దాయాది దేశం పాకిస్థాన్తో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో భారత రక్షణ రంగం అప్రమత్తం అవుతోంది. స్వదేశీ పరిజ్ఞానంతో అత్యాధునిక ఆయుధాలు తయారు చేసేందుకు రక్షణ రంగం సిద్ధపడుతోంది. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ల ఎగ్జిక్యూషన్ (AMCA) ప్లాన్ను సిద్ధం చేయడానికి మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమోదం తెలిపారు. ఇతర సంస్థల భాగస్వామ్యంతో బెంగళూరులోని డీఆర్డీవో-ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఏడీఏ) దీనిని అమలు చేయనుంది.
ఇది కూడా చదవండి: Aamir Khan : ‘సితారే జమీన్ పర్’ పై అమిర్ ఖాన్ సంచలన నిర్ణయం..
ఐదో తరం యుద్ధ విమానం అడ్వాన్స్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ నమూనాను తొలిసారి ఏరో ఇండియా-2025లో ప్రపంచానికి పరిచయం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో దీన్ని రూపొందించిడానికి కసరత్తు చేస్తున్నారు. ఏఐ ఆధారిత ఎలక్ట్రానిక్ పైలట్, నెట్ ఆధారిత ఆయుధ వ్యవస్థల వంటి ప్రత్యేకతలు ఈ విమానం సొంతం. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ ఇది సమర్థంగా సత్తా చాటనుంది. 25 టన్నుల బరువు ఉండే ఈ విమానాన్ని మానవ రహితంగా పనిచేసేలా రూపొందించనున్నారు.
ఇది కూడా చదవండి: PM Modi: పహల్గామ్కు ప్రతిస్పందనగా 22 నిమిషాల్లోనే పాక్కు బుద్ధి చెప్పాం
భారతదేశం తన వైమానిక శక్తి సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి అధునాతన స్టెల్త్ లక్షణాలతో మీడియం వెయిట్ డీప్ పెనెట్రేషన్ ఫైటర్ జెట్ను అభివృద్ధి చేయడానికి ప్రతిష్టాత్మకమైన అమ్కా ప్రాజెక్ట్పై పని చేస్తోంది. స్వదేశీ రక్షణ సామర్థ్యాలను పెంపొందించడం మరియు బలమైన దేశీయ ఏరోస్పేస్ పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థను పెంపొందించే దిశగా గణనీయమైన కృషిలో భాగంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ మోడల్ను ఆమోదించినట్లు రక్షణ శాఖ తెలిపింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని భద్రతపై కేబినెట్ కమిటీ గత సంవత్సరం ఫైటర్ జెట్ కార్యక్రమానికి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు వ్యయం దాదాపు రూ.15,000 కోట్లుగా ఉంటుందని అంచనా. దీర్ఘకాలిక అవసరాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ ప్రాజెక్ట్ రూపొందిస్తున్నారు. ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ పరిశ్రమ భాగస్వామ్యం ద్వారా ఈ కార్యక్రమాన్ని అమలు చేయడానికి సిద్ధంగా ఉంది.