కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీపై నాన్బెయిలబుల్ వారెంట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎవరూ చట్టానికి చుట్టాలు కాదు.. వారు ప్రజాప్రతినిధులైనా సరే.. గతంలో నమోదైన ఓ కేసు విషయంలో కోర్టుకు హాజరు కాకపోవడంతో.. తాజాగా కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ ఎంపీ రామ్ శంకర్ కథేరియాపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిది కోర్టు.. 11 సంవత్సరాల క్రితం జరిగిన రైలు దిగ్బంధనం కేసులో ఇప్పటి వరకూ కోర్టుకు హాజరు కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు.. ఈ వారంట్ జారీ చేసింది. ఇక, ఎంపీ కథేరియాతో పాటు, మాజీ ఎమ్మెల్యే బాబూలాల్ చౌదరి, కాంగ్రెస్ నాయకుడు ఇందిర వర్మతో పాటు మరికొందరు కూడా ఈ కేసులో నిందితులుగా ఉన్నారు.. ఆగ్రాలో అలహాబాద్ హైకోర్టు బెంచ్ డిమాండ్ కోసం ఆందోళన చేస్తున్న న్యాయవాదులకు మద్ధతుగా 2009 సెప్టెంబరు 26వతేదీన ఎంపీ రామ్ శంకర్ రైల్ రోకోకు దిగారు.. రైలును నిలిపివేసి ఆందోళనకు దిగారు.. ఈ ఘటనలో ఎంపీ రామ్ శంకర్తో పాటు మరికొందరిపై కేసు నమోదు కాగా.. కోర్టుకు హాజరు కాకపోవడంతో.. రామ్ శంకర్ పై నాన్ బెయిలబుల్ వారంట్ ఇచ్చింది కోర్టు.
Also Read
తాజావార్తలు
-
Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
-
Bajirao Peshwa : గెరిల్లా వార్లో దిట్ట.. బాజీరావు స్టైల్ ఇదే.!
-
Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
-
Uttam Kumar Reddy: రాష్ట్ర వ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాలు.. ధాన్యం కొనుగోళ్లపై మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
Work From Home ఇచ్చేందుకు కంపెనీలు సుముకంగాలేవా..?
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!