Rajnath Singh: ఏఐ ఆధారిత అమ్కా యుద్ధ విమానం.. రాజ్నాథ్సింగ్ ఆమోదం
- ఏఐ సాయంతో అమ్కా యుద్ధ విమానం
- రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ ఆమోదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దాయాది దేశం పాకిస్థాన్తో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో భారత రక్షణ రంగం అప్రమత్తం అవుతోంది. స్వదేశీ పరిజ్ఞానంతో అత్యాధునిక ఆయుధాలు తయారు చేసేందుకు రక్షణ రంగం సిద్ధపడుతోంది. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ల ఎగ్జిక్యూషన్ (AMCA) ప్లాన్ను సిద్ధం చేయడానికి మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమోదం తెలిపారు. ఇతర సంస్థల భాగస్వామ్యంతో బెంగళూరులోని డీఆర్డీవో-ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఏడీఏ) దీనిని అమలు చేయనుంది.
ఇది కూడా చదవండి: Aamir Khan : ‘సితారే జమీన్ పర్’ పై అమిర్ ఖాన్ సంచలన నిర్ణయం..
Also Read
- BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
ఐదో తరం యుద్ధ విమానం అడ్వాన్స్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ నమూనాను తొలిసారి ఏరో ఇండియా-2025లో ప్రపంచానికి పరిచయం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో దీన్ని రూపొందించిడానికి కసరత్తు చేస్తున్నారు. ఏఐ ఆధారిత ఎలక్ట్రానిక్ పైలట్, నెట్ ఆధారిత ఆయుధ వ్యవస్థల వంటి ప్రత్యేకతలు ఈ విమానం సొంతం. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ ఇది సమర్థంగా సత్తా చాటనుంది. 25 టన్నుల బరువు ఉండే ఈ విమానాన్ని మానవ రహితంగా పనిచేసేలా రూపొందించనున్నారు.
ఇది కూడా చదవండి: PM Modi: పహల్గామ్కు ప్రతిస్పందనగా 22 నిమిషాల్లోనే పాక్కు బుద్ధి చెప్పాం
భారతదేశం తన వైమానిక శక్తి సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి అధునాతన స్టెల్త్ లక్షణాలతో మీడియం వెయిట్ డీప్ పెనెట్రేషన్ ఫైటర్ జెట్ను అభివృద్ధి చేయడానికి ప్రతిష్టాత్మకమైన అమ్కా ప్రాజెక్ట్పై పని చేస్తోంది. స్వదేశీ రక్షణ సామర్థ్యాలను పెంపొందించడం మరియు బలమైన దేశీయ ఏరోస్పేస్ పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థను పెంపొందించే దిశగా గణనీయమైన కృషిలో భాగంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ మోడల్ను ఆమోదించినట్లు రక్షణ శాఖ తెలిపింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని భద్రతపై కేబినెట్ కమిటీ గత సంవత్సరం ఫైటర్ జెట్ కార్యక్రమానికి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు వ్యయం దాదాపు రూ.15,000 కోట్లుగా ఉంటుందని అంచనా. దీర్ఘకాలిక అవసరాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ ప్రాజెక్ట్ రూపొందిస్తున్నారు. ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ పరిశ్రమ భాగస్వామ్యం ద్వారా ఈ కార్యక్రమాన్ని అమలు చేయడానికి సిద్ధంగా ఉంది.
తాజావార్తలు
-
OnePlus N6x: వన్ప్లస్ N6x త్వరలో భారత్లోకి.. ఎంట్రీ లెవల్ సెగ్మెంట్లో మరో సంచలనం
-
Palli Chattambi OTT: ఓటీటీలోకి టోవినో థామస్ పీరియడ్ యాక్షన్ డ్రామా… స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
-
Guntur: కన్న కొడుకును చంపిన తల్లిదండ్రులు.!
-
Windfall Tax: పెట్రోల్-డీజిల్, ఏటీఎఫ్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈ పన్ను అకస్మాత్తుగా పెంపు
-
The Paradise Rights : ప్యారడైజ్ రైట్స్ కోసం రూ. 110 కోట్లు అఫర్ చేసిన దిల్ రాజు.. పుకార్లు నమ్మొద్దన్న నిర్మాత
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!