ఎవరూ చట్టానికి చుట్టాలు కాదు.. వారు ప్రజాప్రతినిధులైనా సరే.. గతంలో నమోదైన ఓ కేసు విషయంలో కోర్టుకు హాజరు కాకపోవడంతో.. తాజాగా కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ ఎంపీ రామ్ శంకర్ కథేరియాపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిది కోర్టు.. 11 సంవత్సరాల క్రితం జరిగిన రైలు దిగ్బంధనం కేసులో ఇప్పటి వరకూ కోర్టుకు హాజరు కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు.. ఈ వారంట్ జారీ చేసింది. ఇక, ఎంపీ కథేరియాతో పాటు, మాజీ ఎమ్మెల్యే బాబూలాల్ చౌదరి, కాంగ్రెస్ నాయకుడు ఇందిర వర్మతో పాటు మరికొందరు కూడా ఈ కేసులో నిందితులుగా ఉన్నారు.. ఆగ్రాలో అలహాబాద్ హైకోర్టు బెంచ్ డిమాండ్ కోసం ఆందోళన చేస్తున్న న్యాయవాదులకు మద్ధతుగా 2009 సెప్టెంబరు 26వతేదీన ఎంపీ రామ్ శంకర్ రైల్ రోకోకు దిగారు.. రైలును నిలిపివేసి ఆందోళనకు దిగారు.. ఈ ఘటనలో ఎంపీ రామ్ శంకర్తో పాటు మరికొందరిపై కేసు నమోదు కాగా.. కోర్టుకు హాజరు కాకపోవడంతో.. రామ్ శంకర్ పై నాన్ బెయిలబుల్ వారంట్ ఇచ్చింది కోర్టు.