Hamas: హమాస్ చెరలో నేపాలీ హిందూ విద్యార్థి మృతి..
- హమాస్ చెరలో ఉన్న నేపాల్ స్టూడెంట్ మృతి..
- కిడ్నాప్కు ఒక నెల ముందే ఇజ్రాయిల్ వెళ్లాడు..
- అక్టోబర్ 07 నాటి దాడిలో హమాస్ కిడ్నాప్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hamas: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయిల్-హమాస మధ్య శాంతి ఒప్పందాన్ని కుదిర్చారు. 2 ఏళ్లుగా కొనసాగుతున్న యుద్ధాన్ని నిలిపేశారు. 20 మంది బతికి ఉన్న బందీలను హమాస్ విడుదల చేస్తోంది. బందీల విడుదలతో ఇజ్రాయిల్ మొత్తం ఆనందంతో సంబరాలు చేసుకుంది. ఇదిలా ఉంటే, ఈ ఆనందం మాటున ఒక విషాదం కూడా దాగుంది. రెండేళ్ల క్రితం అక్టోబర్ 07,2023లో హమాస్ జరిపిన దాడిలో, కిడ్నాప్కు గురైన నేపాల్ హిందూ విద్యార్థి బిపిన్ జోషి మరణించారు. అతడి మృతదేహాన్ని ఇజ్రాయిల్కు తిరిగి ఇచ్చారు.
ఇజ్రాయిల్ లోని నేపాల్ రాయబారి ధన్ ప్రసాద్ పండిత్, బిపిన్ జోషి మరణాన్ని ధ్రువీకరించారు. ఆయన మృతదేహాన్ని టెల్ అవీవ్కు తీసుకువస్తున్నట్లు చెప్పారు. జోషితో సహా మరణించిన నలుగురు బందీల మృతదేహాలను హమాస్ ఇజ్రాయిల్కు ఇచ్చినట్లు ఇజ్రాయిల్ సైనిక ప్రతినిధి ఎఫీ డెఫ్రిన్ చెప్పారు. నేపాల్కు జోషి మృతదేహం తిరిగి పంపించే ముందు, డీఎన్ఏ టెస్ట్ నిర్వహించనున్నారు. నేపాల్ రాయబార కార్యాలయం సమన్వయంతో ఇజ్రాయిలోలో అంత్యక్రియలు నిర్వహించబడుతాయి.
Also Read
- Abhijeet Dipke: అమెరికా నుంచి ఢిల్లీ చేరుకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు.. నేటి నుంచి నిరసనలు
- Nashik TCS Case: నాసిక్ టీసీఎస్ కేసులో షాకింగ్ ట్విస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు..
- Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
Read Also: Maithili Thakur: బీజేపీలోకి మైథిలి ఠాకూర్, బీహార్ ఎన్నికల్లో పోటీ.. ఈమెకు ఇంత క్రేజ్ ఎలా.?
నేపాల్ లోని చిన్న పట్టణం నుంచి జోషి సెప్టెంబర్ 2023లో ఇజ్రాయిల్ వెళ్లారు. అంటే కిడ్నాప్కు ఒక నెల ముందే ఆయన ఇజ్రాయిల్ వెళ్లారు. గాజా సరిహద్దుకు సమీపంలోని కబ్బట్జ్ అటుమిమ్లో వ్యవసాయం అధ్యయనం, వర్క్ ప్రోగ్రామ్ కోసం 16 మంది తోటి విద్యార్థులతో చేరారు. ఇజ్రాయిల్ వ్యవసాయ పద్ధతులను అధ్యయనం చేయడాని, శిక్షణ తీసుకోవడానికి అక్కడి వెళ్లాడు.
అక్టోబర్ 7, 2023 లో దక్షిణ ఇజ్రాయిల్పై హమాస్ దాడి చేసింది. దాడి తర్వాత సైరన్లు మోగగా విద్యార్థులు బాంబు షెల్టర్లోకి వెళ్లారు. క్షణాల్లో కాల్పులు, పేలుళ్లు చెలరేగాయి. హమాస్ ఉగ్రవాదులు షెల్టర్లోకి గ్రెనేడ్లనె విసిరారు. ఒకటి పేలడంతో అనేక మంది విద్యార్థులు గాయపడ్డారు. అయితే రెండో గ్రెనేడ్ను జోషి పట్టుకుని, అది పేలి పోమే ముందు బయటకు విసిరారు. దీని తర్వాత, అతడిని హమాస్ ఉగ్రవాదులు బంధించి, గాజాలోకి తీసుకెళ్లారు. చివరి సారిగా, ఇజ్రాయిల్ సైన్యం విడుదల చేసిన వీడియోలో జోషిని గాజాలోని షిఫా ఆస్పత్రిలోకి లాగుతున్నట్లు కనిపించింది. ఆ సమయంలో అతను సజీవంగా ఉన్నాడు. జోషి సజీవంగా తిరిగి వస్తాడని కుటుంబం భావించింది. చివరకు విషాదం నెలకొంది.
తాజావార్తలు
-
Parvathipuram Manyam: పామాయిల్, జీడి తోటల్లో ఏనుగుల బీభత్సం.. భయంతో వణికిపోతున్న రైతులు.!
-
The Odyssey Ticket Price : రికార్డులు బద్దలు కొడుతున్న విజువల్ వండర్.. టికెట్ రేటు ఒక్కోటి ఒకటిన్నర లక్ష.!
-
Prakash Raj: నాగబాబుకు ప్రకాష్ రాజ్ స్ట్రాంగ్ కౌంటర్.. “మేము గొర్రెలం కాదు..!”
-
Devara 2 Update : ‘వర’కు ఏమైంది ?… జాన్వీ ప్రశ్నపై తారక్ సీరియస్
-
AFG vs IND: మనవ్ సుతార్ అరంగేట్రం.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గిల్ సేన.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!