India: మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జుపై కుట్ర.. యూఎస్ రిపోర్ట్స్ని ఖండించిన భారత్..
- మాల్దీవుల ముయిజ్జుని దించేందుకు భారత్ కుట్ర..
- ది వాషింగ్టన్ పోస్ట్ రిపోర్ట్..
- యూఎస్ రిపోర్టుని తోసిపుచ్చిన భారత్..
- శత్రుత్వం ప్రదర్శిస్తోందని వాషింగ్టన్ పోస్ట్పై భారత్ ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India: మాల్దీవులు అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూని గద్దె దించేందుకు భారత్ కుట్ర పన్నిందని, ముయిజ్జూని అభిశంసించేందుకు మాల్దీవుల ప్రతిపక్షాలు చేసిన విఫల కుట్రతో భారత్కి సంబంధం ఉందని ఇటీవల అమెరికా మీడియా నివేదించింది. ఈ నివేదికను భారత్ తీవ్రంగా తోసిపుచ్చింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ శుక్రవారం మాట్లాడుతూ.. ది వాషింగ్టన్ పోస్ట్ భారతదేశం పట్ల ‘‘నిర్బంధ శత్రుత్వం’’ కలిగి ఉందని ఆరోపించారు.
Read Also: Kerala political Murders: యూత్ కాంగ్రెస్ కార్యకర్తల హత్య.. 10 మందికి జీవిత ఖైదు..
Also Read
- UP: టోల్ బూత్ను ఢీకొట్టి పేలిన గ్యాస్ ట్యాంకర్.. భయానక సీసీటీవీ ఫుటేజ్ వైరల్(వీడియో)
- Sonam Raghuvanshi: సోనమ్ రఘువంశీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట.. బెయిల్ రద్దుకు నిరాకరణ
- PMAY House Size Rules: PMAY కింద శాశ్వత ఇల్లు.. ఇంటి పరిమాణం ఎంత? ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనలు ఇవే
- Fact Check: యూపీలో హిందూ మహిళ ఆరుగురి ముస్లిం వ్యక్తుల తలలు నరికిందా? వైరల్ వార్తలో నిజమెంత?
వాషింగ్టన్ పోస్ట వార్తా పత్రిక, రిపోర్టర్లు భారతదేశం పట్ల శత్రుల్వాన్ని ప్రదర్శిస్తున్నారు. మీరు వారి కార్యకలాపాలను చూస్తే మీకే అర్థమవుతుందని, వారికి విశ్వసనీయత లేదని భారత్ తీవ్రంగా స్పందించింది. ‘డెమెక్రటిక్ రెన్యూవల్ ఇనిషియేటివ్’ అనే ఇంటర్నల్ డాక్యుమెంట్ ఆధారంగా ఈ రిపోర్టుని రూపొందించింది. ముయిజ్జుని తొలగించేందుకు ప్రతిపక్ష మాల్దీవియన్ డెమొక్రటిక్ పార్టీ(ఎండీపీ) భారత్ని 6 మిలియన్ డాలర్లనున కోరిందని ఆరోపించింది. ముయిజుని అభిశంసన ద్వారా తొలగించేందుకు, ముయిజ్జు పార్టీకి చెందిన కొంతమందితో సహా 40 మంది ఎంపీలకు లంచం ఇవ్వడానికి ప్రతిపక్షం ప్లాన్ చేసిందని, అయితే అది విఫలమైందని వాషింగ్టన్ పోస్ట్ కథనంలో పేర్కొంది.
మరోవైపు పాకిస్తాన్లో వరస హత్యల్లో భారత గూఢచారం సంస్థ ‘‘రా’’ ప్రమేయం ఉందని వాషింగ్టన్ పోస్ట్ కథనాన్ని కూడా భారత్ తీవ్రంగా ఖండించింది. పాకిస్తాన్కి సంబంధించి గతంలో హిల్లరీ క్లింటన్ చేసిన వ్యాఖ్యల్ని భారత్ గుర్తు చేసింది. ‘‘మీరు పెరట్లో పాములు పెంచుకోలేరు. ఇవి పక్కవారిని కాటేయాలని ఆశించొద్దు, ఏదో రోజు అవి మిమ్మల్ని కూడా కాలేస్తాయి’’ అనే వ్యాఖ్యల్ని జైశ్వాల్ గుర్తు చేశారు. హిట్లరీ క్లింటన్ 2011లో అమెరికా విదేశాంగ మంత్రి హోదాలో పాకిస్తాన్ పర్యటనలో ఈ వ్యాఖ్యలు చేశారు.
తాజావార్తలు
-
UP: టోల్ బూత్ను ఢీకొట్టి పేలిన గ్యాస్ ట్యాంకర్.. భయానక సీసీటీవీ ఫుటేజ్ వైరల్(వీడియో)
-
Sonam Raghuvanshi: సోనమ్ రఘువంశీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట.. బెయిల్ రద్దుకు నిరాకరణ
-
PMAY House Size Rules: PMAY కింద శాశ్వత ఇల్లు.. ఇంటి పరిమాణం ఎంత? ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనలు ఇవే
-
AB De Villiers: బీసీసీఐ పెద్ద తప్పు చేసింది.. టీమిండియా ఆలోచన సరైంది కాదు!
-
Fact Check: యూపీలో హిందూ మహిళ ఆరుగురి ముస్లిం వ్యక్తుల తలలు నరికిందా? వైరల్ వార్తలో నిజమెంత?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!