UP Assembly: అసెంబ్లీలో కొత్త రూల్స్.. పేపర్లు చింపరాదు, ఫోన్లు తీసుకురాకూడదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP Assembly: అసెంబ్లీకి హాజరయ్యే ఎమ్మెల్యేలు తమతోపాటు అసెంబ్లీలోకి ఏవైనా తీసుకెళ్లడానికి అనుమతి ఉంటుంది. ఇతరులకు అనుమతి ఉండదు. కానీ ఇకపై అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే ఎమ్మెల్యేలు సైతం తమ ఫోన్లను లోనికి తీసుకెళ్లడానికి వీల్లేదు. అదేంటీ ఎక్కడ ఇటువంటి రూల్ ఉంది? అని అనుకుంటున్నారా? కొత్తగా ఉత్తర్ప్రదేశ్లో ఈ రూల్ను తీసుకురానున్నారు. వీటితోపాటు మరికొన్ని కొత్త నిబంధనలను కూడా రూపొందించారు. వాటిపై నేడు అసెంబ్లీలో చర్చించి తీర్మానం చేసిన తరువాత వాటిని అమలు చేయనున్నారు.
Read also: YSRCP on No Confidence Motion: కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకించిన వైసీపీ
ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీలో కొత్త రూల్స్ అమలు కానున్నాయి. ఇకపై అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే ఎమ్మెల్యేలు ఎటువంటి పేపర్లను తమతోపాటు లోనికి తీసుకెళ్లకూడదు. అసెంబ్లీలోకి సెల్ఫోన్లను సైతం అనుమతించరు. అసెంబ్లీలో బిగ్గరగా నవ్వరాదని.. సభలో ఎటువంటి పత్రాలు చించకూడదు. స్పీకర్కు వెన్ను చూపేలా నిల్చోవడం లేదా కూర్చోవడం చేయకూడదు. ఇటువంటి కొత్త నిబంధనలు ఇకపై బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల సందర్బంగా అమలు కానుంది. ఉత్తరప్రదేశ్ శాసనసభ విధివిధానాలు, సభలో ప్రవర్తనకు సంబంధించిన కొత్త నియమాల బిల్లు- 2023ను సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దీనిపై నేడు చర్చ జరిపిన తర్వాత ఈ బిల్లును ఆమోదించనున్నట్లు యూపీ అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానా ప్రకటించారు. కొత్త నిబంధనల ప్రకారం శాసనసభ్యులు సభలో ఎలాంటి పత్రాలను చించే వీలుండదు. సభలో వారు మాట్లాడుతున్నప్పుడు గ్యాలరీలో ఎవరి వైపు చూడటం చేయకూడదు. సభ్యులు వంగి స్పీకర్ స్థానాన్ని గౌరవించాలి. ఎమ్మెల్యేలు సభలోకి ప్రవేశించేటప్పుడు, మరియు బయటకు వెళ్లేటప్పుడు లేదా కూర్చున్నప్పుడు, వారి సీట్ల నుంచి లేచేప్పుడు స్పీకర్కు వీపు చూపకూడదు. సభలోకి ఆయుధాలు తీసుకురావడం లేదా ప్రదర్శించడం నిషేధం. సభ్యులు లాబీలో పొగతాగరాదు. బిగ్గరగా మాట్లాడటం లేదా నవ్వడం చేయకూడదు. ప్రస్తుతం ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలను 14 రోజుల నుంచి ఏడు రోజులకు తగ్గించనున్నట్టు తెలిసింది. సభ్యులు ఎటువంటి సాహిత్యం, ప్రశ్నాపత్రం, పుస్తకం లేదా పత్రికా వ్యాఖ్యలను సభలోకి తీసుకురాకూడదని కొత్త నిబంధనల్లో రూపొందించారు.
Also Read
- CM Vijay: పుజల్ జైలులో సీఎం విజయ్ సడన్ ఇన్స్పెక్షన్.. ఆసుపత్రి, లైబ్రరీ, కంప్యూటర్ సెంటర్ తనిఖీ
- Mallikarjun Kharge: ప్రధాని మోడీ, అమిత్షాకు ఖర్గే లేఖ.. వారిని కాపాడాలని విజ్ఞప్తి
- PM Modi: విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ.. ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్లో కీలక పర్యటన.!
- GST Bribery Case: లంచం బాగోతం.. రూ.1.50 కోట్లు డిమాండ్.. రూ.40 లక్షలకు ఒప్పందం.. ఇద్దరు GST అధికారులు అరెస్ట్
తాజావార్తలు
-
CM Vijay: పుజల్ జైలులో సీఎం విజయ్ సడన్ ఇన్స్పెక్షన్.. ఆసుపత్రి, లైబ్రరీ, కంప్యూటర్ సెంటర్ తనిఖీ
-
Suryakumar Yadav: కెప్టెన్గా విజయాల పరంపర.. కట్ చేస్తే జట్టులో చోటే లేదు.. తొలిసారి స్పందించిన సూర్య.. సంచలన వ్యాఖ్యలు
-
Nam vs SA: టీ20ల్లో సంచలనం.. సౌతాఫ్రికాను మరోసారి మట్టికరిపించిన నమీబియా.!
-
Devool Band 2: రూ.8 కోట్ల బడ్జెట్ తో రూ.100 కోట్లు కొల్లగొట్టిన మరాఠీ సినిమా.. లాభాలన్నీ రైతు కుటుంబాలకే ..
-
Nepal Floods: 5 వేల మీటర్ల ఎత్తున.. అసలేం జరిగింది? హిమాలయాల గుండెల్లో దాగిన మిస్టరీ!
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!