Pakistan: కాన్వాయ్పై ఆత్మాహుతి దాడి.. ఆరుగురు చైనా పౌరుల మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్లో ఆత్మాహుతి దాడి బీభత్సం సృష్టించింది. చైనా డ్రైవర్ సహా ఐదుగురు ఇంజనీర్లు మృతి చెందారు. ఖైబర్ పఖ్తుంఖ్వా రాష్ట్రంలో ఈ ఆత్మాహుతి దాడి జరిగింది. ఆరుగురు చైనా పౌరులు మృతి చెందారని అధికారులు వెల్లడించారు.
మంగళవారం పాక్లో ఆత్మాహుతి బాంబర్ జరిపిన దాడిలో ఐదుగురు చైనా జాతీయులు.. వారి డ్రైవర్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. చైనా ఇంజనీర్ల కాన్వాయ్.. ఇస్లామాబాద్ నుంచి ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్లోని వారి క్యాంప్కు వెళుతుండగా ఈ ఆత్మాహుతి దాడి జరిగింది. ఆత్మాహుతి బాంబర్ భారీ పేలుడు పదార్థాలతో వాహనాన్ని ఢీకొట్టడంతో ఆరుగురు చైనా పౌరులు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు.
Also Read
- West Bengal: "రాళ్లతో కొట్టారు?".. టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై దాడి
- Kharif 2026: రైతులకు శుభవార్త.. సాగునీటిని విడుదల చేసిన ప్రభుత్వం!
- UP: బక్రీద్ రోజు హిందూ యువకుడి దారుణ హత్య.. పోలీసుల ఎన్కౌంటర్లో ప్రధాన నిందితుడు అసద్ ఖతం..
- East Godavari Horror: తూర్పుగోదావరి జిల్లాలో విషాదం.. భార్యను దారుణంగా హత్య చేసిన భర్త!
ఇది కూడా చదవండి: Sujana Chowdary: అధిష్టానం ఆదేశిస్తే అక్కడి నుంచి పోటీ చేస్తా..
సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ దాడిలో ఐదుగురు చైనా జాతీయులు, పాకిస్థానీ డ్రైవర్ మరణించారు అని ఉన్నత పోలీసు అధికారి తెలిపారు, అయితే కాన్వాయ్లోని మిగిలిన వ్యక్తులు మత్రం సురక్షితంగా ఉన్నారని తెలిపారు.
ఆత్మాహుతి దాడిని పాక్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ తీవ్రంగా ఖండించారు పాకిస్తాన్-చైనా స్నేహానికి హాని కలిగించేందుకు దుష్టశక్తులు ఎప్పటికీ విజయం సాధించలేరని ఆయన పేర్కొన్నారు. మృతి చెందిన చైనా కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేశారు. అలాగే విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ కూడా ఈ దాడిని ఖండించారు. దేశంలో ఉగ్రవాదులపై పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు.
జలవిద్యుత్ ప్రాజెక్ట్లో పని చేస్తున్న నిర్మాణ సంస్థ చైనా గెజౌబా గ్రూప్ కంపెనీ.. తన సిబ్బందిని కాన్వాయ్లో తీసుకువెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లుగా స్థానిక మీడియా తెలిపింది. 2021లో ఇదే కంపెనీపై దాడి జరిగింది. తొమ్మిది మంది చైనా పౌరులు సహా 13 మంది చనిపోయారు. ఆ సమయంలో మరణించిన చైనా కార్మికుల కుటుంబాలకు పాకిస్తాన్ లక్షలాది రూపాయల పరిహారం చెల్లించింది . దాడిపై విచారణకు చైనా తన బృందాన్ని కూడా పంపింది. తాజాగా జరిగిన దాడిలో ఐదుగురు ఇంజనీర్లు ప్రాణాలు కోల్పోయారు.
తాజావార్తలు
-
Financial Planning Tips: సంపాదించడం ఒక ఎత్తు.. దాచడం మరో ఎత్తు! మిమ్మల్ని ధనవంతులను చేసే 7 రూల్స్ ఇవే!
-
West Bengal: “రాళ్లతో కొట్టారు?”.. టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై దాడి
-
Paris Psg Violence: పీఎస్జీ గెలుపుతో తగలబడ్డ పారిస్.. వందల సంఖ్యలో ఫ్యాన్స్ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
Mega 158 : మెగా సినిమాలో నారా వారి హీరో?
-
Kharif 2026: రైతులకు శుభవార్త.. సాగునీటిని విడుదల చేసిన ప్రభుత్వం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..