Nitish Kumar: కేంద్రానికి జేడీయూ కండీషన్.. బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని తీర్మానం
- కేంద్రానికి జేడీయూ కొత్త కండీషన్
- బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్
- రాష్ట్ర పరిస్థితి దృష్ట్యా ఇవ్వాలన్న నితీష్ సర్కార్
కేంద్రంలో మోడీ 3.0 సర్కార్ ఏర్పడిన తర్వాత లేటెస్ట్గా ప్రత్యేక హోదా అంశం తెరపైకి వచ్చింది. ఎన్డీఏ మిత్ర పక్షాల నుంచే ఈ డిమాండ్ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్రంలో మోడీ ప్రభుత్వం ప్రస్తుతం మిత్ర పక్షాల సపోర్ట్ పిల్లర్స్పై ఆధారపడి ఉంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో కూటమి పార్టీల మద్దతుతో ప్రభుత్వం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇదే మంచి అవకాశంగా జేడీయూ భావించింది. అవకాశం దొరికినప్పుడే సాధించుకోవాలన్న దృక్పథం కలిగి ఉన్న జేడీయూ.. దాన్ని అందిపుచ్చుకునేందుకు ప్లాన్ రెడీ చేసింది.
ఇది కూడా చదవండి: D. Srinivas : డీఎస్ పార్థీవదేహం వద్ద నివాళులు అర్పించిన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్ బాబు
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
మాస్టర్ ప్లాన్లో భాగంగా బీహార్లోని జేడీయూ సర్కా్ర్.. కేంద్రానికి సరికొత్త మెలిక పెట్టింది. శనివారం జేడీయూ జాతీయ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని తీర్మానం చేసింది. ప్రభుత్వం ఏర్పడి నెలరోజులైనా కాకముందే.. డిమాండ్లను తెరపైకి తెచ్చారు.
సమావేశం అనంతరం జేడీయూ సీనియర్ నేత ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్ కొత్తదేమీ కాదని. రాష్ట్ర వృద్ధి పథాన్ని వేగవంతం చేయడం, సవాళ్లను పరిష్కరించడంలో ఇది కీలకమైన దశ అని చెప్పుకొచ్చారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదా ఆర్థిక ప్యాకేజీని ఇవ్వాలని తీర్మానం చేసినట్లు వెల్లడించారు. అలాగే నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ కేసుల్లో నిందితులకు కఠిన శిక్ష విధించాలని జేడీయూ డిమాండ్ చేసింది. అంతేకాకుండా పరీక్షల్లో అక్రమాలను నివారించేందుకు పార్లమెంట్లో ప్రత్యేక కఠినచట్టం చేయాలని కోరింది. బీహార్ పరిస్థితుల్ని అర్థం చేసుకుని రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వాల్సిన అవసరం ఉందని జేడీయూ అభిప్రాయపడుతుంది. దీర్ఘకాలిక అవసరం తోనే ఈ డిమాండ్ చేస్తు్న్నట్లుగా జేడీయూ నొక్కి చెబుతోంది.
ఇది కూడా చదవండి: Monsoon Update: గుడ్న్యూస్.. మరో రెండు రోజుల్లో దేశమంతటా వ్యాపించనున్న రుతుపవనాలు
తాజాగా జేడీయూ తీసుకున్న నిర్ణయం పట్ల ప్రధాని మోడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. గత పదేళ్లలో ఏ రాష్ట్రానికి మోడీ సర్కార్ ప్రత్యేక హోదా ఇవ్వలేదు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా డిమాండ్ చేసింది. కానీ ఏ రోజూ కేంద్రం పట్టించుకోలేదు. ప్రస్తుతం మోడీ సర్కార్.. మిత్ర పక్షాల సపోర్టుతో నడుస్తోంది. ఈ నేపథ్యంలో కూటమి పార్టీల డిమాండ్లకు తలొగ్గుతారా? లేదంటే లైట్ తీసుకుంటారో చూడాలి.
ఇది కూడా చదవండి: Collapse: ఢిల్లీ తర్వాత గుజరాత్ లో భారీ ప్రమాదం.. కూలిన రాజ్కోట్ ఎయిర్ పోర్టు టెర్మినల్
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!