Mumbai Rains: రాబోయే 48 గంటలు జాగ్రత్త.. ముంబైలో వర్షాలపై దేవేంద్ర ఫడ్నవీస్ హెచ్చరిక..
- మహారాష్ట్రలో వర్షం బీభత్సం..
- ముంబైలో వర్షాలపై సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమీక్ష..
- రాబోయే 48 గంటలు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సీఎం హెచ్చరిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mumbai Rains: మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాయగడ్ జిల్లాలో ఇవాళ (ఆగస్టు 19న) ఉదయం నుంచి ఎడ తెరిపి లేకుండా ఆకాలంగా కురిసిన భారీ వర్షాల కారణంగా ముంపు ప్రాంతల్లో ఏడుగురు మృతి చెందినట్లు సమాచారం. ఇక, ముంబై, థానే, పూణె నగరాల్లో భారీ వర్షాలతో పలు రోడ్లు జలమయం అయ్యాయి. ఇక, లోతట్టు ప్రాంతాలలో నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో నివాసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Read Also: KCR-Harish Rao : కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్పై హైకోర్టుకు కేసీఆర్, హరీష్ రావు
Also Read
- Poonam Pandey: శృంగార వీడియోలు ‘‘సామాజిక సేవ’’.. వ్యభిచారంపై పూనమ్ పాండే సంచలన వ్యాఖ్యలు..
- UN: ఫలించిన భారత్ పోరాటం.. నవంబర్ 27 అంతర్జాతీయ బాల్య వివాహాల నిర్మూలన దినోత్సవంగా ప్రకటన
- Yusmarg Encounter: భద్రతా బలగాలకు కీలక విజయం.. లష్కర్ కమాండర్ యాసిర్ ఎన్కౌంటర్..
- Liquor Prices: మద్యం బాటిళ్లపై అదనపు వసూళ్లు.. సీఎం సీరియస్.. 3 రోజుల్లో 240 మందిపై వేటు..
సీఎం ఫడ్నవీస్ హెచ్చరిక..
మరోవైపు, రాష్ట్రంలో వరద పరిస్థితులపై విపత్తు నిర్వహణ శాఖతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమీక్ష సమావేశం జరిపారు. ఈ సందర్భంగా రాబోయే 48 గంటలు ముంబై, థానే, రాయగడ్, రత్నగిరి, సింధుదుర్గ జిల్లాలకు చెందిన ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజలను తరలించడం, వరద ముప్పు ఉన్న ప్రాంతాలను పర్యవేక్షించడంతో పాటు రక్షణ చర్యలను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాగా, ఇప్పటికే నాందేడ్ జిల్లాలో వరదలతో ప్రభావితమైన గ్రామాల నుంచి 290 మందికి పైగా ప్రజలను రక్షించామని అధికారులు సీఎంకు తెలిపారు. ఈ క్రమంలో SDRF, ఆర్మీ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి.
Read Also: KunaRavikumar: నీ డిగ్రీలు నా దయ దాక్షిణ్యంతో వచ్చినవే..
డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు..
ఈ భారీ వర్షాలతో మహారాష్ట్రలో దాదాపు 10 లక్షల హెక్టార్ల వ్యవసాయ భూమి వరదల కారణంగా నీట మునిగింది అని డిప్యూటీ సీఎం అజిత్ పవార్ చెప్పుకొచ్చారు. గడ్చిరోలిలోని భామ్రాగడ్ తాలూకాలో పెర్లకోట నది ఉప్పొంగడంతో 50కి పైగా గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయని పేర్కొన్నారు. కావునా, అనవసరంగా ప్రజలు బయటకు రాకూడదని విజ్ఞప్తి చేశారు.
వాతావరణ శాఖ హెచ్చరిక
బంగాళాఖాతంలో ఏర్పడిన బలమైన తుఫాన్ గాలుల ప్రభావంతోనే మహారాష్ట్రలో కుండపోత వర్షాలు కురిపిస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కొంకణ్ నుంచి కేరళ వరకు ఏర్పడిన అల్ప పీడనం ప్రభావంతో కొంకణ్, మధ్య మహారాష్ట్ర, ఘాట్ ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు పడుతున్నాయి.. మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాల్లో సైతం మోస్తరు వర్షాలు కురుస్తున్నాయని చెప్పుకొచ్చారు. కాగా, రాబోయే రెండు రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు కొనసాగుతాయని ఐఎండీ అంచనా వేసింది. అలాగే, మరాఠ్వాడ, విదర్భ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
తాజావార్తలు
-
KTR : జీవో 97పై కేటీఆర్ ఫైర్.. విద్యార్థులకు కీలక హామీ
-
Maharashtra: డ్యాన్స్ క్లాస్ ఉందని వంట చేయని భార్య.. దారుణానికి ఒడిగట్టిన భర్త..
-
Ishan Kishan: కెప్టెన్గా ఇషాన్ కిషన్ రీఎంట్రీ.. రేపే తుది సమరం..
-
Iran-US War: మరోసారి యుద్ధం తీవ్రం.. ఖర్గ్ ద్వీపం దగ్గర భారీ పేలుళ్లు.. ఇరాన్ ఆయిల్ ట్యాంకర్పై అమెరికా దాడి!
-
Poonam Pandey: శృంగార వీడియోలు ‘‘సామాజిక సేవ’’.. వ్యభిచారంపై పూనమ్ పాండే సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!