Shiromani Akali Dal: “డ్రగ్స్ నేరస్తులకు ఉరిశిక్ష, పంజాబ్ ద్వారా పాకిస్తాన్తో వ్యాపారం”.. ఎస్ఏడీ మానిఫెస్టో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shiromani Akali Dal: లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోలో శిరోమణి అకాళీదళ్ కీలక హామీలను ఇచ్చింది. పంజాబ్ జలంధర్లో ఈ రోజు ఎన్నికల మేనిఫెస్టోను ఆ పార్టీ అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్ విడుదల చేశారు. జూన్ 1న పంజాబ్లోని అన్ని స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. తమ పార్టీని లోక్సభ ఎన్నికల్లో గెలిపిస్తే మాదక ద్రవ్యాల కేసులో నిందితులకు ఉరిశిక్ష విధించాలని పిలుపునిచ్చాడు. సిక్కు ఖైదీల విడుదల కోసం పోరాటాన్ని కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. అమృత్సర్లోని అట్టారీ-వాఘా చెక్పోస్ట్, ఫిరోజ్పూర్లోని హుస్సేనివాలా మరియు ఫజిల్కా ద్వారా భారతదేశం-పాకిస్తాన్ వాణిజ్య కారిడార్ను తిరిగి తెరవడానికి కృషి చేస్తామని వెల్లడించారు.
Read Also: Pune horror: భర్త అమానుషం.. భార్య శీలాన్ని శంకించి ఏం చేశాడంటే..!
Also Read
- Parliament Monsoon Session: నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు.. నిలదీసేందుకు ప్రతిపక్షం.. కీలక చట్టాలకు ఎన్డీఏ సిద్ధం..
- Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
- Geetanjali Angmo: సుప్రీంకోర్టు మెట్లెక్కిన సోనమ్ వాంగ్చుక్ భార్య.. హైకోర్టు తీర్పుపై సవాల్!
- Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్ను ఆస్పత్రికి తరలించడం సరైనదే: ఢిల్లీ హైకోర్టు
గుజరాత్ ఓడరేవుల ద్వారా పాకిస్తాన్తో వాణిజ్యాన్ని కేంద్రం అనుమతించగలిగితే, పంజాబ్లో వాణిజ్యాన్ని పెంచడానికి రహదారి నెట్వర్క్ ద్వారా అదే ఎందుకు చేయలేము.? అని ప్రశ్నించారు. తాము ఎన్నికైతే పొరుగు దేశాలతో అంతర్జాతీయ వాణిజ్యాన్ని పునరుద్ధరించేలా డిమాండ్ చేస్తామని ఆ పార్టీ నేతలు వెల్లడించారు. డ్రగ్స్ వ్యాపారం, దాని వెనక ఉన్నవారినపై కఠినమైన చట్టాలు తీసుకురావాలని కేంద్రాన్ని గట్టిగా డిమాండ్ చేస్తామని సుఖ్బీర్ చెప్పారు. సిక్కు ఖైదీల (బందీ సింగ్లు) విడుదల కోసం కేంద్రంతో పార్టీ తన పోరాటాన్ని కొనసాగిస్తుందని SAD అధ్యక్షుడు చెప్పారు. జాతీయ భద్రతా చట్టం(ఎన్ఎస్ఏ) రద్దుకు వ్యతిరేకంగా బలమైన స్వరాన్ని వినిపిస్తామని అన్నారు. ఈడీ, సీబీఐ వంటి జాతీయ ఏజెన్సీలు తనిఖీలు, బ్యాలెన్స్ వ్యవస్థని ప్రతిపాదిస్తామని, రాజకీయ దుర్వినియోగం కాకుండా నిరోధిస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచారు. కాంగ్రెస్, బీజేపీ, ఆప్ విభజన రాజకీయాలు చేసి, మతసామరస్యాన్ని దెబ్బతీస్తున్నాయని అకాళీదళ్ ఆరోపించింది. పంజాబ్లో 13 ఎంపీ స్థానాలకు జూన్ 1న ఎన్నికలు జరగనున్నాయి.
ఎస్ఏడీ హామీలు:
పంజాబ్ స్వతంత్ర రాజధానిగా చండీగఢ్ కోసం పోరాటం, అన్ని సిక్కు మత సంస్థల్ని ఇతర ఆర్గనైషన్ల నుంచి SGPC పరిధిలోకి తీసుకురావడం, రైతులకు ఎంఎస్పీ, పంజాబీయేతరులు వ్యవసాయం కోసం పంజాబ్లో భూమిని కొనుగోలు చేయకుండా నిరోధించడం, పంజాబీలు రాజస్తాన్, హర్యానాలలో వ్యవసాయ భూమని కొనుగోలు చేయడానిక అనుమతించడం, పంజాబ్లో పంజాబీలు మాత్రమే ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు పొందేలా చట్టం తీసుకురావడం, అమృత్సర్ను టెక్స్టైల్ మరియు టూరిజం హబ్గా అభివృద్ధి చేయడం.
తాజావార్తలు
-
Rohit Sharma Last ODI: రోహిత్ శర్మ చివరి వన్డే ఆడేశాడా?.. కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర సమాధానం!
-
Rohit Sharma: రోహిత్ శతకం వెనుక ఆసక్తికర రహస్యం.. మ్యాచ్ తర్వాత బ్యాట్ స్టోరీ వైరల్..
-
Khadgam Re Release: దేశభక్తి సినిమాలకే బాస్.. ‘ఖడ్గం’ మళ్లీ థియేటర్లలోకి వస్తోంది!
-
FIFA World Cup Prize Money: ఛాంపియన్ స్పెయిన్కు ఎన్ని కోట్ల ప్రైజ్ మనీ లభించిందంటే.?
-
Tesla Kids Bike: పిల్లల కోసం టెస్లా కొత్త బ్యాలెన్స్ బైక్.. పెడల్స్, మోటార్ లేకుండానే సైక్లింగ్ నేర్పించే ప్రత్యేక డిజైన్
ట్రెండింగ్
-
Shubman Gill: అప్పటివరకు పోటీలోనే ఉన్నాం.. ఆ ముగ్గురే ముంచారు.. లార్డ్స్ ఓటమిపై శుభ్మన్ గిల్ షాకింగ్ కామెంట్స్!
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్