దేశవ్యాప్తంగా ఉత్కంఠ నింపాయి 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు. ఉత్తర్ప్రదేశ్లో ఎన్నికల ఫలితాల్లో పలు ప్రముఖ పార్టీల కంటే నోటాకే అధిక శాతం ఓట్లు పడడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల సంఘం వెబ్సైట్లో చూపిన వివరాల ప్రకారం.. యూపీ ఎన్నికల్లో నోటా 0.69 శాతం ఓట్లను పొందడం గమనించాల్సిన అంశం.
100 సీట్లలో పోటీచేసిన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పార్టీ ఎంఐఎం 0.47 శాతం ఓట్లు మాత్రమే పొందిందని ఈసీ తెలిపింది. ఆప్ 0.35 శాతం, జేడీయూ 0.11, సీపీఐ 0.07శాతం, సీపీఐ(ఎం), సీపీఐ(ఎంఎల్) ఎల్జేపీలు 0.01 శాతం చొప్పున ఓట్లు తెచ్చుకున్నాయి. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీకి 41.6 శాతం ఓట్లు వచ్చాయి. రెండో స్థానంలో నిలిచిన సమాజ్వాదీ పార్టీ 32 శాతం ఓట్లు దక్కించుకుంది. వీటి తర్వాత బీఎస్పీకి 12.8శాతం, ఆర్ఎల్డీకి 3.02శాతం, కాంగ్రెస్కు 3.02 ఓట్లు వచ్చాయి.

ఎగ్జిట్పోల్స్ అంచనాలకు మించి నరేంద్ర మోడీ-అమిత్షా ద్వయం ప్రభంజనాన్ని సృష్టించింది.. పంజాబ్ మినహా నాలుగు రాష్ట్రాల్లో విజయాన్ని సాధించింది. పంజాబ్లో ఆమ్ఆద్మీ పార్టీ గ్రాండ్ విక్టరీ కొట్టింది. అక్కడ హేమాహేమీలను తన చీపురుతో ఊడ్చేశారు ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ అధినేత అరవింద్ కేజ్రీవాల్. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపుర్లో తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది భారతీయ జనతా పార్టీ.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ మాత్రం ఎక్కడా పుంజుకున్నది లేదు.. పైగా తన ఓటమి పరంపరను కొనసాగించిందనే చెప్పాలి. పంజాబ్ లో అధికారాన్ని ఆప్ కి అప్పగించింది హస్తం.