Chhattisgarh: మావోయిస్టుల ఘాతుకం.. మందుపాతర పేలి 09 మంది జవాన్లు మృతి..
- ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఘాతుకం..
- సుక్మా జిల్లాలో మందుపాతర పేలుడు..
- 10 మంది జవాన్ల మృతి, ఐదుగురికి తీవ్రగాయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chhattisgarh: ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు ఘాతుకానికి తెగబడ్డారు. బీజాపూర్ జిల్లాలో జవాన్లను టార్గెట్ చేస్తూ మందుపాతర పేల్చారు. వాహనంలో జవాన్లు వెళ్తున్న క్రమంలో మందుపాతర పేల్చారు. జిల్లాలోని కుట్రు-బెద్రే రహదారిపై ఈ ఘటన జరిగింది. వాహనం డ్రైవర్తో సహా 9 మంది జవాన్లు, మొత్తంగా 10 మరణించారు. మరో ఐదుగురి జవాన్లకు తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. పేలుడు సమయంలో వాహనంలో 15 మంది జవాన్లు ఉన్నారు. కూంబింగ్కి వెళ్లి వస్తున్న క్రమంలో ఈ పేలుడు చోటు చేసుకుంది. పేలుడు విషయాన్ని బస్తర్ ఐజీ ధ్రువీకరించారు.
Read Also: Dil Raju: ఇండస్ట్రీలో సక్సెస్ ఉంటేనే వేల్యూ.. తెలియని భయం స్టార్ట్ అయ్యింది!
Also Read
అబూజ్ మడ్ ఏరియాలో మావోయిస్టుల ఏరి వేత కోసం నాలుగు జిల్లాల నుంచి గత నాలుగు రోజులుగా కూంబింగ్ కొనసాగుతుంది. కూంబింగ్ ముగించుకుని తిరిగి వస్తున్న క్రమంలో మావోయిస్టులు పక్కా ప్లాన్తో ఎటాక్ చేశారు. బీజాపూర్ జిల్లాలో కుట్రూ పోలీస్ స్టేషన్ పరిధిలో అంబేలి గ్రామ సమీపంలో ఘటన జరిగింది. మృతి చెందిన వారు దంతేవాడ జిల్లాకు చెందిన డీఆర్జీ జవాన్లు ఉన్నారు.
గత మూడు రోజులు బట్టి బీజాపూర్ సుక్మా దంతివాడ కాంకేర్ జిల్లాలకు సంబంధించిన భద్రతా బలగాలు అబూజ్ మడ్ ఏరియాలో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. రెండు రోజుల క్రితం జరిగిన అబూజ్ మడ్ ఏరియాలో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు మృతి చెందారు. కాగా, ఇటీవల కాలంలో సైనికులు ఇంత పెద్ద సంఖ్యలో మృతి చెందటం ఇదే కావటంతో చత్తీస్గడ్ పోలీస్ యంత్రాంగం అప్రమత్తం అయింది. గత ఏడాది పోలీసుల చేతుల్లో సుమారు 260 మంది మావోయిస్టులు వరకు కూడా చనిపోయారు. ఇటీవల కాలంలో భద్రతా బలగాలపై ఇంత పెద్ద దారుణమైన ఘటన చోటు చేసుకోలేదు.
తాజావార్తలు
-
Oil Free Poori: ఒక్క చుక్క నూనె లేకుండా పొంగే పూరీలు.. ఎలాగో చూస్తే షాకవుతారు!
-
Telangana: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి భారీగా పెంపు..
-
Petrol Price Hike: హైదరాబాద్లో మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఐదు రోజుల్లో రెండోసారి షాక్!
-
Karuppu: ఆర్జే బాలాజీ ప్లానింగ్కు ఫిదా అవుతున్న సూర్య అభిమానులు
-
Gautam Adani: అమెరికాలో అదానీ గెలిచాడు.. ఒక్క దెబ్బతో లీగల్ కేసులన్నీ క్లోజ్.. రూ.84 వేల కోట్ల ప్లాన్తో సరికొత్త చరిత్ర!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!