Bihar: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య.. దర్యాప్తులో షాకింగ్ విషయాలు..
- బీహార్లోని ఔరంగాబాద్ జిల్లాలో ఘటన
- జూన్ 21న పొలంలో మృతదేహం లభ్యం
- మృతదేహంపై గాయాలు ఉన్నట్లు గుర్తింపు
- కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్య ప్రియుడితో కలిసి భర్తలను చంపేస్తున్న ఘటనలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా బీహార్లోని ఔరంగాబాద్ జిల్లాలో ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది. ఒక మహిళ తన ప్రేమికుడితో కలిసి తన భర్తను హత్య చేసింది. ఈ సంచలనాత్మక కేసు బండేయా పోలీస్ స్టేషన్ పరిధిలోని అమునా గ్రామానికి చెందినది.
Also Read
- IPL 2026: RCB Vs KKR మ్యాచ్కు వర్షం గండం.. మ్యాచ్ రద్దయితే వీరికి పండగే..
- Karnataka: కేరళం పంచాయితీ ముగియకుండానే కర్ణాటకలో రేగిన వర్గపోరు.. వెలసిన డీకే.శివకుమార్ కటౌట్లు
- CM Chandrababu Naidu: వర్క్ ఫ్రం హోంపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- Keralam: కేరళం సీఎం ఎంపికపై తర్జనభర్జన.. నిర్ణయం రేపటికి వాయిదా
పోలీసులు కథనం ప్రకారం.. జూన్ 21న పొలంలో బిక్కు అనే వ్యక్తి మృతదేహం లభ్యమైంది. శరీరంపై గాయాల గుర్తులు ఉన్నాయి. అతడు హత్యకు గురైనట్లు గాయాల ద్వారా స్పష్టంగా అర్థమైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు, పలు ఆధారాల కారణంగా పోలీసులు భార్య పూజను అనుమానించారు. ఆ మహిళను ఇంటెన్సివ్ విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆమె మొత్తం కుట్రను వెల్లడించింది.
జూన్ 25న ఆ మహిళను అరెస్టు చేసినట్లు దౌండ్నగర్ సబ్-డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (SDPO) కుమార్ రిషిరాజ్ తెలిపారు. విచారణలో ఆమె తన ప్రేమికుడు కమలేష్ యాదవ్ తో కలిసి తన భర్త హత్యకు ప్లాన్ చేసి అమలు చేసినట్లు అంగీకరించిందని వెల్లడించారు. అయితే, హత్య ఎలా జరిగిందో ఇంకా వెల్లడించలేదు. ప్రస్తుతం నిందితురాలు పోలీసు కస్టడీలో ఉంది. ప్రస్తుతం ఆమె ప్రేమికుడి కోసం గాలింపు కొనసాగుతోంది. త్వరలో అరెస్టు చేసి దర్యాప్తు ముమ్మరం చేస్తామని పోలీసులు తెలిపారు. అయితే.. కారుతో గుద్ది చంపినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.
READ MORE: Adah Sharma : అద్దె ఇంట్లో అవస్థలు పడుతున్న పూరీ హీరోయిన్..!
స్థానికుల కథనం ప్రకారం.. భార్యాభర్తల మధ్య చాలా కాలంగా వివాదం నెలకొంది. ఆ మహిళ అదే గ్రామానికి చెందిన యువకుడితో ప్రేమ వ్యవహారం నడుపుతోంది. తన భర్తను ఎలాగైనా వదిలించుకోవాలని ప్లాన్ చేసింది. కాగా.. త్వరలోనే హత్యకు సంబంధించిన కుట్ర పూర్తిగా బయటపడతుందని పోలీసులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
IPL 2026: RCB Vs KKR మ్యాచ్కు వర్షం గండం.. మ్యాచ్ రద్దయితే వీరికి పండగే..
-
Naga Vamsi: డిస్ట్రిబ్యూటర్లను చంపి ఎగ్జిబిటర్లను కాపాడటం సాధ్యమా?:
-
Karnataka: కేరళం పంచాయితీ ముగియకుండానే కర్ణాటకలో రేగిన వర్గపోరు.. వెలసిన డీకే.శివకుమార్ కటౌట్లు
-
CM Chandrababu Naidu: వర్క్ ఫ్రం హోంపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Amul milk: సామాన్యుడి జేబుకు ‘అముల్’ చిల్లు.. రేపటి నుంచే పాలకు కొత్త రేట్లు! ఎంత ధర పెరిగాయంటే..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!