Tiger Deaths: మూడేళ్లలో భారీగా పులుల మరణాలు..పులుల దాడిలో ఎంత మంది మరణించారంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tiger Deaths In India:ఇండియాలో పులులను సంరక్షించేందుకు ప్రభుత్వాలు అనేక రక్షణ చర్యలు తీసుకుంటున్నాయి. అయితే ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. పులుల మరణాలకు అడ్డుకట్ట పడటం లేదు. తాజాగా కేంద్రం పర్యావరణ శాఖ సహాయమంత్రి అశ్విని కుమార్ చౌబే సోమవారం లోక్ సభకు సమర్పించిన గణాంకాల ప్రకారం గడిచిన మూడేళ్లలో దేశంలో 329 పులులు మరణాలు సంభవించాయని వెల్లడించారు. గణాంకాల ప్రకారం 2019లో 96, 2020లో 106, 2021లో 127 పులులు మరణించినట్లుగా మంత్రి పార్లమెంట్ కు తెలిపారు. ఇందులో 68 పులులు సహజ కారణాల వల్ల మరణిస్తే.. వేట కారణంగా 29 పులులు మరణించినట్లు వెల్లడించారు. 197 పులుల మరణాలపై విచారణ జరుగుతున్నట్లు వెల్లడించారు.
Read Also: 5G Auction: ‘5జీ’ వేలానికి సూపర్ రెస్పాన్స్.. తొలిరోజే ఇలా..
Also Read
- Annamalai: అన్నామలైకి మోదీ-షా ఆశీస్సులు లేవు.. తమిళనాడు బీజేపీ క్లారిటీ
- Cockroach Janta Party: 2 కోట్ల ఫాలోవర్లు, 2 వేల మంది కూడా రాలే.."కాక్రోచ్ జనతా పార్టీ" ఫ్లాప్ షో..
- Prashant Kishor: రూ.10 వేలతో ఓట్లు కొని గెలిచారు.. నితీష్కుమార్పై మరోసారి ప్రశాంత్ కిషోర్ విమర్శలు
- Sourav Ganguly: మమతకు మద్దతుగా యూసుఫ్ పఠాన్ను గంగూలీ రాజీనామా చేయమన్నారా..? ఇదిగో క్లారిటీ..
ఇదిలా ఉంటే పులుల దాడుల వల్ల దేశంలో గడిచిన మూడేళ్లలో 125 మంది మృత్యువాత పడ్డారు. ఎక్కువగా మహారాష్ట్రలో 61 మంది, ఉత్తర్ ప్రదేశ్ లో 25 మంది పులుల దాడుల వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఇక ఏనుగుల విషయానికి వస్తే మూడేళ్లలో కరెంట్ షాకులతో 222 ఏనుగులు మరణించాయని.. ఒడిశాలో 41 ఏనుగులు, తమిళనాడులో 34 ఏనుగులు, అస్సాంలో 33 ఏనుగుల మరణాలు సంభవించాయని ప్రభుత్వం వెల్లడించింది. రైలు ప్రమాదాల వల్ల 45 ఏనుగులు మరణించినట్లు వెల్లడించారు. వీటిలో ఒడిశాలో 12, పశ్చిమ బెంగాల్ లో 11 ఏనుగులు మరణించాయని ప్రభుత్వం తెలిపింది. వేట కారణంగా మేఘాలయలో 12, ఒడిశాలో 7, అస్సాంలో 9 ఏనుగులు మరణించినట్లు గణాంకాలు తెలిపాయి. విషప్రయోగం వల్ల 11 ఏనుగులు మరణించినట్లు ప్రభుత్వం పార్లమెంట్ కు వెల్లడించింది.
తాజావార్తలు
-
Surya Kumar Yadav: పరుగులు లేవు కానీ ‘స్టాండప్ కామెడీ’.. మాటలతో కాలం వెళ్లదీసి టీమిండియాకు దూరమైన సూర్య..
-
Trump-Iran: త్వరగా స్పందించండి.. ఇరాన్కు మరోసారి ట్రంప్ వార్నింగ్
-
AP Weather Update : ఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాలు, వడగాల్పుల డబుల్ అలర్ట్.!
-
Annamalai: అన్నామలైకి మోదీ-షా ఆశీస్సులు లేవు.. తమిళనాడు బీజేపీ క్లారిటీ
-
Pawan Kalyan : పవన్ ఫోకస్తో పెదపెంకికి కొత్త జీవం
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!