Maithili Thakur: బీజేపీలోకి మైథిలి ఠాకూర్, బీహార్ ఎన్నికల్లో పోటీ.. ఈమెకు ఇంత క్రేజ్ ఎలా.?
- బీజేపీలో చేరిన ప్రముఖ సింగర్ మైథిలి ఠాకూర్..
- వచ్చే బీహార్ ఎన్నికల్లో పోటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maithili Thakur: ప్రముఖ జానపద గాయని మైథిలి ఠాకూర్ బీజేపీలో చేరారు. బీహార్లో వ్యాప్తంగా మైథిలి జానపద సింగర్గా ఈమెకు పేరుంది. బీహార్ ఎన్నికల ముందు ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆమె వచ్చే ఎన్నికల్లో అలీనగర్ నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తన ప్రాంత ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లో చేరాలనుకుంటున్నట్లు ఆమె గతంలో చెప్పింది.
Read Also: Employees: ఉద్యోగులకు దీపావళి బహుమతి.. బోనస్ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం..
Also Read
- BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
ఈ నెల ప్రారంభంలో మైథిలి ఠాకూర్, ఆమె తండ్రి న్యూఢిల్లీలో బీహార్ బీజేపీ ఇన్చార్జ్ వినోద్ తావ్డే, కేంద్రం హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్లను కలిశారు. సోషల్ మీడియా ఎక్స్లో తావ్డే ఆమెను ‘‘బీహార్ పుత్రిక’’ అంటై సంబోధించారు. 243 మంది సభ్యులు ఉన్న బీహార్ అసెంబ్లీకి నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. కౌంటింగ్ నవంబర్ 14న జరుగుతుంది.
ప్రస్తుతం అలీనగర్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న మిశ్రీలాల్ యాదవ్ సీటు కోల్పోవడం దాదాపుగా ఖాయమైంది. ఈ సీటు నుంచి యువకురాలు, ప్రజాదరణ పొందిన వ్యక్తిని నిలబెట్టాలని బీజేపీ భావిస్తోంది. మైథిలి ఠాకూర్కు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. బీజేపీ ఈమెను తన ప్రచారానికి వాడుకోవచ్చు. మైథిలి ఠాకూర్ గెలిస్తే, బీహార్ జానపద సంస్కృతితో సంబంధం ఉన్న ప్రఖ్యాత గాయని నేరుగా రాజకీయ రంగంలోకి ప్రవేశించడం ఇదే మొదటిసారి అవుతుంది.
మైథిలి ఠాకూర్ ఎవరు?
మైథిలి బీహార్కు చెందిన ప్రసిద్ధ గాయని. దర్భంగాకు చెందిన ఈమె మైథిలి జానపద సంగీతంతో ఫేమస్ అయింది . విదేశాలలో మైథిలి కచేరీలను కూడా నిర్వహిస్తుంది. 25 ఏళ్ల గాయని తన మిథిలా సంస్కృతిని ప్రజలకు తెలియజేస్తోంది. మైథిలి తండ్రి రమేష్ ఠాకూర్, తల్లి భారతి ఠాకూర్లు కూడా మైథిలి సంగీతకారులు.
ఇద్దరూ మ్యూజిక్ టీచర్లుగా పనిచేస్తున్నారు. మైథిలికి ఇద్దరు సోదరులు ఉన్నారు, వీరు కూడా సంగీత వృత్తిని కొనసాగిస్తున్నారు. ముగ్గురు కూడా హిందూస్థానీ శాస్త్రీయ సంగీతంలో, హార్మోనియం, తబలాలో శిక్షణ పొందారు. 1995లో లాలు ప్రసాద్ యాదవ్ అధికారంలోకి వచ్చినప్పుడు బీహార్ను విడిచిపెట్టిన మైథిలి కుటుంబాన్ని తిరిగి బీహార్ రావాలని ఇటీవల బీజేపీ నేతలు ఆహ్వానించారు.
తాజావార్తలు
-
The Paradise Rights : ప్యారడైజ్ రైట్స్ కోసం రూ. 110 కోట్లు అఫర్ చేసిన దిల్ రాజు.. పుకార్లు నమ్మొద్దన్న నిర్మాత
-
Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
-
Dhanush – Anirudh : ధనుష్ – అనిరుధ్ మధ్య ఫ్రెండ్షిప్ చెడిందా..?
-
Kia Syros EV: 526KM రేంజ్, లెవెల్-2 ADAS భద్రతా ఫీచర్లతో.. కియా సైరోస్ EV భారత్ లో విడుదల
-
IND vs ENG 2nd ODI: వన్డే సిరీస్పై కన్నేసిన టీమిండియా.. నేడు రెండో వన్డే.! పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ XI, మ్యాచ్ వివరాలు ఇవే..!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!