Central Minister Anurag Thakur: వీధుల్లో నిరసనలు కాదు.. పార్లమెంటులో చర్చించండి: కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Central Minister Anurag Thakur: వీధుల్లో నిరసనలు చేపట్టడం కాదని.. ప్రజాసమస్యలపై పార్లమెంటులో చర్చించాలని ప్రతిపక్షాలకు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సూచించారు. మణిపూర్ అంశంపై పార్లమెంటులో చర్చ జరగకుండా విపక్షాలు పారిపోతున్నాయని విమర్శించారు. వీధుల్లో నిరసనలు చేయాలని కోరుకుంటే.. పార్లమెంటుకు ఎన్నికై ప్రయోజనం ఏముందని మండిపడ్డారు. మణిపూర్ అంశంపై చర్చకు పట్టుబడుతోన్న విపక్ష పార్టీలు.. వారం రోజులుగా పార్లమెంటులో నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. విపక్ష పార్టీల నిరసనలతో ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఈ క్రమంలో విపక్ష పార్టీలపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ విమర్శలు గుప్పించారు. జులై 20న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి విపక్షాలు చేస్తున్న నిరసనలను ఉద్దేశిస్తూ ఠాకూర్ విమర్శలు చేశారు.
Read also: Fahadh Faasil: ఎవర్రా ఈ రత్నవేలు.. సోషల్ మీడియా అంతా ఒకటే మోత
Also Read
- PM Narendra Modi: అమర్నాథ్ యాత్ర ప్రారంభం.. భక్తులకు ప్రధాని మోడీ లేఖ, ఐదు సంకల్పాలకు పిలుపు
- Siya Goyal: పూణే లోహగడ్ కోట హ*త్య కేసు.. మీడియాకు మిడిల్ ఫింగర్ చూపించిన సియా గోయల్.. వీడియో వైరల్
- Ayodhya Ram Temple Land Deal: అయోధ్య రామమందిర కేసులో కొత్త మలుపు.. భూ కొనుగోళ్లపై SIT దర్యాప్తు
- Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
‘మీరు వీధుల్లో నిరసనలు లేవనెత్తాలని కోరుకుంటే.. పార్లమెంటుకు ఎన్నికై ప్రయోజనం ఏమిటనీ కేంద్ర మంత్రి ఠాకూర్ ప్రశ్నించారు. దయచేసి సభకు వచ్చి.. చర్చలో పాల్గొనాలని విపక్షాలకు కేంద్ర మంత్రి విజ్ఞప్తి చేశారు. వారు కోరుకున్న మణిపూర్ అంశంపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. చర్చ నుంచి పారిపోవాల్సిన అవసరం విపక్షాలకు ఏముందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రశ్నించారు. సోమవారం పార్లమెంటు బయట మీడియాతో మాట్లాడిన ఆయన.. మణిపూర్ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. దీనిపై ప్రకటన చేస్తానని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పిన మాటలను గుర్తుచేశారు. ఇక మణిపూర్లో ‘ఇండియా’ బృందం చేసిన పర్యటనపై విమర్శలు చేసిన ఠాకూర్.. పశ్చిమ బెంగాల్లో వారెందుకు పర్యటించలేదని ప్రశ్నించారు. యూపీఏ హయాంలోనూ మణిపూర్లో ఆరు నెలలపాటు హింస చెలరేగిందని గుర్తు చేసిన కేంద్ర మంత్రి .. అప్పటి ప్రధానమంత్రి, హోంశాఖ మంత్రులు ఎందుకు మౌనంగా ఉన్నారని.. ఎందుకు పర్యటించలేదని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Saikrishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. సీసీటీవీ హార్డ్డిస్క్లు మార్చారా..?
-
Akhil Akkineni : సమంత ‘మా ఇంటి బంగారం’పై అఖిల్ షాకింగ్ కామెంట్స్
-
Shreyas Iyer: కోహ్లీ రికార్డు బ్రేక్.. మ్యాచ్ రద్దయినా చరిత్ర సృష్టించిన శ్రేయస్.. తొలి భారతీయ కెప్టెన్గా రికార్డ్..
-
Australian Cricketer: 15 ఏళ్ల బాలికపై అత్యాచారం.. ఆస్ట్రేలియా క్రికెటర్కు జీవితకాల జైలు శిక్ష!
-
PM Narendra Modi: అమర్నాథ్ యాత్ర ప్రారంభం.. భక్తులకు ప్రధాని మోడీ లేఖ, ఐదు సంకల్పాలకు పిలుపు
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!