Operation Sindoor: భారత్ దెబ్బతో పాకిస్తాన్ సైన్యానికి భారీ నష్టం.. ఇండోనేషియా సెమినార్లో వెల్లడి..
- ఆపరేషన్ సిందూర్తో పాకిస్తాన్ సైన్యానికి భారీ నష్టం..
- ఇండోనేషియా సెమినార్లో కీలక విషయాలు వెలుగులోకి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్తో మాకు ఎలాంటి నష్టం కలగలేదని పాకిస్తాన్ బుకాయిస్తూ వస్తోంది. అయితే, భారత్ దాడిలో పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన చాలా ఆస్తులు నష్టపోయినట్లు వెలుగులోకి వస్తోంది. తాజాగా, ఇండోనేషియన్ ఎయిర్ ఫోర్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన సెమినార్లో పాకిస్తాన్ నష్టాల గురించి ప్రస్తావన వచ్చింది. పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది అమాయకులను పాకిస్తాన్ ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారు. దీని తర్వాత, భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’తో పాకిస్తాన్కి బుద్ధి చెప్పింది. ఉగ్రవాద స్థావరాలతో పాటు పాక్ వైమానిక దళాలనికి చెందిన కీలక ఆస్తులపై దాడులు చేసింది.
Read Also: Bihar: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య.. దర్యాప్తులో షాకింగ్ విషయాలు..
Also Read
- Nitesh Rane: అమీర్ ఖాన్ మూడో పెళ్లిపై బీజేపీ మంత్రి నితేష్ రాణే విమర్శలు.. 'లవ్ జిహాద్ బ్రాండ్ అంబాసిడర్' అంటూ ఫైర్!
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
- Bankra mosque: కోల్కతా ఎయిర్పోర్టు పక్కన 136 ఏళ్ల మసీదు తరలింపు..
ఇండోనేషియా సెమినార్లో పాకిస్తాన్ 6- ఫైటర్ జెట్లను, 2- సాబ్-2000 ఎరిఐ ఎయిర్బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్(అవాక్స్) విమానాలను, ఒక సీ-130 హెర్క్యూలర్ విమానాన్ని కోల్పోయినట్లు చెప్పారు. దీంతో పాటు పాకిస్తాన్లోని పలు వైమానిక స్థావరాలు ధ్వంసమైనట్లు సెమినార్లతో వెల్లడించారు. ఈ సెమినార్ని ఇండోనేషియన్ ఎయిర్ ఫోర్స్, భారత్-పాకిస్తాన్ ఎయిర్ వార్ని, స్ట్రాటజీలను చర్చించేందుకు నిర్వహించింది. భారత ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ సైన్యానికి చెందిన 11 ఎయిర్బేస్లు- నూర్ ఖాన్, భొలారి, సర్గోదా, రఫికీ, జకోబాబాద్ వంటి కీలక వైమానిక స్థావరాలను దెబ్బతీసింది. బ్రహ్మోస్, స్కాల్ప్ క్షిపణులతో భారత్ దాడి చేసింది.
పాకిస్తాన్ కోల్పోయిన ఫైటర్ జెట్లలో రెండు జేఎఫ్-17 థండర్,రెండు మిరేజ్ విమానాలు, ఒకటి ఎఫ్-16 బ్లాక్ 52, ఎఫ్-16ఏ/బీ-15 ఎస్ ఫైటర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పాకిస్తాన్ అవాక్స్ విమానాలను భారత ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కుప్పకూల్చింది. నూర్ ఖాన్ ఎయిర్ బేస్లో ఉన్న సీ-130 ట్రాన్స్పోర్ట్ విమానం కూడా బ్రహ్మోస్ దాడిలో ధ్వంసమైంది. ఇదే కాకుండా 30- క్షిపణులు, ఇందులో చైనీస్ తయారీ పీ-15, ఫతాహ్-2 రాకెట్లు, 10 డ్రోన్లను భారత్ ఎస్-400, ఆకాష్, బారాక్-8 ఉపయోగించి ధ్వంసం చేసింది. చైనా పాకిస్తాన్కి ఇచ్చిన హెచ్క్యూ-9, వైఎల్సీ-8ఈ వంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని కూడా మన బలగాలు దెబ్బతీసినట్లు సెమినార్లో వెల్లడించారు.
తాజావార్తలు
-
Visakhapatnam Earthquake: విశాఖలో భూప్రకంపనలు.. ప్రాణభయంతో బయటకు పరుగులు తీసిన జనం!
-
Hyderabad: ఫిలింనగర్లో ఫెరారీ స్పోర్ట్స్ కారు బీభత్సం..
-
Shreyas Iyer: “అందుకే జట్టు నుంచి వైభవ్ సూర్యవంశీని తీసేశాం”.. క్లారిటీ ఇచ్చిన కెప్టెన్ శ్రేయస్
-
Astrology: శ్రావణ మాసానికి ముందే శని వక్రగతి.. ఈ 5 రాశుల వారికి సంవత్సరాంతం వరకు ధన యోగం!
-
FIFA World Cup 2026: ఆకాశాన్నంటిన ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ టిక్కెట్ల ధరలు.. 32 ఏళ్లలో 10 రెట్లు పెరిగినయ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!