Uttar Pradesh: డాక్టర్ సలహాతో అరగంట పాటు ఎండలో 5 రోజుల శిశువు.. చివరకు విషాదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh: సాధారణంగా నవజాత శిశువుల్ని ఉదయం పూట సూర్యరశ్మిలో కొన్ని నిమిషాలు ఉంచాలని డాక్టర్లు సలహా ఇస్తుంటారు. అయితే ఉత్తర్ ప్రదేశ్కి చెందిన ఓ డాక్టర్ కూడా నవజాత శిశువు విషయంలో ఇలాగే సలహా ఇచ్చాడు. అయితే, శిశువు ఉదయం అరగంట పాటు ఎండలో ఉండటంతో మరణించింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్లోని మెయిన్పురిలో జరిగింది. 5 రోజుల శిశువు మరణించడంతో కుటుంబ సభ్యుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. డాక్టర్ నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ చనిపోయిందని కుటుంబం ఆరోపించింది. ఈ ఘటనపై మెయిన్ పురి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆర్సీ గుప్తా విచారణ ప్రారంభించారు. ప్రస్తుతం సదరు ప్రైవేట్ ఆస్పత్రి డాక్టర్ పరారీలో ఉన్నాడు.
ఆర్సీ గుప్తా ప్రకారం.. మెయిన్పురి భుగై గ్రామానికి చెందిన రీటా దేవీ 5 రోజుల క్రితం సీ-సెక్షన్ ద్వారా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. బుధవారం శిశువులో కొన్ని ఆరోగ్య సమస్యలు కనిపించాయి. శిశువును సూర్యరశ్మిలో అరగంట పాటు ఉంచమని కుటుంబానికి సలహా ఇచ్చాడు. వైద్యుడి సలహా మేరకు ఉదయం 11.10 గంటలకు పసికందును ఆస్పత్రి పైకప్పుపై ఉంచారు. 30 నిమిషాల తర్వాత చిన్నారిని కిందకు దించారు. అప్పటికే పాప చనిపోయింది.
Also Read
- Solar Eclipse 2026: రేపే సంపూర్ణ సూర్యగ్రహణం.. ఎక్కడ కనిపిస్తుంది..? భారత్లో పరిస్థితి ఏంటి..? పూర్తి వివరాలు
- JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
‘‘నియోనాటల్ జాండిస్’’ నివారించేందుకు నవజాత శిశువులను సూర్యరశ్మి సోకేలా కొంత సమయం ఎండలో ఉంచుతారు. అయితే, ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉన్న సమయంలో ఇది చాలా జాగ్రత్తగా చేయాలి. సాధారణం సూర్యోదయం పూట ఇలాంటివి చేస్తారు. కానీ ఆ కుటుంబం మాత్రం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఎండ తీవ్రత ఎక్కువ ఉన్న సమయంలో బిడ్డను ఎండలో ఉంచడంతోనే చనిపోయినట్లు తెలుస్తోంది. ఎండ దెబ్బ, వేడి అధికంగా ఉండటం, బిడ్డను పర్యవేక్షించకపోవడంతో శిశువు మరణించిందని వైద్యులు చెబుతున్నారు.
సలహా ఇచ్చిన డాక్టర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఈ సంఘటన జరిగిన తర్వాత ఆస్పత్రి సిబ్బంది రీటా దేవీని బలవంతంగా డిశ్చార్జ్ చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టామని, చర్యలు తీసుకుంటామ్ని సీఎంవో డాక్టర్ ఆర్సీ గుప్తా చెప్పారు.
తాజావార్తలు
-
Ajinkya Rahane: టీమిండియా టెస్ట్ టీమ్ కోసం మేం ముగ్గురం ఎంతో కష్టపడ్డాం!
-
IRUMUDI : ఇరుముడి కథ, కథనం ఏంటో చెప్పేసిన దర్శకుడు శివ నిర్వాణ
-
ODI World Cup 2027: ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన టీమ్.. ఇప్పుడు వరల్డ్కప్ బెర్త్ కోసం పాకులాట!
-
RD Burman Biopic: రాజేష్ ఖన్నాగా అక్షయ్, మెహమూద్గా ఇమ్రాన్… త్వరలోనే ఆర్డీ బర్మన్ బయోపిక్ షూటింగ్
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
ట్రెండింగ్
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!