Omar Abdullah: జమ్మూకశ్మీర్లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి తీర్మానం దానిపైనే..
- జమ్మూలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర హోదా ఇవ్వాలనే తీర్మానం పెడుతాం..
- నియోజక వర్గాల పునర్విభజన- ఎన్నికలు- రాష్ట్ర హోదా మీద తీర్మానం చేస్తాం..
- కాశ్మీర్కు రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని ప్రధాని మోడీ చెప్పారు: ఒమర్ అబ్దుల్లా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Omar Abdullah: జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ విజయం తర్వాత ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా బాధ్యతలు స్వీకరించనున్నారని ఆ పార్టీ అధినేత ఫరూక్ అబ్దుల్లా ప్రకటించారు. ఈ సందర్భంగా ఎన్సీ పార్టీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్లో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాష్ట్ర హోదా ఇవ్వాలనే తీర్మానాన్ని ప్రధాని మోడీకి సమర్పిస్తామన్నారు. నియోజక వర్గాల పునర్విభజన, ఎన్నికలు, రాష్ట్ర హోదా లాంటి వాటి మీద తీర్మానం చేస్తామన్నారు. కొందరు నేతలు జమ్మూకశ్మీర్ను ఢిల్లీతో పోల్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కశ్మీర్ను ఢిల్లీతో పోల్చవొద్దన్నారు. ఎందుకంటే దేశ రాజధానికి రాష్ట్ర హోదా ఇస్తామని ఎవరూ చెప్పలేదు.. కానీ కశ్మీర్కు రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని ప్రధాని, హోంమంత్రి, కేంద్రమంత్రులు చెప్పారని ఒమర్ అబ్దుల్ పేర్కొన్నారు.
Read Also: Gold Rate Today: పండగ వేళ శుభవార్త.. తులం బంగారంపై ఏకంగా 760 తగ్గింది! భారీగా పడిపోయిన వెండి
Also Read
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్న్యూస్.. 74 ఏళ్లుగా ఉన్న కీలక సమస్యకు పరిష్కారం
- Supreme Court: సుప్రీం కోర్టుకు హనీమూన్ మర్డర్ కేసు.. ఏం జరిగిందంటే..!
- Murder Case: 'నీలాంటి భర్తలు వెయ్యి మంది దొరుకుతారు'.. ఆ ఒక్క మాటతో జరిగిన ఘోరం, హైకోర్టు కీలక తీర్పు
- Maharashtra Politics: కాంగ్రెస్లో శరద్ పవార్ పార్టీ విలీనం ? మహారాష్ట్ర రాజకీయాల్లో తెరవెనుక నడుస్తున్న హైడ్రామా ఇదే!
ఇక, 2019 వరకు జమ్మూకశ్మీర్ రాష్ట్రంగానే ఉందన్న విషయాన్ని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా గుర్తు చేశారు. కశ్మీర్లో శాంతితో పాటు అభివృద్ధికి బాటలు వేయడం కోసం రాష్ట్ర హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కశ్మీర్లో ఉన్న రాజకీయ పార్టీలను బీజేపీ లక్ష్యంగా చేసుకొని.. బలహీనపర్చేందుకు ట్రై చేస్తుందని దుయ్యబట్టారు. కానీ, ఆ పార్టీ కుట్రలు ఇక్కడ ఫలించలేదన్నారు. సీఎంగా పేరును తన తండ్రి ప్రకటించడంపై ఒమర్ అబ్దుల్లా రియాక్ట్ అవుతూ.. నేషనల్ కాన్ఫరెన్స్ శాసనసభా పక్ష సమావేశం తర్వాత మిత్రపక్షాలతో చర్చలు జరిపి ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకుంటామని ఒమర్ అబ్దుల్లా వెల్లడించారు.
తాజావార్తలు
-
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్న్యూస్.. 74 ఏళ్లుగా ఉన్న కీలక సమస్యకు పరిష్కారం
-
Dhruv Vikram: మైత్రీ మూవీ మేకర్స్ 4వ తమిళ సినిమాలో హీరోగా ధృవ్ విక్రమ్
-
Supreme Court: సుప్రీం కోర్టుకు హనీమూన్ మర్డర్ కేసు.. ఏం జరిగిందంటే..!
-
Anirudh: బక్కోడు మాములోడు కాదుగా!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?