PM Modi: పహల్గామ్కు ప్రతిస్పందనగా 22 నిమిషాల్లోనే పాక్కు బుద్ధి చెప్పాం
- పహల్గామ్కు ప్రతిస్పందనగా 22 నిమిషాల్లోనే పాక్కు బుద్ధి చెప్పాం
- ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టిన ప్రధాని మోడీ
- తగిన ఆధారాలు ఉన్నాయని వ్యాఖ్య
పహల్గామ్ ఉగ్ర దాడికి ప్రతిస్పందనగా 22 నిమిషాల్లోనే దాయాది దేశం పాకిస్థాన్కు బుద్ధి చెప్పినట్లు ప్రధాని మోడీ అన్నారు. ప్రధాని మోడీ గుజరాత్లో రెండో రోజు పర్యటిస్తున్నారు. గాంధీనగర్లో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్పై ప్రతిపక్షాలు రుజువులు అడుగుతున్నాయని.. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్(పీవోకే)లో తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను కేవలం 22 నిమిషాల్లోనే ధ్వంసం చేసినట్లు తెలిపారు. గతంలో చేసిన వైమానిక దాడులపై కూడా విపక్షాలు అనుమానాలు వ్యక్తం చేశాయని.. కానీ ఈసారి మాత్రం ఆపరేషన్ సిందూర్కు సంబంధించి బలమైన ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. కేవలం 22 నిమిషాల్లోనే ఉగ్రవాదులను అంతం చేసినట్లు చెప్పారు.
ఇది కూడా చదవండి: Karnataka: ముస్లిం ఐఏఎస్పై బీజేపీ నేత అనుచిత వ్యాఖ్యలు.. కర్ణాటకలో దుమారం
Also Read
ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. అనంతరం భారత్ పలు కఠి నిర్ణయాలు తీసుకుంది. పాక్కు సింధు జలాలు నిలిపేసింది. వీసాలను రద్దు చేసింది. అటారీ సరిహద్దు నిలిపేసింది. అనంతరం మే 7న పాకిస్థాన్పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. భారత్ జరిపిన దాడుల్లో 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అలాగే పాకిస్థాన్లో పలు వైమానిక స్థావరాలు దెబ్బతిన్నాయి. అనంతరం పాకిస్థాన్ కాళ్లు బేరానికి రావడంతో భారత్ కాల్పుల విరమణకు అంగీకరించింది.
ఇది కూడా చదవండి: CM Chandrababu: అందుకే కడప గడ్డపై ‘మహానాడు’ నిర్వహిస్తున్నాం!
ఉగ్రవాదాన్ని ఆయుధంగా ఉపయోగించుకుని భారత్పై పాకిస్థాన్ యుద్ధం చేస్తుందన్నారు. అందుకే భారత్ నుంచి ఉగ్రవాద ముల్లును తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. 75 ఏళ్లుగా ఉగ్రవాదులు దాడులు చేస్తూనే ఉన్నారు. ఇలా భరిస్తూనే ఉండాలా? అందుకే పాకిస్థాన్కు బుద్ధి చెప్పేందుకే ఆపరేషన్ సిందూర్ చేపట్టినట్లు తెలిపారు. భారత్.. శాంతిని నమ్ముతుందని.. కానీ పదే పదే రెచ్చగొడితే మాత్రం.. తిరిగి దాడికి చేయడానికి భారత్ వెనుకాడదని హెచ్చరించారు. భారత్ కూడా యోధుల భూమి అని ప్రపంచానికి గుర్తు చేయాలన్నారు.
With over two decades of transformative urban development, Gujarat is setting new benchmarks in building world-class cities. Addressing a programme in Gandhinagar. https://t.co/SY9QY6nqDB
— Narendra Modi (@narendramodi) May 27, 2025
తాజావార్తలు
-
Senior Citizen FD: సీనియర్ సిటిజన్లకు FDలో అత్యధిక రాబడి.. ఏ బ్యాంకులు ఉత్తమం? పూర్తి వివరాలు
-
FTA: ఇరాన్ యుద్ధం గొడవలో ప్రపంచం.. సైలెంట్గా కీలక ఒప్పందాన్ని పూర్తి చేసిన భారత్..
-
Sanju Samson: గుజరాత్ టైటాన్స్పై చేసిన పరుగులు 11.. అయినా మరో రికార్డ్ సాధించిన సంజూ శాంసన్..
-
Post Office Scheme: కేవలం వడ్డీతోనే రూ.18 లక్షలు.. సింపుల్గా కోటీశ్వరులు అయ్యే ఛాన్స్!
-
Weight Loss: బరువు తగ్గాలనుకునే వారికి శుభవార్త.. ఇంత వరకు ఎవరూ చెప్పని చిట్కా.. 99 శాతం సక్సెస్..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!