Mumbai Rains: రాబోయే 48 గంటలు జాగ్రత్త.. ముంబైలో వర్షాలపై దేవేంద్ర ఫడ్నవీస్ హెచ్చరిక..
- మహారాష్ట్రలో వర్షం బీభత్సం..
- ముంబైలో వర్షాలపై సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమీక్ష..
- రాబోయే 48 గంటలు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సీఎం హెచ్చరిక..
Mumbai Rains: మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాయగడ్ జిల్లాలో ఇవాళ (ఆగస్టు 19న) ఉదయం నుంచి ఎడ తెరిపి లేకుండా ఆకాలంగా కురిసిన భారీ వర్షాల కారణంగా ముంపు ప్రాంతల్లో ఏడుగురు మృతి చెందినట్లు సమాచారం. ఇక, ముంబై, థానే, పూణె నగరాల్లో భారీ వర్షాలతో పలు రోడ్లు జలమయం అయ్యాయి. ఇక, లోతట్టు ప్రాంతాలలో నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో నివాసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Read Also: KCR-Harish Rao : కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్పై హైకోర్టుకు కేసీఆర్, హరీష్ రావు
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
సీఎం ఫడ్నవీస్ హెచ్చరిక..
మరోవైపు, రాష్ట్రంలో వరద పరిస్థితులపై విపత్తు నిర్వహణ శాఖతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమీక్ష సమావేశం జరిపారు. ఈ సందర్భంగా రాబోయే 48 గంటలు ముంబై, థానే, రాయగడ్, రత్నగిరి, సింధుదుర్గ జిల్లాలకు చెందిన ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజలను తరలించడం, వరద ముప్పు ఉన్న ప్రాంతాలను పర్యవేక్షించడంతో పాటు రక్షణ చర్యలను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాగా, ఇప్పటికే నాందేడ్ జిల్లాలో వరదలతో ప్రభావితమైన గ్రామాల నుంచి 290 మందికి పైగా ప్రజలను రక్షించామని అధికారులు సీఎంకు తెలిపారు. ఈ క్రమంలో SDRF, ఆర్మీ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి.
Read Also: KunaRavikumar: నీ డిగ్రీలు నా దయ దాక్షిణ్యంతో వచ్చినవే..
డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు..
ఈ భారీ వర్షాలతో మహారాష్ట్రలో దాదాపు 10 లక్షల హెక్టార్ల వ్యవసాయ భూమి వరదల కారణంగా నీట మునిగింది అని డిప్యూటీ సీఎం అజిత్ పవార్ చెప్పుకొచ్చారు. గడ్చిరోలిలోని భామ్రాగడ్ తాలూకాలో పెర్లకోట నది ఉప్పొంగడంతో 50కి పైగా గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయని పేర్కొన్నారు. కావునా, అనవసరంగా ప్రజలు బయటకు రాకూడదని విజ్ఞప్తి చేశారు.
వాతావరణ శాఖ హెచ్చరిక
బంగాళాఖాతంలో ఏర్పడిన బలమైన తుఫాన్ గాలుల ప్రభావంతోనే మహారాష్ట్రలో కుండపోత వర్షాలు కురిపిస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కొంకణ్ నుంచి కేరళ వరకు ఏర్పడిన అల్ప పీడనం ప్రభావంతో కొంకణ్, మధ్య మహారాష్ట్ర, ఘాట్ ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు పడుతున్నాయి.. మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాల్లో సైతం మోస్తరు వర్షాలు కురుస్తున్నాయని చెప్పుకొచ్చారు. కాగా, రాబోయే రెండు రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు కొనసాగుతాయని ఐఎండీ అంచనా వేసింది. అలాగే, మరాఠ్వాడ, విదర్భ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
-
India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
-
SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!