Tiger Deaths: మూడేళ్లలో భారీగా పులుల మరణాలు..పులుల దాడిలో ఎంత మంది మరణించారంటే..
Tiger Deaths In India:ఇండియాలో పులులను సంరక్షించేందుకు ప్రభుత్వాలు అనేక రక్షణ చర్యలు తీసుకుంటున్నాయి. అయితే ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. పులుల మరణాలకు అడ్డుకట్ట పడటం లేదు. తాజాగా కేంద్రం పర్యావరణ శాఖ సహాయమంత్రి అశ్విని కుమార్ చౌబే సోమవారం లోక్ సభకు సమర్పించిన గణాంకాల ప్రకారం గడిచిన మూడేళ్లలో దేశంలో 329 పులులు మరణాలు సంభవించాయని వెల్లడించారు. గణాంకాల ప్రకారం 2019లో 96, 2020లో 106, 2021లో 127 పులులు మరణించినట్లుగా మంత్రి పార్లమెంట్ కు తెలిపారు. ఇందులో 68 పులులు సహజ కారణాల వల్ల మరణిస్తే.. వేట కారణంగా 29 పులులు మరణించినట్లు వెల్లడించారు. 197 పులుల మరణాలపై విచారణ జరుగుతున్నట్లు వెల్లడించారు.
Read Also: 5G Auction: ‘5జీ’ వేలానికి సూపర్ రెస్పాన్స్.. తొలిరోజే ఇలా..
Also Read
ఇదిలా ఉంటే పులుల దాడుల వల్ల దేశంలో గడిచిన మూడేళ్లలో 125 మంది మృత్యువాత పడ్డారు. ఎక్కువగా మహారాష్ట్రలో 61 మంది, ఉత్తర్ ప్రదేశ్ లో 25 మంది పులుల దాడుల వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఇక ఏనుగుల విషయానికి వస్తే మూడేళ్లలో కరెంట్ షాకులతో 222 ఏనుగులు మరణించాయని.. ఒడిశాలో 41 ఏనుగులు, తమిళనాడులో 34 ఏనుగులు, అస్సాంలో 33 ఏనుగుల మరణాలు సంభవించాయని ప్రభుత్వం వెల్లడించింది. రైలు ప్రమాదాల వల్ల 45 ఏనుగులు మరణించినట్లు వెల్లడించారు. వీటిలో ఒడిశాలో 12, పశ్చిమ బెంగాల్ లో 11 ఏనుగులు మరణించాయని ప్రభుత్వం తెలిపింది. వేట కారణంగా మేఘాలయలో 12, ఒడిశాలో 7, అస్సాంలో 9 ఏనుగులు మరణించినట్లు గణాంకాలు తెలిపాయి. విషప్రయోగం వల్ల 11 ఏనుగులు మరణించినట్లు ప్రభుత్వం పార్లమెంట్ కు వెల్లడించింది.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో