Pakistan: కాన్వాయ్పై ఆత్మాహుతి దాడి.. ఆరుగురు చైనా పౌరుల మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్లో ఆత్మాహుతి దాడి బీభత్సం సృష్టించింది. చైనా డ్రైవర్ సహా ఐదుగురు ఇంజనీర్లు మృతి చెందారు. ఖైబర్ పఖ్తుంఖ్వా రాష్ట్రంలో ఈ ఆత్మాహుతి దాడి జరిగింది. ఆరుగురు చైనా పౌరులు మృతి చెందారని అధికారులు వెల్లడించారు.
మంగళవారం పాక్లో ఆత్మాహుతి బాంబర్ జరిపిన దాడిలో ఐదుగురు చైనా జాతీయులు.. వారి డ్రైవర్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. చైనా ఇంజనీర్ల కాన్వాయ్.. ఇస్లామాబాద్ నుంచి ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్లోని వారి క్యాంప్కు వెళుతుండగా ఈ ఆత్మాహుతి దాడి జరిగింది. ఆత్మాహుతి బాంబర్ భారీ పేలుడు పదార్థాలతో వాహనాన్ని ఢీకొట్టడంతో ఆరుగురు చైనా పౌరులు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు.
Also Read
- IND vs ENG 2nd ODI: వన్డే సిరీస్పై కన్నేసిన టీమిండియా.. నేడు రెండో వన్డే.! పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ XI, మ్యాచ్ వివరాలు ఇవే..!
- Thursday Horoscope: ఆ రాశివారు అనుకున్న పనుల అంచనాలు తారుమారతాయి.. జాగ్రత్త సుమీ..!
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
ఇది కూడా చదవండి: Sujana Chowdary: అధిష్టానం ఆదేశిస్తే అక్కడి నుంచి పోటీ చేస్తా..
సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ దాడిలో ఐదుగురు చైనా జాతీయులు, పాకిస్థానీ డ్రైవర్ మరణించారు అని ఉన్నత పోలీసు అధికారి తెలిపారు, అయితే కాన్వాయ్లోని మిగిలిన వ్యక్తులు మత్రం సురక్షితంగా ఉన్నారని తెలిపారు.
ఆత్మాహుతి దాడిని పాక్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ తీవ్రంగా ఖండించారు పాకిస్తాన్-చైనా స్నేహానికి హాని కలిగించేందుకు దుష్టశక్తులు ఎప్పటికీ విజయం సాధించలేరని ఆయన పేర్కొన్నారు. మృతి చెందిన చైనా కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేశారు. అలాగే విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ కూడా ఈ దాడిని ఖండించారు. దేశంలో ఉగ్రవాదులపై పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు.
జలవిద్యుత్ ప్రాజెక్ట్లో పని చేస్తున్న నిర్మాణ సంస్థ చైనా గెజౌబా గ్రూప్ కంపెనీ.. తన సిబ్బందిని కాన్వాయ్లో తీసుకువెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లుగా స్థానిక మీడియా తెలిపింది. 2021లో ఇదే కంపెనీపై దాడి జరిగింది. తొమ్మిది మంది చైనా పౌరులు సహా 13 మంది చనిపోయారు. ఆ సమయంలో మరణించిన చైనా కార్మికుల కుటుంబాలకు పాకిస్తాన్ లక్షలాది రూపాయల పరిహారం చెల్లించింది . దాడిపై విచారణకు చైనా తన బృందాన్ని కూడా పంపింది. తాజాగా జరిగిన దాడిలో ఐదుగురు ఇంజనీర్లు ప్రాణాలు కోల్పోయారు.
తాజావార్తలు
-
Dhanush – Anirudh : ధనుష్ – అనిరుధ్ మధ్య ఫ్రెండ్షిప్ చెడిందా..?
-
Kia Syros EV: 526KM రేంజ్, లెవెల్-2 ADAS భద్రతా ఫీచర్లతో.. కియా సైరోస్ EV భారత్ లో విడుదల
-
IND vs ENG 2nd ODI: వన్డే సిరీస్పై కన్నేసిన టీమిండియా.. నేడు రెండో వన్డే.! పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ XI, మ్యాచ్ వివరాలు ఇవే..!
-
Thursday Horoscope: ఆ రాశివారు అనుకున్న పనుల అంచనాలు తారుమారతాయి.. జాగ్రత్త సుమీ..!
-
AP Movie Ticket Prices: టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నిర్మాతలకే పూర్తి స్వేచ్ఛ ?
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!