Nuh Rally: నూహ్లో ర్యాలీకి సిద్ధమైన హిందూ సంఘాలు.. హర్యానాలో హై అలర్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nuh Rally: గత నెలలో హర్యానాలో మత ఉద్రిక్తతలకు కేంద్రంగా మారిన నూహ్ ప్రాంతం మరోసారి వార్తల్లోకి వచ్చింది. హిందూ సంఘాలు ఈ రోజు నూహ్ ప్రాంతంలో ర్యాలీకి సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. విశ్వహిందూ పరిషత్(వీహెచ్పీ) ఈ రోజు శోభాయాత్రను నిర్వహించేందుకు సిద్ధమైంది.
నూహ్ జిల్లాలో పరిసర ప్రాంతాల్లో వీహెచ్పీ మతపరమైన ఉరేగింపు నేపథ్యంలో అధికారులు దీనికి అనుమతి నిరాకరించినప్పటికీ.. భద్రతా చర్యలు పెంచారు. పోలీసులు విస్తృత భద్రత చర్యలు తీసుకున్నారు. బయటి వ్యక్తులు నుహ్ జిల్లాలోకి ప్రవేశించకుండా అధికారులు కఠినమైన ఆంక్షలు అమలు చేశారు. పోలీసులు మరియు పారామిలటరీ బలగాలు ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాయి. అంతర్ రాష్ట్ర, అంతర్ జిల్లా సరిహద్దుల్లో నిఘా పెంచారు.
Also Read
- Britain Heatwave: భారత్లో 45°C ఉన్నా ఏం కాదు.. బ్రిటన్లో 35°Cకే ప్రజలు ఎందుకు అల్లాడుతున్నారు?
- Prashant Kishor: తొలిసారి ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిశోర్.. పోటీ ఎక్కడ్నుంచంటే..!
- Yogi Adityanath: ‘‘దోషుల్ని వదిలే ప్రసక్తే లేదు’’.. రామ మందిర విరాళాల చోరీపై యోగి వార్నింగ్..
- Rahul Gandhi vs BJP: రాహుల్ గాంధీ విదేశీ టూర్లపై బీజేపీ సెటైర్లు.. పోస్టర్లపై దుమారం
జూలై 31న హిందూ సంఘాలు నిర్వహించిన శోభా యాత్ర తీవ్రమైన మత ఉద్రిక్తతలకు కారణమైంది. శోభాయాత్రపై మరో వర్గం దాడి చేయడంతో హింస చెలరేగింది. ఈ ఘర్షణలో పదుల సంఖ్యలో వాహనాలను దగ్ధం చేశారు. ఆరుగురు మరణించారు. పోలీసులకు గాయాలయ్యాయి. ఈ అల్లర్ల తర్వాత హర్యానాలోని మనోహర్ లాల్ కట్టర్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం బుల్డోజర్ యాక్షన్ మొదలుపెట్టింది. అల్లర్లకు పాల్పడిన వారి ఇళ్లను, అక్రమ నిర్మాణాలను కూల్చేసింది.
Read Also: France: ఫ్రాన్స్ సంచలన నిర్ణయం.. స్కూళ్లలో ముస్లిం “అబయా దుస్తుల”పై నిషేధం..
మతపరమైన సున్నిత అంశం కావడంతో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ భక్తులు ఊరేగింపుకు దూరంగా ఉండాలని సూచించారు. బదులుగా ‘జలాభిషేక’ వేడుకల కోసం వారి ప్రాంతాలలోని దేవాలయాలను సందర్శించాలని సూచించారు. అనుమతి నిరాకరించినప్పటికీ, యాత్రను కొనసాగించాలనే ఉద్దేశ్యంలో వీహెచ్పీ ఉంది.
మరోవైపు భద్రతా బలగాలు ఐడీ కార్డు ఉన్నవారిని మాత్రమే నూహ్ లోకి అనుమతిస్తోంది. పలు ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అందర్ని తనిఖీ చేస్తున్నారు. 24 కంపెనీల పారామిలిటరీని, 1900 మంది హర్యానా పోలీసులను మోహరించారు. ఊరేగింపులు, యాత్రలు, ర్యాలీలకు అనుమతి లేదని, ఆయుధాలున, తుపాకులు, గొడ్డళ్లను బహిరంగ ప్రదేశాలకు తీసుకురాకుండా పోలీసులు నిషేధించారు. జిల్లా మొత్తం ఇంటర్నెట్, బల్క్ ఎస్ఎంఎస్ సేవలు నిలిపివేయబడ్డాయి. విద్యాసంస్థలు, బ్యాంకులు మూతపడ్డాయి. నలుగురి కన్నా ఎక్కువ మంది వ్యక్తలు గుమిగూడటాన్ని నిషేధించారు.
తాజావార్తలు
-
LayOffs: అతి పెద్ద నిర్ణయం తీసుకోబోతున్న దిగ్గజ కంపెనీ.. లక్ష ఉద్యోగాలు హాంఫట్..
-
Most Powerful Weapons: మహాభారతంలో ఆ 11 అస్త్రాలు గనుక ప్రయోగిస్తే.. బూడిదే! దేవతలు సైతం వణికిపోయిన ఆయుధాలు ఇవే!
-
Vijayashanthi : ఫీజు బకాయిలపై విజయశాంతి ఫైర్.!
-
Yoga vs Gym: గుండె ఆరోగ్యానికి యోగా బెటారా? జిమ్కు వెళ్లాలా.?
-
Tobacco Farmers: పొగాకు రైతులకు ప్రభుత్వం అండ.. కిలో రూ.200 కంటే తక్కువకు కొనొద్దు..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!