలిచి, శరీరం నుంచి ఎముకలు వేరు చేసి.. బంగ్లా ఎంపీ హత్య కేసులో సంచలన విషయాలు..
‘‘బురఖాలో ఉన్నా మహిళకు ఎన్నికల సంఘం స్పష్టమైన నియమాలను, నిబంధనల్ని కలిగి ఉంది, ధృవీకరణ లేకుండా ఎవరూ ఓటు వేయడానికి అనుమతించరు, కాబట్టి బిజెపి ఎందుకు ఇంత ప్రత్యేక డిమాండ్ చేయాల్సి వచ్చింది? ముస్లిం మహిళలను లక్ష్యంగా చేసుకుని, వారిని వేధించి, ఓటు వేయకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారు.’’ అని అన్నారు.
ఢిల్లీలోని ఎమ్మెల్యేలు అజయ్ మహావర్, మోహన్ సింగ్ బిష్త్, రాష్ట్ర కార్యదర్శి కిషన్ శర్మ, న్యాయవాది నీరజ్ గుప్తాలతో కూడిన ఢిల్లీ బీజేపీ ప్రతినిధి బృందం బుధవారం ఢిల్లీ సీఈవోను కలిసి బురఖా ధరించి ఓటు వేసేందుకు వస్తున్న మహిళా ఓటర్లను సరైన రీతిలో ధృవీకరించాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రం సమర్పించింది. ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించిన మహావర్ మాట్లాడుతూ.. బురఖా లేదా ముఖానికి మాస్క్లు ధరించి ఓటు వేయడానికి వచ్చే వారిని సమగ్ర విచారణ తర్వాతే ఓటు వేయడానికి అనుమతించాలి. మహిళా అధికారి లేదా మహిళా పోలీసు అధికారి వారి ముఖాన్ని తనిఖీ చేయాలని కోరారు.
తాజావార్తలు
-
Harry Brook: అన్నంత పనిచేశాడు.. పక్కాగా స్కెచ్ వేసి టీమిండియాను మట్టికరిపించిన ఇంగ్లాండ్ కెప్టెన్!
-
Lenin Box Office Collections: బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న ‘లెనిన్’.. రెండు రోజుల్లోనే 37 కోట్లకు పైగా వసూళ్లు!
-
Kranti Gaud History: ప్రతిష్టాత్మక లార్డ్స్లో క్రాంతి గౌడ్ చరిత్ర.. తొలి బౌలర్గా రేర్ రికార్డు!
-
Harish Rao: “నీకు మా రక్తం కావాలా”.. సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై హరీష్ రావు ఫైర్..
-
Muzammil Ibrahim: ప్రేమను మొదలుపెట్టింది ఆమెనే, కానీ బ్రేకప్ చేసింది నేనే!.. దీపికా మాజీ ప్రియుడి సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..