Xi Jinping: చైనాకు కఠిన సవాళ్లు ముందున్నాయి.. భారత్ ఆంక్షల్ని విధించింది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Xi Jinping warns of ‘tough challenges’ in China’s ‘new phase’ of Covid: 2023లో చైనా కఠిన సవాళ్లు ఎదుర్కోబోతోందని అధ్యక్షుడు జి జిన్ పింగ్ అన్నారు. కోవిడ్ మహమ్మారితో అతలాకుతలం అవుతున్న సమయంలో జిన్ పింగ్ తన న్యూ ఇయర్ సందేశాన్ని ఇచ్చారు. రాబోయే రోజుల్లో కఠిన సవాళ్లను ఎదుర్కోబోతున్నాయని.. ప్రస్తుతం కోవిడ్ -19 కొత్తదశలోకి ప్రవేశించిందని అన్నారు. భారతదేశం, ఇతర దేశాలు చైనా నుంచి వచ్చే ప్రయాణికులపై నిషేధాంక్షలు విధించాయని జిన్ పింగ్ అన్నారు. దేశం చాలా ఇబ్బందులను ఎదుర్కొంటోందని.. ఇది సులభం అయిన ప్రయాణం కాదని అనేక సవాళ్లతో కూడుకున్నది అని జిన్ పింగ్ ప్రజలను ఉద్దేశించి అన్నారు.
Read Also: Bihar Man Jackpot: జాక్పాట్ కొట్టిన బిహార్ వ్యక్తి.. రూ.49తో కోటి కొట్టేశాడు
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Thailand Train Crash: బ్యాంకాక్లో ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు.. 8 మంది మృతి
- Trump China Visit: చైనాను అస్సలు నమ్మని ట్రంప్.. చెత్త బుట్టలోకి చైనీస్ గిఫ్ట్స్..
అసాధారణ ప్రయత్నాలతో ఎన్నో ఇబ్బందులను, సవాళ్లను అధిగమించామని.. ఇది ఎవరికీ కూడా సులభమైన ప్రయాణం కాదని చెప్పారు. కోవిడ్-19 ప్రారంభం అయినప్పటి నుంచి మేము ప్రజలు సంక్షేమం, శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇచ్చామని.. సాధ్యమైనంత వరకు ప్రజల ఆరోగ్యాన్ని రక్షించేందుకు శాస్త్రీయ విధానాలతో కోవిడ్ ను ఎదుర్కొన్నామని.. అధికారులు, ఆరోగ్య సిబ్బంది, వైద్య నిపుణులు, కమ్యూనిటీ కార్యకర్తలు అంతా కలిసి ఎంతో ధైర్యంగా పనిచేశారని జిన్ పింగ్ అన్నారు. ఇప్పుడు విశ్వాసం అనే కాంతిరేఖ ముందుందని.. దైర్యం, ఐకమత్యంతో శ్రమించి విజయం సాధిద్దాం అని జిన్ పింగ్ ప్రజలకు పిలుపునిచ్చారు.
ప్రపంచం ఎప్పుడు చూడని విధంగా కరోనా మహమ్మారి ప్రబలుతోంది. ఒమిక్రాన్ బీఎఫ్.7 వేరియంట్ కారణంగా అక్కడ లక్షల్లో కేసులు నమోదు అవుతున్నాయి. జనవరి నెలలో ఏకంగా తారాస్థాయికి కేసుల సంఖ్య చేరుతుందని అంతర్జాతీయ అధ్యయనాలు వెల్లడించాయి. ఏకంగా 60 శాతం మంది కోవిడ్ బారిన పడొచ్చని ఓ అంచానా. ఇక మరణాల సంఖ్య కూడా పెరిగింది. దేశం అంతటా ఆస్పత్రులు రోగులతో నిండిపోతున్నాయి. జీరో కోవిడ్ విధానాన్ని ఎత్తేసిన తర్వాత చైనాలో ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరిగింది.
తాజావార్తలు
-
Peddi: “మాస్క్ తీస్తే బిల్లు ఫ్రీ”.. దుబాయ్లో ఏఆర్ రెహమాన్ క్రేజ్ చూసి షాకైన బుచ్చిబాబు!
-
Chittoor Police: ఖాకీలే దొంగలుగా మారారు.. రూ.10 లక్షల దోపిడీ..
-
Rahul Dravid: “హీరోలు లేకుండా క్రీడ ఉండదు”.. గంభీర్ వ్యాఖ్యలకు ద్రావిడ్ కౌంటర్..
-
Tandoori Roti Recipe: తందూర్ లేకుండానే ధాబా స్టైల్ తందూరీ రోటీ.. ఇంట్లోనే సులభంగా తయారు చేసే చిట్కా!
-
Sing Geetham: సింగీతం – నాగ్ అశ్విన్ కాంబో మూవీపై భారీ క్యూరియాసిటీ
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..