Maithili Thakur: బీజేపీలోకి మైథిలి ఠాకూర్, బీహార్ ఎన్నికల్లో పోటీ.. ఈమెకు ఇంత క్రేజ్ ఎలా.?
- బీజేపీలో చేరిన ప్రముఖ సింగర్ మైథిలి ఠాకూర్..
- వచ్చే బీహార్ ఎన్నికల్లో పోటీ..
Maithili Thakur: ప్రముఖ జానపద గాయని మైథిలి ఠాకూర్ బీజేపీలో చేరారు. బీహార్లో వ్యాప్తంగా మైథిలి జానపద సింగర్గా ఈమెకు పేరుంది. బీహార్ ఎన్నికల ముందు ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆమె వచ్చే ఎన్నికల్లో అలీనగర్ నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తన ప్రాంత ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లో చేరాలనుకుంటున్నట్లు ఆమె గతంలో చెప్పింది.
Read Also: Employees: ఉద్యోగులకు దీపావళి బహుమతి.. బోనస్ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం..
Also Read
- Barrier Free Tolling: భారత్లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
- Mamata Banerjee: తలకిందులుగా వేలాడదీయడం ఏంటి.? అమిత్ షాపై దీదీ ఆగ్రహం..
- AAP Crisis: ‘‘పంజాబ్ ద్రోహి’’ అంటూ హర్భజన్ సింగ్ ఇంటిపై ఆప్ దాడి...
- LPG Crisis: గ్యాస్ టెన్షన్కు గుడ్బై.. 15 దేశాల నుంచి ఎల్పీజీ దిగుమతి!
ఈ నెల ప్రారంభంలో మైథిలి ఠాకూర్, ఆమె తండ్రి న్యూఢిల్లీలో బీహార్ బీజేపీ ఇన్చార్జ్ వినోద్ తావ్డే, కేంద్రం హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్లను కలిశారు. సోషల్ మీడియా ఎక్స్లో తావ్డే ఆమెను ‘‘బీహార్ పుత్రిక’’ అంటై సంబోధించారు. 243 మంది సభ్యులు ఉన్న బీహార్ అసెంబ్లీకి నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. కౌంటింగ్ నవంబర్ 14న జరుగుతుంది.
ప్రస్తుతం అలీనగర్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న మిశ్రీలాల్ యాదవ్ సీటు కోల్పోవడం దాదాపుగా ఖాయమైంది. ఈ సీటు నుంచి యువకురాలు, ప్రజాదరణ పొందిన వ్యక్తిని నిలబెట్టాలని బీజేపీ భావిస్తోంది. మైథిలి ఠాకూర్కు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. బీజేపీ ఈమెను తన ప్రచారానికి వాడుకోవచ్చు. మైథిలి ఠాకూర్ గెలిస్తే, బీహార్ జానపద సంస్కృతితో సంబంధం ఉన్న ప్రఖ్యాత గాయని నేరుగా రాజకీయ రంగంలోకి ప్రవేశించడం ఇదే మొదటిసారి అవుతుంది.
మైథిలి ఠాకూర్ ఎవరు?
మైథిలి బీహార్కు చెందిన ప్రసిద్ధ గాయని. దర్భంగాకు చెందిన ఈమె మైథిలి జానపద సంగీతంతో ఫేమస్ అయింది . విదేశాలలో మైథిలి కచేరీలను కూడా నిర్వహిస్తుంది. 25 ఏళ్ల గాయని తన మిథిలా సంస్కృతిని ప్రజలకు తెలియజేస్తోంది. మైథిలి తండ్రి రమేష్ ఠాకూర్, తల్లి భారతి ఠాకూర్లు కూడా మైథిలి సంగీతకారులు.
ఇద్దరూ మ్యూజిక్ టీచర్లుగా పనిచేస్తున్నారు. మైథిలికి ఇద్దరు సోదరులు ఉన్నారు, వీరు కూడా సంగీత వృత్తిని కొనసాగిస్తున్నారు. ముగ్గురు కూడా హిందూస్థానీ శాస్త్రీయ సంగీతంలో, హార్మోనియం, తబలాలో శిక్షణ పొందారు. 1995లో లాలు ప్రసాద్ యాదవ్ అధికారంలోకి వచ్చినప్పుడు బీహార్ను విడిచిపెట్టిన మైథిలి కుటుంబాన్ని తిరిగి బీహార్ రావాలని ఇటీవల బీజేపీ నేతలు ఆహ్వానించారు.
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!