Maithili Thakur: బీజేపీలోకి మైథిలి ఠాకూర్, బీహార్ ఎన్నికల్లో పోటీ.. ఈమెకు ఇంత క్రేజ్ ఎలా.?
- బీజేపీలో చేరిన ప్రముఖ సింగర్ మైథిలి ఠాకూర్..
- వచ్చే బీహార్ ఎన్నికల్లో పోటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maithili Thakur: ప్రముఖ జానపద గాయని మైథిలి ఠాకూర్ బీజేపీలో చేరారు. బీహార్లో వ్యాప్తంగా మైథిలి జానపద సింగర్గా ఈమెకు పేరుంది. బీహార్ ఎన్నికల ముందు ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆమె వచ్చే ఎన్నికల్లో అలీనగర్ నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తన ప్రాంత ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లో చేరాలనుకుంటున్నట్లు ఆమె గతంలో చెప్పింది.
Read Also: Employees: ఉద్యోగులకు దీపావళి బహుమతి.. బోనస్ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం..
Also Read
- PM Modi: యూఏఈపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం.. భారత్-యూఏఈ మధ్య కీలక ఒప్పందాలు
- Dharmendra Pradhan: నీట్ ప్రశ్నాపత్రం లీక్పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన ప్రకటన!
- Fuel Price Hike: పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు.. పాల నుంచి పప్పుల దాకా.. నెక్ట్స్ పెరిగేవి ఇవే..
- NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
ఈ నెల ప్రారంభంలో మైథిలి ఠాకూర్, ఆమె తండ్రి న్యూఢిల్లీలో బీహార్ బీజేపీ ఇన్చార్జ్ వినోద్ తావ్డే, కేంద్రం హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్లను కలిశారు. సోషల్ మీడియా ఎక్స్లో తావ్డే ఆమెను ‘‘బీహార్ పుత్రిక’’ అంటై సంబోధించారు. 243 మంది సభ్యులు ఉన్న బీహార్ అసెంబ్లీకి నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. కౌంటింగ్ నవంబర్ 14న జరుగుతుంది.
ప్రస్తుతం అలీనగర్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న మిశ్రీలాల్ యాదవ్ సీటు కోల్పోవడం దాదాపుగా ఖాయమైంది. ఈ సీటు నుంచి యువకురాలు, ప్రజాదరణ పొందిన వ్యక్తిని నిలబెట్టాలని బీజేపీ భావిస్తోంది. మైథిలి ఠాకూర్కు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. బీజేపీ ఈమెను తన ప్రచారానికి వాడుకోవచ్చు. మైథిలి ఠాకూర్ గెలిస్తే, బీహార్ జానపద సంస్కృతితో సంబంధం ఉన్న ప్రఖ్యాత గాయని నేరుగా రాజకీయ రంగంలోకి ప్రవేశించడం ఇదే మొదటిసారి అవుతుంది.
మైథిలి ఠాకూర్ ఎవరు?
మైథిలి బీహార్కు చెందిన ప్రసిద్ధ గాయని. దర్భంగాకు చెందిన ఈమె మైథిలి జానపద సంగీతంతో ఫేమస్ అయింది . విదేశాలలో మైథిలి కచేరీలను కూడా నిర్వహిస్తుంది. 25 ఏళ్ల గాయని తన మిథిలా సంస్కృతిని ప్రజలకు తెలియజేస్తోంది. మైథిలి తండ్రి రమేష్ ఠాకూర్, తల్లి భారతి ఠాకూర్లు కూడా మైథిలి సంగీతకారులు.
ఇద్దరూ మ్యూజిక్ టీచర్లుగా పనిచేస్తున్నారు. మైథిలికి ఇద్దరు సోదరులు ఉన్నారు, వీరు కూడా సంగీత వృత్తిని కొనసాగిస్తున్నారు. ముగ్గురు కూడా హిందూస్థానీ శాస్త్రీయ సంగీతంలో, హార్మోనియం, తబలాలో శిక్షణ పొందారు. 1995లో లాలు ప్రసాద్ యాదవ్ అధికారంలోకి వచ్చినప్పుడు బీహార్ను విడిచిపెట్టిన మైథిలి కుటుంబాన్ని తిరిగి బీహార్ రావాలని ఇటీవల బీజేపీ నేతలు ఆహ్వానించారు.
తాజావార్తలు
-
Peddi: కథే ‘పెద్ది’కి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అంటున్న బుచ్చిబాబు..
-
PM Modi: యూఏఈపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం.. భారత్-యూఏఈ మధ్య కీలక ఒప్పందాలు
-
Dharmendra Pradhan: నీట్ ప్రశ్నాపత్రం లీక్పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన ప్రకటన!
-
Ambati Rayudu: IPL 2026లో తోపు కెప్టెన్ అతనే..
-
Bermuda Triangle Mystery: బెర్ముడా రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలు.. అక్కడ ఏముందంటే..
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!