Odisha: దేశంలోనే అతిపెద్ద ఉద్యోగ మోసం గుట్టురట్టు.. నిరుద్యోగులే టార్గెట్గా స్కామ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Odisha Police Busts “India’s Biggest Ever” Job Fraud: దేశంలోనే అతిపెద్ద ఉద్యోగ మోసాన్ని గట్టురట్టు చేశారు ఒడిశా పోలీసులు. నిరుద్యోగులే టార్గెట్ గా జరుగుతున్న స్కామ్ ను వెలుగులోకి తీసుకువచ్చారు ఒడిశా పోలీస్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్. ఉత్తర్ ప్రదేశ్ అలీఘర్ కేంద్రంగా ఈ స్కామ్ జరుగుతోంది. ఈ స్కామ్ వల్ల ఇప్పటి వరకు 50,000 మంది నిరుద్యోగులు మోసం పోయినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశాలో వేలాది మంది నిరుద్యోగ యువత ఈ స్కామర్ల వలలో చిక్కుకున్నట్లు సమాచారం.
ఉత్తర్ ప్రదేశ్ అలీఘర్ కు చెందిన జాఫర్ అహ్మద్(25) ప్రాథమిక నిందితుల్లో ఒకరు. బీటెక్ చువుకున్న జాఫర్ వృత్తిరీత్యా ఇంజనీర్. ఇతడిని పోలీసులు అరెస్ట్ చేసి భువనేశ్వర్ కోర్టులో హాజరుపరిచారు. నిందితుడిని అరెస్ట్ చేసేందుకు ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు సహకరించారు. ఈ స్కామ్ లో మరింత సమాచారం రాబట్టేందుకు పోలీసులు విచారిస్తున్నారు. నిరుద్యోగులు కోట్లలో తమ డబ్బును మోసపోయారు.
Also Read
- Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
- Supreme Court: ప్రేమికుల్ని నిలువరించడం సాధ్యమా? పోక్సో దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చీవాట్లు
- India-US: అమెరికాతో ఒప్పందం వద్దనుకుంటున్నట్లు కథనాలు.. పీయూష్ గోయల్ క్లారిటీ
- Bengaluru: ప్రేమికుడిని పెళ్లాడిన 4 నెలలకే ఉపాధ్యాయురాలు ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏం రాసిందంటే..!
Read Also: Xi Jinping: చైనాకు కఠిన సవాళ్లు ముందున్నాయి.. భారత్ ఆంక్షల్ని విధించింది.
కొంతమంది డెవలపర్ల సహాయంతో యూపీకి చెందిన కేటుగాళ్లు ఈ స్కామ్ ను నడుపుతున్నారు. దీని కోసం ప్రత్యేకంగా 50 మందితో ఓ కాల్ సెంటర్ కూడా సెటప్ చేశారు. ఈ ఉద్యోగులకు నెలకు రూ.15,000 చొప్పున జీతం ఇస్తూ దందాను నడిపారు. వీరంతా జమాల్ పూర్, అలీఘర్ ప్రాంత వాసులే. 1000 పైగా సిమ్ కార్డులు, 530 హ్యాండ్ సెట్లను ఉపయోగించి స్కామ్ కు పాల్పడ్డారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఇతర పథకాల పేరుతో ఉద్యోగాలు కల్పిస్తామని చెబుతూ నిరుద్యోగులను బుట్టలో వేసుకుంటున్నారు. ప్రభుత్వ వెబ్ సైట్ ను పోలిన మరో వెబ్ సైట్ డెవలప్ చేసి, ప్రధానంగా ఆరోగ్యం, స్కిల్ డిపార్ట్మెంట్ జాబ్స్ ఆఫర్ చేస్తూ ప్రభుత్వ ప్రకటనలను ప్రదర్శించేలా వెబ్ సైట్ రూపొందిస్తారు. నిరుద్యోగులను మోసగించేందుకు ‘‘ ప్రధాన్ మంత్రి స్కీమ్స్’’ ఉపయోగిస్తున్నారని పోలీసులు వెల్లడించారు. కేటుగాళ్లు తమ ఫోన్లను వాడకుండా జాగ్రత్తలు తీసుకునే వారు. ట్రూ కాలర్ లో కూడా గవర్నమెంట్ స్కీమ్స్ వచ్చే విధంగా జాగ్రత్తలు తీసుకునేవాళ్లు. ఈ స్కామ్ కోసం మొత్తం 100 బ్యాంక్ ఎకౌంట్లను వాడారు. జన్ సేవా కేంద్రం నుంచి డబ్బును విత్ డ్రా చేసుకునేందుకు ‘‘జన్ సేవా కేంద్రాల’’ను మాత్రమే ఉపయోగించుకునే వారు.
ఈ క్రమంలో అభ్యర్థులు వీళ్ల వలలో పడిన వెంటనే రిజిస్ట్రేషన్, ఇంటర్వ్యూ శిక్షణ, ఇతర వాటి కోసం రూ. 3000- రూ.50,000 వరకు వసూలు చేస్తారు. సాధారణంగా ఉద్యోగం కోసం నమోదు చేసుకున్న వారందరిని ఎంపిక చేసేవారు. కొన్ని సందర్బాల్లో అక్రమార్కులు స్థానిక వార్తా పత్రికల్లోకూడా ప్రకటనలు ఇచ్చేవారు. ఇలా ఈ స్కామ్ లో కోట్లాది రూపాయలు కొల్లగొట్టినట్లు పోలీసులు గుర్తించారు.
తాజావార్తలు
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!