Nitish Kumar: నితీష్ కుమార్ పార్టీకి రెండు కేబినెట్ బెర్తులు..
Nitish Kumar: లోక్సభ ఎన్నికలు ముగిశాయి. ఎన్డీయే కూటమి మరోసారి గెలుపొందడంతో వరసగా మూడోసారి ప్రధాని నరేంద్రమోడీ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. రేపు భారత ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇదిలా ఉంటే గతంలా కాకుండా ఈ సారి ఎన్డీయే మిత్రపక్షాల పరపతి పెరిగింది. 2014, 2019లో 543 ఎంపీ సీట్లలో బీజేపీ మెజారిటీ మార్క్(272) సీట్ల కన్నా ఎక్కువ సీట్లను స్వతహాగా కైవసం చేసుకుంది. అయితే, ఈ సారి మాత్రం 240 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. దీంతో మిత్రపక్షాలైన జేడీయూ, తెలుగుదేశం, శివసేన వంటి పార్టీలపై ఆధారపడాల్సి ఉంది.
Read Also: Congress: ఉత్తర్ప్రదేశ్లో ఘన విజయం తర్వాత, ‘ధన్యవాదయాత్ర’ని ప్రకటించిన కాంగ్రెస్..
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
ఈ నేపథ్యంలో మిత్రపక్షాలకు ప్రాధాన్యత ఉన్న కీలకమైన మంత్రి పదవులు దక్కే అవకాశం కనిపిస్తోంది. నితీష్ కుమార్ జేడీయూ పార్టీకి రెండు కేబినెట్ బెర్తుల్ని కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పార్టీ నుంచి లాలన్ సింగ్, రామ్నాథ్ ఠాకూర్ ఇద్దరు సీనియర్ నేతల పేర్లను పార్టీ ప్రతిపాధించింది. లాలన్ సింగ్ బీహార్ ముంగేర్ నుంచి లోక్ సభకు ఎన్నిక కాగా, రామ్ నాథ్ ఠాకూర్ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. మిస్టర్ ఠాకూర్ భారతరత్న గ్రహీత కర్పూరి ఠాకూర్ కుమారుడు.
ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం జేడీయూ 12 ఎంపీ స్థానాలను గెలుచుకున్న తర్వాత రెండు కేబినెట్ బెర్తుల్ని కోరింది. మరోవైపు చంద్రబాబు నాయుడుకి చెందిన టీడీపీ తమకు నాలుగు శాఖలు, పార్లమెంటరీ స్పీకర్ పదవి ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం 543 సీట్లు ఉన్న లోక్సభలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 293 సభ్యులు ఉన్నారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!