Operation Sindoor: భారత్ దెబ్బతో పాకిస్తాన్ సైన్యానికి భారీ నష్టం.. ఇండోనేషియా సెమినార్లో వెల్లడి..
- ఆపరేషన్ సిందూర్తో పాకిస్తాన్ సైన్యానికి భారీ నష్టం..
- ఇండోనేషియా సెమినార్లో కీలక విషయాలు వెలుగులోకి..
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్తో మాకు ఎలాంటి నష్టం కలగలేదని పాకిస్తాన్ బుకాయిస్తూ వస్తోంది. అయితే, భారత్ దాడిలో పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన చాలా ఆస్తులు నష్టపోయినట్లు వెలుగులోకి వస్తోంది. తాజాగా, ఇండోనేషియన్ ఎయిర్ ఫోర్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన సెమినార్లో పాకిస్తాన్ నష్టాల గురించి ప్రస్తావన వచ్చింది. పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది అమాయకులను పాకిస్తాన్ ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారు. దీని తర్వాత, భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’తో పాకిస్తాన్కి బుద్ధి చెప్పింది. ఉగ్రవాద స్థావరాలతో పాటు పాక్ వైమానిక దళాలనికి చెందిన కీలక ఆస్తులపై దాడులు చేసింది.
Read Also: Bihar: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య.. దర్యాప్తులో షాకింగ్ విషయాలు..
Also Read
- India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
- Elections 2026: ఓటర్ల సునామీ.. బెంగాల్, తమిళనాడులో 1947 తర్వాత రికార్డ్ పోలింగ్
- Extramarital affair: భర్త స్నేహితుడితో ఏమిటా పని.. పైగా వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టేసింది..
- Ration Cards: రేషన్ కార్డుదారులకు బిగ్ షాక్.. లక్షల కార్డులు రద్దు..
ఇండోనేషియా సెమినార్లో పాకిస్తాన్ 6- ఫైటర్ జెట్లను, 2- సాబ్-2000 ఎరిఐ ఎయిర్బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్(అవాక్స్) విమానాలను, ఒక సీ-130 హెర్క్యూలర్ విమానాన్ని కోల్పోయినట్లు చెప్పారు. దీంతో పాటు పాకిస్తాన్లోని పలు వైమానిక స్థావరాలు ధ్వంసమైనట్లు సెమినార్లతో వెల్లడించారు. ఈ సెమినార్ని ఇండోనేషియన్ ఎయిర్ ఫోర్స్, భారత్-పాకిస్తాన్ ఎయిర్ వార్ని, స్ట్రాటజీలను చర్చించేందుకు నిర్వహించింది. భారత ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ సైన్యానికి చెందిన 11 ఎయిర్బేస్లు- నూర్ ఖాన్, భొలారి, సర్గోదా, రఫికీ, జకోబాబాద్ వంటి కీలక వైమానిక స్థావరాలను దెబ్బతీసింది. బ్రహ్మోస్, స్కాల్ప్ క్షిపణులతో భారత్ దాడి చేసింది.
పాకిస్తాన్ కోల్పోయిన ఫైటర్ జెట్లలో రెండు జేఎఫ్-17 థండర్,రెండు మిరేజ్ విమానాలు, ఒకటి ఎఫ్-16 బ్లాక్ 52, ఎఫ్-16ఏ/బీ-15 ఎస్ ఫైటర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పాకిస్తాన్ అవాక్స్ విమానాలను భారత ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కుప్పకూల్చింది. నూర్ ఖాన్ ఎయిర్ బేస్లో ఉన్న సీ-130 ట్రాన్స్పోర్ట్ విమానం కూడా బ్రహ్మోస్ దాడిలో ధ్వంసమైంది. ఇదే కాకుండా 30- క్షిపణులు, ఇందులో చైనీస్ తయారీ పీ-15, ఫతాహ్-2 రాకెట్లు, 10 డ్రోన్లను భారత్ ఎస్-400, ఆకాష్, బారాక్-8 ఉపయోగించి ధ్వంసం చేసింది. చైనా పాకిస్తాన్కి ఇచ్చిన హెచ్క్యూ-9, వైఎల్సీ-8ఈ వంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని కూడా మన బలగాలు దెబ్బతీసినట్లు సెమినార్లో వెల్లడించారు.
తాజావార్తలు
-
Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు
-
Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్గా తయారు చేయండి.. వన్ మోర్ అనాల్సిందే..
-
Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
-
India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
-
Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!