Marital Rape: భార్యతో బలవంతపు శృంగారం.. భిన్న తీర్పులు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భార్యతో బలవంతపు శృంగారం నేరమా? మారిటల్ రేప్ (వైవాహిక అత్యాచారం)ని నేరంగా పరిగణించాలా? అనే విషయం ఢిల్లీ హైకోర్టు భిన్న తీర్పును వెలువరించింది.. భార్యతో బలవంతపు శృంగారం నేరమే అవుతుందని ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనానికి నేతృత్వం వహిస్తున్న జస్టిస్ రాజీవ్ షక్దేహర్ ఆదేశాలు ఇచ్చారు. అయితే, బెంచ్లోని మరో న్యాయమూర్తి జస్టిస్ హరిశంకర్ మాత్రం ఆ ఆదేశాలతో విభేధించారు.. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 19, 21లను సెక్షన్ 375(మినహాయింపు 2) ధిక్కరిస్తుందనడానికి ఎలాంటి మద్ధతు కనిపించడం లేదని.. కావున, భార్యపై బలవంతపు శృంగారం నేరం కిందకు రాదని పేర్కొన్నారు.. అంతేకాదు, జస్టిస్ రాజీవ్ ఇచ్చిన ఆదేశాలను అంగీకరించడం లేదని పేర్కొన్నారు. దీంతో ఒకే కేసులో రెండు భిన్నాభిప్రాయాల తీర్పు వెలువడినట్టు అయ్యింది.
Read Also: Andhra Pradesh: మరికొన్ని గంటల్లో పెళ్ళి.. వరుడు గదిలోకి వెళ్ళి..
Also Read
- Relationship Controversy: అందానికి ముగ్ధుడై పిల్లనిచ్చిన అత్తతో ప్రేమలో పడ్డ అల్లుడు.. లేచిపోయి వివాహం
- INDIA Alliance Meeting: విజయ్ పార్టీకి ఊహించని పరిణామం.. టీవీకేను పక్కన పెట్టిన ఇండియా కూటమి?
- Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
- India Meet విభేదాల మధ్య ‘ఉమ్మడి పోరు’కు సిద్ధమైన 'ఇండియా కూటమి'.. నేడు కీలక సమావేశం.!
ఇక, చట్టం ద్వారా మంజూరు చేయబడిన మినహాయింపు ప్రకారం, స్త్రీ మైనర్ కానట్లయితే, తన భార్యతో పురుషుడు చేసే ఏదైనా లైంగిక చర్య అత్యాచారం కాదని పేర్కొంది హైకోర్టు.. వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించడంపై విస్తృతంగా చర్చనీయాంశమైన ప్రశ్నపై, ఢిల్లీ హైకోర్టు ఈరోజు భిన్నమైన తీర్పును వెలువరించింది. అయితే, ఈ కేసు ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్లనుంది. ఇద్దరు న్యాయమూర్తులు జస్టిస్ రాజీవ్ శక్ధేర్ మరియు జస్టిస్ హరిశంకర్ తమ తీర్పుపై ఏకీభవించడంలో విఫలమయ్యారు. వైవాహిక అత్యాచార చట్టంలో మినహాయింపు రాజ్యాంగాన్ని ఉల్లంఘించదని తాను నమ్ముతున్నానని జస్టిస్ శంకర్ అన్నారు.
కాగా, మారిటల్ రేప్ విచారణల తర్వాత అత్యాచార చట్టం కింద భర్తలకు ఇచ్చిన మినహాయింపును కొట్టివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై న్యాయమూర్తులు ఫిబ్రవరి 21న తీర్పును రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 7న, వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించడంపై తన వైఖరిని స్పష్టం చేయడానికి ఢిల్లీ హైకోర్టు కేంద్రానికి రెండు వారాల గడువు ఇచ్చింది. అయితే, కేంద్రం మరింత సమయం కోరింది, కేసును అనంతంగా వాయిదా వేయడం సాధ్యం కాదని న్యాయమూర్తులు తిరస్కరించారు. అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు వారి వ్యాఖ్యలను కోరుతూ ఒక కమ్యూనికేషన్ పంపినట్లు కేంద్రం తెలిపింది. ఈ కేసు సామాజిక మరియు కుటుంబ జీవితంపై ప్రభావం చూపుతుందని, సుదూర పరిణామాలతో సంప్రదింపుల ప్రక్రియ అవసరమని కేంద్రం పేర్కొంది.
తాజావార్తలు
-
Peddi 4 days Collections : పెద్ది 4 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. జస్ట్ మిస్
-
Relationship Controversy: అందానికి ముగ్ధుడై పిల్లనిచ్చిన అత్తతో ప్రేమలో పడ్డ అల్లుడు.. లేచిపోయి వివాహం
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
INDIA Alliance Meeting: విజయ్ పార్టీకి ఊహించని పరిణామం.. టీవీకేను పక్కన పెట్టిన ఇండియా కూటమి?
-
SIP Rules: SIP చేస్తున్నవారిలో చాలామంది పట్టించుకోని కీలక విషయాలు.. దీర్ఘకాలంలో భారీ ప్రభావం!
ట్రెండింగ్
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!