National Herald Case: సోనియా గాంధీ మూడో రోజు విచారణ.. ఢిల్లీలో భారీ బందోబస్త్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
National Herald Case: నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని మూడో రోజు విచారించనుంది ఈడీ. ఇప్పటి వరకు రెండు రోజుల పాటు సోనియా గాంధీ విచారణ సాగింది. సుమారు 9 గంటల పాటు సోనియాగాంధీని ఈడీ అధికారులు విచారించారు. బుధవారం ఉదయం 11 గంటలకు మరోసారి ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నారు సోనియా. సోనియా గాంధీ విచారణ సందర్భంగా నిన్నంతా ప్రియాంకాగాంధీ తోడుగా ఉన్నారు. ఈ రోజు కూడా ప్రియాంకా గాంధీ, సోనియా గాంధీకి తోడుగా ఉండనున్నారు. గత గురువారం సోనియా గాంధీని 3 గంటల పాటు విచారించారు. నిన్న మంగళవారం కూడా సోనియా గాంధీ విచారణ సాగింది. యంగ్ ఇండియా సంస్థ, నేషనల్ హెరాల్డ్ కు సంబంధించిన లావాదేవీల్లో అవకతవకలపై సోనియాగాంధీని ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఇటీవల విచారణ సందర్భంగా రాహుల్ గాంధీ ఇచ్చిన సమాధానాలను, సోనియా సమాధానాలతో పోల్చి చూస్తున్నారు. యంగ్ ఇండియా ప్రైవేటు సంస్థలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకే మెజారిటీ షేర్లు ఉన్నాయి.
Read Also: Tiger Deaths: మూడేళ్లలో భారీగా పులుల మరణాలు..పులుల దాడిలో ఎంత మంది మరణించారంటే..
Also Read
- Praggnanandhaa: సీఎం విజయ్కు చెక్మేట్.. సత్కారంతో పాటు రూ.50 లక్షల నగదు బహుమతి.!
- Mamata Banerjee: మమతా బెనర్జీకి మరో షాక్.. సుఖేందు శేఖర్ రాయ్ టీఎంసీని వీడి రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా
- Relationship Controversy: అందానికి ముగ్ధుడై పిల్లనిచ్చిన అత్తతో ప్రేమలో పడ్డ అల్లుడు.. లేచిపోయి వివాహం
- INDIA Alliance Meeting: విజయ్ పార్టీకి ఊహించని పరిణామం.. టీవీకేను పక్కన పెట్టిన ఇండియా కూటమి?
మరోవైపు ఈడీ విచారణకు, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు, ఆందోళను చేస్తున్నారు. నిన్న రాహుల్ గాంధీతో పాటు 57 మంది ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిరసన తెలుపుతున్న సమయంలో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్ తో సహా, ఇతర నేతలను అదుపులోకి తీసుకున్న క్రమంలో పోలీసుల దురుసు ప్రవర్తన ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. దీంతో ఈ ఘటనలపై చర్యలు తీసుకుంటానని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. బీజేపీ ప్రభుత్వం కావాలనే కేంద్ర సంస్థలను ఉపయోగించి ప్రతిపక్షాలపై కక్ష సారిస్తోందని విమర్శించారు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే.
ఈ రోజు కూడా కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసనలకు పిలుపునిచ్చారు. దీంతో ఢిల్లీలో హై అలర్ట్ నెలకొంది. ఏఐసీసీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్బర్ రోడ్డులో బారికేడ్ల ఏర్పాటు చేసి, ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఏఐసీసీ వద్ద 144 సెక్షన్ విధించారు. దీంతో కాంగ్రెస్ నేతలు కూడా పార్లమెంట్ లోపల, బయట అనుసరించాల్సిన వ్యూహాల గురించి చర్చిస్తున్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
-
Praggnanandhaa: సీఎం విజయ్కు చెక్మేట్.. సత్కారంతో పాటు రూ.50 లక్షల నగదు బహుమతి.!
-
Jasprit Bumrah: ఐపీఎల్ పూర్తి సీజన్ ఆడుతాడు, భారత్ మ్యాచ్లు మాత్రం ఆడడా.. బుమ్రాపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
ATM Withdrawals: ఏటీఎం నుంచి డబ్బు తీసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది!
-
Vivo X Fold 6: ఏఐ ఫీచర్లు, న్యూ యూజర్ ఇంటర్ఫేస్తో.. వివో ఎక్స్ ఫోల్డ్ 6 త్వరలో విడుదల
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!