UP Assembly: అసెంబ్లీలో కొత్త రూల్స్.. పేపర్లు చింపరాదు, ఫోన్లు తీసుకురాకూడదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP Assembly: అసెంబ్లీకి హాజరయ్యే ఎమ్మెల్యేలు తమతోపాటు అసెంబ్లీలోకి ఏవైనా తీసుకెళ్లడానికి అనుమతి ఉంటుంది. ఇతరులకు అనుమతి ఉండదు. కానీ ఇకపై అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే ఎమ్మెల్యేలు సైతం తమ ఫోన్లను లోనికి తీసుకెళ్లడానికి వీల్లేదు. అదేంటీ ఎక్కడ ఇటువంటి రూల్ ఉంది? అని అనుకుంటున్నారా? కొత్తగా ఉత్తర్ప్రదేశ్లో ఈ రూల్ను తీసుకురానున్నారు. వీటితోపాటు మరికొన్ని కొత్త నిబంధనలను కూడా రూపొందించారు. వాటిపై నేడు అసెంబ్లీలో చర్చించి తీర్మానం చేసిన తరువాత వాటిని అమలు చేయనున్నారు.
Read also: YSRCP on No Confidence Motion: కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకించిన వైసీపీ
ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీలో కొత్త రూల్స్ అమలు కానున్నాయి. ఇకపై అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే ఎమ్మెల్యేలు ఎటువంటి పేపర్లను తమతోపాటు లోనికి తీసుకెళ్లకూడదు. అసెంబ్లీలోకి సెల్ఫోన్లను సైతం అనుమతించరు. అసెంబ్లీలో బిగ్గరగా నవ్వరాదని.. సభలో ఎటువంటి పత్రాలు చించకూడదు. స్పీకర్కు వెన్ను చూపేలా నిల్చోవడం లేదా కూర్చోవడం చేయకూడదు. ఇటువంటి కొత్త నిబంధనలు ఇకపై బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల సందర్బంగా అమలు కానుంది. ఉత్తరప్రదేశ్ శాసనసభ విధివిధానాలు, సభలో ప్రవర్తనకు సంబంధించిన కొత్త నియమాల బిల్లు- 2023ను సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దీనిపై నేడు చర్చ జరిపిన తర్వాత ఈ బిల్లును ఆమోదించనున్నట్లు యూపీ అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానా ప్రకటించారు. కొత్త నిబంధనల ప్రకారం శాసనసభ్యులు సభలో ఎలాంటి పత్రాలను చించే వీలుండదు. సభలో వారు మాట్లాడుతున్నప్పుడు గ్యాలరీలో ఎవరి వైపు చూడటం చేయకూడదు. సభ్యులు వంగి స్పీకర్ స్థానాన్ని గౌరవించాలి. ఎమ్మెల్యేలు సభలోకి ప్రవేశించేటప్పుడు, మరియు బయటకు వెళ్లేటప్పుడు లేదా కూర్చున్నప్పుడు, వారి సీట్ల నుంచి లేచేప్పుడు స్పీకర్కు వీపు చూపకూడదు. సభలోకి ఆయుధాలు తీసుకురావడం లేదా ప్రదర్శించడం నిషేధం. సభ్యులు లాబీలో పొగతాగరాదు. బిగ్గరగా మాట్లాడటం లేదా నవ్వడం చేయకూడదు. ప్రస్తుతం ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలను 14 రోజుల నుంచి ఏడు రోజులకు తగ్గించనున్నట్టు తెలిసింది. సభ్యులు ఎటువంటి సాహిత్యం, ప్రశ్నాపత్రం, పుస్తకం లేదా పత్రికా వ్యాఖ్యలను సభలోకి తీసుకురాకూడదని కొత్త నిబంధనల్లో రూపొందించారు.
Also Read
- Rahul Gandhi on NEET Paper Leak: "యువత భవిష్యత్తును ఎక్కువగా దెబ్బతీసింది మీరే".. ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ కౌంటర్
- PM Modi on NEET Protest: నీట్ పేపర్ లీక్ వివాదంపై మౌనం వీడిన ప్రధాని మోడీ.. ఫాస్ట్ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు ఆదేశం
- CJP Protest: విద్యార్థుల మాటున అసాంఘిక శక్తులు.. CJP నిరసనలపై పోలీసుల సంచలన ప్రకటన..
- Dharmendra Pradhan: కేంద్ర విద్యాశాఖ మంత్రిని తప్పించకపోవడానికి 5 బలమైన కారణాలివే..
తాజావార్తలు
-
Objection My Lord Trailer : మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ‘అబ్జెక్షన్ మై లార్డ్’ ట్రైలర్ విడుదల
-
Rahul Gandhi on NEET Paper Leak: “యువత భవిష్యత్తును ఎక్కువగా దెబ్బతీసింది మీరే”.. ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ కౌంటర్
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
AP Cabinet Meeting: కేబినెట్ ముందు 25కి పైగా కీలక ప్రతిపాదనలు.. నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
-
US Airstrike: తారాస్థాయికి చేరిన అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. రంగంలోకి బీ-1 బాంబర్!
ట్రెండింగ్
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!