Asaduddian Owaisi: ఓటింగ్ అడ్డుకోవడానికి బీజేపీ ముస్లిం మహిళల్ని బీజేపీ టార్గెట్ చేస్తోంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddian Owaisi: ముస్లిం మహిళల్ని లక్ష్యంగా చేసుకుని ఓటింగ్ సమయంలో అడ్డంకులు సృష్టించాలని బీజేపీ భావిస్తోందని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. మే 25న ఢిల్లీలోని 7 ఎంపీ స్థానాలకు జరిగే ఎన్నికల్లో ఓటింగ్ ప్రక్రియ ముస్లింల మహిళల్ని అడ్డుకోవాలని బీజేపీ అనుకుంటోందని ఆయన గురువారం అన్నారు. ఓటింగ్ సమయంలో బురఖా ధరించిన మహిళల్ని సరైన ధృవీకరణ చేయాలని బీజేపీ ఢిల్లీ యూనిట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ని కోరింది. దీని తర్వాత అసదుద్దీన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘బురఖా ధరించిన మహిళలను ప్రత్యేకంగా తనిఖీ చేయాలని బీజేపీ ఢిల్లీ విభాగం ఎన్నికల కమిషన్కు తెలిపింది. తెలంగాణలో ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల సందర్భంగా, వారి అభ్యర్థి ముస్లిం మహిళలను బహిరంగంగా అవమానించారు మరియు వేధించారు. ప్రతి ఎన్నికలలో, బీజేపీ కొంత మందిని లక్ష్యంగా చేసుకుంటుంది. ముస్లిం మహిళలను లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారు’’ అని ఎక్స్ వేదికగా ఆరోపిస్తూ ట్వీట్ చేశారు.
Also Read
- Petrol and Diesel Prices: మళ్లీ పెరగనున్న పెట్రో ధరలు..! ఇంధన ధరలపై నిపుణుల హెచ్చరిక
- Borewell Rescue: 10 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్.. 300 అడుగుల బోర్వెల్లో చిక్కుకున్న చిన్నారి సురక్షితం.!
- India Unemployment: ఆరు నెలల గరిష్ఠానికి చేరిన భారత నిరుద్యోగ రేటు.. ఏప్రిల్లో 5.2% శాతానికి
- PM Kisan 23th Installment Update: పీఎం కిసాన్ 23వ విడత.. రైతుల ఖాతాల్లో రూ. 2,000 ఎప్పుడు జమ అవుతాయంటే?
Read Also: Bangladesh MP: చర్మం వలిచి, శరీరం నుంచి ఎముకలు వేరు చేసి.. బంగ్లా ఎంపీ హత్య కేసులో సంచలన విషయాలు..
‘‘బురఖాలో ఉన్నా మహిళకు ఎన్నికల సంఘం స్పష్టమైన నియమాలను, నిబంధనల్ని కలిగి ఉంది, ధృవీకరణ లేకుండా ఎవరూ ఓటు వేయడానికి అనుమతించరు, కాబట్టి బిజెపి ఎందుకు ఇంత ప్రత్యేక డిమాండ్ చేయాల్సి వచ్చింది? ముస్లిం మహిళలను లక్ష్యంగా చేసుకుని, వారిని వేధించి, ఓటు వేయకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారు.’’ అని అన్నారు.
ఢిల్లీలోని ఎమ్మెల్యేలు అజయ్ మహావర్, మోహన్ సింగ్ బిష్త్, రాష్ట్ర కార్యదర్శి కిషన్ శర్మ, న్యాయవాది నీరజ్ గుప్తాలతో కూడిన ఢిల్లీ బీజేపీ ప్రతినిధి బృందం బుధవారం ఢిల్లీ సీఈవోను కలిసి బురఖా ధరించి ఓటు వేసేందుకు వస్తున్న మహిళా ఓటర్లను సరైన రీతిలో ధృవీకరించాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రం సమర్పించింది. ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించిన మహావర్ మాట్లాడుతూ.. బురఖా లేదా ముఖానికి మాస్క్లు ధరించి ఓటు వేయడానికి వచ్చే వారిని సమగ్ర విచారణ తర్వాతే ఓటు వేయడానికి అనుమతించాలి. మహిళా అధికారి లేదా మహిళా పోలీసు అధికారి వారి ముఖాన్ని తనిఖీ చేయాలని కోరారు.
తాజావార్తలు
-
Hanuman : మళ్లీ ‘హనుమాన్’ జాతర.. ఈసారి 3Dలో థియేటర్లు దద్దరిల్లడం ఖాయం!
-
Petrol and Diesel Prices: మళ్లీ పెరగనున్న పెట్రో ధరలు..! ఇంధన ధరలపై నిపుణుల హెచ్చరిక
-
Borewell Rescue: 10 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్.. 300 అడుగుల బోర్వెల్లో చిక్కుకున్న చిన్నారి సురక్షితం.!
-
Naresh : నరేష్ గ్యారేజ్లోకి కొత్త బీస్ట్: రూ. 2.7 కోట్ల పోర్షే కారు కొన్న తొలి టాలీవుడ్ నటుడు!
-
Rishabh Pant Fined: విజయం సాధించినా.. LSG కెప్టెన్ కు తప్పని భారీ ఫైన్..!
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..