ప్రజంట్ OTT సంస్థలు ప్రేక్షకులపై చాలా ప్రభావం చూపుతున్నాయి. సినిమా థియేట్రికల్ రన్ పూర్తి కావడం ఆలస్యం.. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్స్టార్ వంటి మేజర్ ఓటీటీ ప్లాట్ఫామ్లలో విడుదలవుతున్నాయి. అయితే ముందు నుంచి కూడా ఈ ఓటీటీలపై చాలా మంది నటినటులు నిర్మాతలు, దర్శకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఈ OTT ల కారణంగానే జనాలు ధియెటర్కి రావడం మానేశారు. అయితే ఈ విషయం పై చాలా సార్లు రియాక్ట్ అయిన బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు.
Also Read : Allari Naresh : సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో అల్లరి నరేష్..
‘సితారే జమీన్ పర్’ మూవీ ఈ జూన్ 20న విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అమిర్, జెనీలియా కీలక పాత్ర పోషించారు. ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రానికి దివ్య నిధి శర్మ కథ అందించారు. అయితే అమిర్ ఖాన్ ఈ మూవీని థియేటర్లలో విడుదలైన తర్వాత, నేరుగా యూట్యూబ్లో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. థియేటర్లలోకి విడుదలైన ఎనిమిది వారాల తర్వాత దీన్ని నేరుగా యూట్యూబ్లోకి విడుదల చేయనున్నారట. అది కూడా పే-పర్-వ్యూ మోడల్లో ఇది ప్రేక్షకులకు యూట్యూబ్లో అందుబాటులో ఉంటుందని వార్తలు వస్తున్నాయి. అంటే ఈ సినిమా చూడాలనుకునే ప్రేక్షకులు యూట్యూబ్లో కొంత రుసుము చెల్లించి వీక్షించాల్సి ఉంటుంది. మరి ఇది ఎంతవరకు వర్కౌంట్ అవుతుందో చూడాలి.