Kerala political Murders: యూత్ కాంగ్రెస్ కార్యకర్తల హత్య.. 10 మందికి జీవిత ఖైదు..
- కేరళ పొలిటికల్ డబుల్ మర్డర్ కేసులో 10 మందికి యావజ్జీవం..
- 2019లో ఇద్దరు యూత్ కాంగ్రెస్ నేతల హత్య..
- కాంగ్రెస్-సీపీఎం ఘర్షణల్లో భాగంగా మర్డర్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kerala political Murders: ఐదేళ్ల క్రితం కేరళలో జరిగిన రాజకీయ హత్యలు సంచలనంగా మారాయి. అయితే, ఈ కేసులో నిందితులకు సీబీఐ ప్రత్యేక కోర్టు డబుల్ యావజ్జీవ శిక్షని విధించింది. 2019లో సీపీఎం-కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణల్లో ఇద్దరు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలైన శరత్లాల్ పీకే (24), కృపేశ్ (19)ల హత్య జరిగింది. ఈ కేసులో 10 మందిని దోషులుగా నిర్ధారించిన ఎర్నాకులంలోని సీబీఐ న్యాయస్థానం శుక్రవారం డబుల్ జీవిత ఖైదులు విధించింది.
నేరానికి సహకరించినందుకు మాజీ ఎమ్మెల్యే కేవీ కున్హిరామన్తో సహా నలుగురు సీపీఎం నాయకులకు కోర్టు 5 ఏల్ల కఠిన కారాగార శిక్షను విధించింది. ఫిబ్రవిర 17, 2019న జరిగిన ఈ హత్యలు రాజకీయ ప్రేరేపితమైనవి. బాధితులు ఎచ్చిలదుక్కం రోడ్డులో బైక్పై వెళ్తుండగా మెరుపుదాడి చేసి నరికి చంపారు.
Also Read
- Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
- Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
- Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
Read Also: HMPV Virus: చైనాలో విస్తరిస్తున్న వైరస్ కారణంగా మనం దేనికి భయపడాలి.. లాక్డౌన్ తప్పదా..?
ఈ హత్యలో 10 మంది నిందితులను హత్య, కుట్ర, చట్టవ్యతిరేకమైన సమావేశాలతో పాటు ఇతర అభియోగాల్లో దోషిులుగా నిర్ధారించింది కోర్టు. డబుల్ జీవిత ఖైదులతో పాటు టీ రంజిత్, ఏ సురేంద్రన్ సాక్ష్యాలను నాశనం చేసినందుకు, నిందితులను రక్షించినందుకు దోషులుగా నిర్ధారించి, ఒక్కొక్కరికి రూ. 2 లక్షల జరిమానా విధించారు. నిందితులను పోలీస్ కస్టడీ నునంచి బలవంతంగా విడిపించినందుకు గానూ నలుగురు సీపీఎం నాయకులు కే మణికందన్, రాఘవన్ వెలుతోలి, కెవి భాస్కరన్లకు ఐదేళ్ల జైలుశిక్ష మరియు రూ. 10,000 జరిమానా విధించారు. తగిన సాక్ష్యాధారాలు లేకపోవడంతో మరో 10 మందిని నిర్దోషులుగా కోర్టు విడుదల చేసింది.
ఈ కేసుని ముందుగా బేకల్ పోలీసులు విచారించారు, తర్వాత క్రైమ్ బ్రాంచ్తో విచారణ జరిగింది. బాధిత కుటుంబాల విజ్ఞప్తి మేరకు కేరళ హైకోర్టు, సీబీఐ విచారణకు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి దీనిపై వ్యతిరేకత వచ్చింది. డిసెంబర్ 2021లో దాఖలు చేసిన సీబీఐ ఛార్జ్ షీట్ ప్రకారం.. 20 నెలల పాటు విచారణ జరిగింది. ప్రాసిక్యూషన్ 154 మంది సాక్షులను, 495 పత్రాలను సమర్పించింది. 6 ఏళ్లు సాగిన న్యాయపోరాటంలో న్యాయమూర్తి శేషాద్రినాథన్ తీర్పుని వెలువరించారు. అయితే, నేర క్రూరత్వాన్ని పరిగణలోకి తీసుకుని నిందితులకు మరణశిక్ష విధించాలని సీబీఐ కోరింది. అయితే, వారంతా అలవాటైన నేరస్తులు కాదని, యావజ్జీవ శిక్ష విధించడం జరిగింది.
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!