Asaduddin Owaisi: అక్కడ కూల్చడానికి ముస్లిం ఇళ్లు మిగలలేదు.. నూహ్ ర్యాలీపై ఓవైసీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddin Owaisi: హర్యానాలో గత నెలలో మత ఉద్రిక్తతలకు, అల్లర్లకు కారణమైన నూహ్ ప్రాంతం మరోసారి వార్తల్లోకెక్కింది. విశ్వహిందూ పరిషత్(వీహెచ్పీ) ఈ రోజు శోభాయాత్ర నిర్వహిస్తామని ప్రకటించడంతో నూహ్ తో పాటు మొత్తం హర్యానా హై అలర్ట్ అయింది. యాత్రకు అనుమతి లేకున్నా నిర్వహించేందుక వీహెచ్పీ ప్రయత్నిస్తోంది. దీన్ని అడ్డుకునేందుకు నూహ్ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
ఇదిలా ఉంటే హిందూ సంఘాలు ర్యాలీకి పిలుపునివ్వడాన్ని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘నూహ్లో ధ్వంసమయ్యేలా ఏ ముస్లిం ఇళ్లు కూడా మిగలలేదు’ అని సోమవాారం వ్యాఖ్యానించారు.
Also Read
- PM Modi: "నీట్ పేపర్ లీక్ 'ఘోర పాపం'.. కఠిన శిక్ష తప్పదు".. ప్రధాని మోడీ సీరియస్ వార్నింగ్
- Abhijeet Deepke: ఎవరీ అభిజీత్ దీప్కే? ఆందోళనలకు నిధులు ఎక్కడివి?.. ‘సీజేపీ’ నిరసనల వెనుక దాగి ఉన్న ప్రశ్నలు, అనుమానాలు!
- Ram Mandir Donation Theft Case: అయోధ్య రామ మందిర కేసులో కీలక మలుపు.. కొత్త సిట్ ఏర్పాటు..!
- CJP Protest: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..118 మంది పోలీసులకు గాయాలు.. పోలీసుల అదుపులో 70 మంది
Read Also: Nuh Rally: నూహ్లో ర్యాలీకి సిద్ధమైన హిందూ సంఘాలు.. హర్యానాలో హై అలర్ట్..
హర్యానాలో బీజేపీ ప్రభుత్వ ఆదేశాలకు వ్యతిరేఖంగా వీహెచ్పీ పెద్ద ఊరేగింపును నిర్వహిస్తామని బెదిరిస్తోంది. అంతకుముందు నూహ్ హింస అందరికి తెలుసు. ఊరేగింపు సమయంలో ముస్లింలను లక్ష్యంగా చేసుకున్నారని ఎక్స్(ట్విట్టర్) ఆయన అన్నారు. కేవలం ముస్లింలపై ఏకపక్షంగా చర్యలు తీసుకుని, మిగతా వారిపై చర్యలు తీసుకోకపోవడంతోనే మరోసారి ప్రభుత్వ ఆదేశాలకు వ్యతిరేకంగా వారు వెళ్లే సాహసం చేసేవారు కాదు అని ట్వీట్ చేశారు.
అధికార బీజేపీని టార్గెట్ చేస్తూ ఓవైసీ విమర్శించారు. వీరి ముందు బీజేపీ నిస్సాహాయంగా ఉదని అనిపిస్తోందని, నూహ్లో మళ్లీ హింస చెలరేగితే హర్యానాలోని బిజెపి ప్రభుత్వం మాత్రమే బాధ్యత వహిస్తుందని, అక్కడ ధ్వంసం చేయడానికి ముస్లింల ఇల్లు లేవని ఆయన అన్నారు.
జూలై 31న నూహ్ ప్రాంతంలో శోభాయాత్ర మత ఘర్షణలకు కారణమైంది. ఈ ఘర్షణల్లో ఆరుగురు మరణించగా.. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో ర్యాలీకి అధికారులు అనుమతి ఇవ్వలేదు. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మొబైల్ ఇంటర్నెట్, బల్క్ ఎస్ఎంఎస్ లపై నిషేధం విధించారు. విద్యాసంస్థలు, బ్యాంకులు మూతపడ్డాయి.
हरियाणा की भाजपा सरकार के आदेश के ख़िलाफ़ जाकर VHP शोभा यात्रा निकालने की धमकी दे रही है।
नूह की हिंसा से पहले सरकार को पता था कि यात्रा की आड़ में मुसलमानों को निशाना बनाया जाएगा। अगर मुसलमानों के ख़िलाफ़ एकतरफ़ा क़ानूनी कार्रवाई नहीं होती और असली मुजरिम को मोनू डार्लिंग न…
— Asaduddin Owaisi (@asadowaisi) August 28, 2023
తాజావార్తలు
-
Team India: టీమిండియాలో కీలక మార్పులకు శ్రీకారం.. అప్పుడే ఒక వికెట్ డౌన్!
-
Sai Krishna Lockup Death Case: సాయి కృష్ణ కేసులో సంచలనం.. డీజీపీ, సీపీ పేర్లు చేర్చాలంటూ..!
-
PM Modi: “నీట్ పేపర్ లీక్ ‘ఘోర పాపం’.. కఠిన శిక్ష తప్పదు”.. ప్రధాని మోడీ సీరియస్ వార్నింగ్
-
Realme Power Days సేల్.. P4 Power 5G, P4 Pro 5Gపై భారీ తగ్గింపు.. ఆఫర్లు ఇవే.!
-
Maruthi Next : మారుతీ డైరెక్షన్ లో వరుణ్ తేజ్.. అవసరమా అధ్యక్ష్యా?
ట్రెండింగ్
-
Rohit Sharma Retirement: రోహిత్ మనసులో రెండు గాయాలు.. అందుకే రిటైర్ కాలేదు.. మరి ఎప్పుడు?
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?