Tiger Deaths: మూడేళ్లలో భారీగా పులుల మరణాలు..పులుల దాడిలో ఎంత మంది మరణించారంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tiger Deaths In India:ఇండియాలో పులులను సంరక్షించేందుకు ప్రభుత్వాలు అనేక రక్షణ చర్యలు తీసుకుంటున్నాయి. అయితే ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. పులుల మరణాలకు అడ్డుకట్ట పడటం లేదు. తాజాగా కేంద్రం పర్యావరణ శాఖ సహాయమంత్రి అశ్విని కుమార్ చౌబే సోమవారం లోక్ సభకు సమర్పించిన గణాంకాల ప్రకారం గడిచిన మూడేళ్లలో దేశంలో 329 పులులు మరణాలు సంభవించాయని వెల్లడించారు. గణాంకాల ప్రకారం 2019లో 96, 2020లో 106, 2021లో 127 పులులు మరణించినట్లుగా మంత్రి పార్లమెంట్ కు తెలిపారు. ఇందులో 68 పులులు సహజ కారణాల వల్ల మరణిస్తే.. వేట కారణంగా 29 పులులు మరణించినట్లు వెల్లడించారు. 197 పులుల మరణాలపై విచారణ జరుగుతున్నట్లు వెల్లడించారు.
Read Also: 5G Auction: ‘5జీ’ వేలానికి సూపర్ రెస్పాన్స్.. తొలిరోజే ఇలా..
Also Read
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమార్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
ఇదిలా ఉంటే పులుల దాడుల వల్ల దేశంలో గడిచిన మూడేళ్లలో 125 మంది మృత్యువాత పడ్డారు. ఎక్కువగా మహారాష్ట్రలో 61 మంది, ఉత్తర్ ప్రదేశ్ లో 25 మంది పులుల దాడుల వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఇక ఏనుగుల విషయానికి వస్తే మూడేళ్లలో కరెంట్ షాకులతో 222 ఏనుగులు మరణించాయని.. ఒడిశాలో 41 ఏనుగులు, తమిళనాడులో 34 ఏనుగులు, అస్సాంలో 33 ఏనుగుల మరణాలు సంభవించాయని ప్రభుత్వం వెల్లడించింది. రైలు ప్రమాదాల వల్ల 45 ఏనుగులు మరణించినట్లు వెల్లడించారు. వీటిలో ఒడిశాలో 12, పశ్చిమ బెంగాల్ లో 11 ఏనుగులు మరణించాయని ప్రభుత్వం తెలిపింది. వేట కారణంగా మేఘాలయలో 12, ఒడిశాలో 7, అస్సాంలో 9 ఏనుగులు మరణించినట్లు గణాంకాలు తెలిపాయి. విషప్రయోగం వల్ల 11 ఏనుగులు మరణించినట్లు ప్రభుత్వం పార్లమెంట్ కు వెల్లడించింది.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!