Nuh Rally: నూహ్లో ర్యాలీకి సిద్ధమైన హిందూ సంఘాలు.. హర్యానాలో హై అలర్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nuh Rally: గత నెలలో హర్యానాలో మత ఉద్రిక్తతలకు కేంద్రంగా మారిన నూహ్ ప్రాంతం మరోసారి వార్తల్లోకి వచ్చింది. హిందూ సంఘాలు ఈ రోజు నూహ్ ప్రాంతంలో ర్యాలీకి సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. విశ్వహిందూ పరిషత్(వీహెచ్పీ) ఈ రోజు శోభాయాత్రను నిర్వహించేందుకు సిద్ధమైంది.
నూహ్ జిల్లాలో పరిసర ప్రాంతాల్లో వీహెచ్పీ మతపరమైన ఉరేగింపు నేపథ్యంలో అధికారులు దీనికి అనుమతి నిరాకరించినప్పటికీ.. భద్రతా చర్యలు పెంచారు. పోలీసులు విస్తృత భద్రత చర్యలు తీసుకున్నారు. బయటి వ్యక్తులు నుహ్ జిల్లాలోకి ప్రవేశించకుండా అధికారులు కఠినమైన ఆంక్షలు అమలు చేశారు. పోలీసులు మరియు పారామిలటరీ బలగాలు ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాయి. అంతర్ రాష్ట్ర, అంతర్ జిల్లా సరిహద్దుల్లో నిఘా పెంచారు.
Also Read
- UPI MDR Revenue: MDR ఆదాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ డబ్బుతో ఏం చేస్తారంటే..?
- UPI Charges: ఎవరు చెల్లించాలి? ఎవరు అవసరం లేదు?.. ఇంకా సందేహాలా..? పూర్తి వివరాలు ఇవే
- Tamil Nadu: మరో వివాదంలో విజయ్ సర్కార్.. బస్సుల రంగులపై రాజకీయ రచ్చ
- IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్.. ఈ చిట్కాలు పాటిస్తే సీటు పక్కా..!
జూలై 31న హిందూ సంఘాలు నిర్వహించిన శోభా యాత్ర తీవ్రమైన మత ఉద్రిక్తతలకు కారణమైంది. శోభాయాత్రపై మరో వర్గం దాడి చేయడంతో హింస చెలరేగింది. ఈ ఘర్షణలో పదుల సంఖ్యలో వాహనాలను దగ్ధం చేశారు. ఆరుగురు మరణించారు. పోలీసులకు గాయాలయ్యాయి. ఈ అల్లర్ల తర్వాత హర్యానాలోని మనోహర్ లాల్ కట్టర్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం బుల్డోజర్ యాక్షన్ మొదలుపెట్టింది. అల్లర్లకు పాల్పడిన వారి ఇళ్లను, అక్రమ నిర్మాణాలను కూల్చేసింది.
Read Also: France: ఫ్రాన్స్ సంచలన నిర్ణయం.. స్కూళ్లలో ముస్లిం “అబయా దుస్తుల”పై నిషేధం..
మతపరమైన సున్నిత అంశం కావడంతో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ భక్తులు ఊరేగింపుకు దూరంగా ఉండాలని సూచించారు. బదులుగా ‘జలాభిషేక’ వేడుకల కోసం వారి ప్రాంతాలలోని దేవాలయాలను సందర్శించాలని సూచించారు. అనుమతి నిరాకరించినప్పటికీ, యాత్రను కొనసాగించాలనే ఉద్దేశ్యంలో వీహెచ్పీ ఉంది.
మరోవైపు భద్రతా బలగాలు ఐడీ కార్డు ఉన్నవారిని మాత్రమే నూహ్ లోకి అనుమతిస్తోంది. పలు ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అందర్ని తనిఖీ చేస్తున్నారు. 24 కంపెనీల పారామిలిటరీని, 1900 మంది హర్యానా పోలీసులను మోహరించారు. ఊరేగింపులు, యాత్రలు, ర్యాలీలకు అనుమతి లేదని, ఆయుధాలున, తుపాకులు, గొడ్డళ్లను బహిరంగ ప్రదేశాలకు తీసుకురాకుండా పోలీసులు నిషేధించారు. జిల్లా మొత్తం ఇంటర్నెట్, బల్క్ ఎస్ఎంఎస్ సేవలు నిలిపివేయబడ్డాయి. విద్యాసంస్థలు, బ్యాంకులు మూతపడ్డాయి. నలుగురి కన్నా ఎక్కువ మంది వ్యక్తలు గుమిగూడటాన్ని నిషేధించారు.
తాజావార్తలు
-
Hatah Teaser: కిరణ్ అబ్బవరం ‘హతః’ టీజర్కు ముహూర్తం ఫిక్స్.. ఆ నల్ల పిల్లి వెనుక అసలు కథేంటి?
-
Minister TG Bharath: కర్నూలులో జాబ్ మేళా ప్రారంభం.. యువతకు ఉద్యోగాలు.. కర్నూలుకు భారీ పెట్టుబడులు..!
-
KBR Park Elevated Corridor: 14 వద్దు.. ఒక్క ఎలివేటెడ్ కారిడార్ ముద్దు.! కేబీఆర్ పార్క్ పరిసరాల్లో కొత్త ప్లాన్ ఇదే..
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Salman Khan: కర్ణుడిగా సల్మాన్ ఖాన్.. ‘రంగ్ దే బసంతి’ దర్శకుడితో భారీ ప్రాజెక్ట్!
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!