Sukhbir Singh Badal: మాజీ డిప్యూటీ సీఎం బాదల్పై హత్యాయత్నం.. నిందితుడికి ఖలిస్తాన్ ఉగ్ర లింకులు..
- మాజీ డిప్యూటీ సీఎం బాదల్పై హత్యాయత్నం..
- తుపాకీతో కాల్చేందుకు యత్నించిన నరేన్ సింగ్ చౌరా..
- నిందితుడికి ఖలిస్తాన్ ఉగ్రసంస్థ బబ్బర్ఖల్సాతో సంబంధం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sukhbir Singh Badal: పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం సుఖ్బీర్ సింగ్ బాదల్పై హత్యాయత్నం సంచలనంగా మారింది. ఈ రోజు ఉదయం అమృత్సర్లోని స్వర్ణదేవాలయం ప్రవేశద్వారం వద్ద సేవ చేస్తున్న బాదల్పై అగంతకుడు దాడికి యత్నించాడు. తుపాకీతో కాల్చే ప్రయత్నం చేశాడు. అయితే, అక్కడే ఉన్న కొంత మంది అతడిని అడ్డుకున్నారు. దీంతో బాదల్ సురక్షితంగా బయటపడ్డారు. వీల్ చైర్లో ఉన్న మిస్టర్ బాదల్ గోల్డెన్ టెంపుల్ గేట్ వద్ద ‘సేవాదర్’ స్థలంలో ఉన్న సమయంలో ఉదయం 9 గంటలకు ఈ సంఘటన జరిగింది.
నిందితుడని నరేన్ సింగ్ చౌరాగా గుర్తించారు. అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు ముందుగా గేటు వద్దకు వచ్చి జేబులోని తుపాకీ తీయడం అక్కడ ఉన్న కెమెరాల్లో రికార్డైంది. నరేన్ సింగ్ చౌరా అమృత్ సర్కి 60 కిమీ దూరంలోని గురుదాస్పూర్ జిల్లా చౌరా అనే గ్రామ నివాసి. ఇతనికి నిషేధిత సిక్కు ఉగ్రవాద సంస్థ ‘‘బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్’’తో సంబంధం ఉన్నట్లు భద్రతా ఏజెన్సీలు తెలిపాయి.
Also Read
- PM Kisan 23th Installment Update: పీఎం కిసాన్ 23వ విడత.. రైతుల ఖాతాల్లో రూ. 2,000 ఎప్పుడు జమ అవుతాయంటే?
- PM Modi: విదేశీ ప్రయాణాలపై పన్ను విధింపులంటూ వార్తలు.. ప్రధాని మోడీ కీలక ప్రకటన
- Dubai: విమానంలో ఫోటోలు తీస్తే 10 ఏళ్ల జైలా? దుబాయ్ కోర్టు సంచలన తీర్పు..
- Quadruplet Delivery: అరుదైన ఘటన.. 5 రోజుల వ్యవధిలో నలుగురు శిశువులకు జన్మనిచ్చిన మహిళ
Read Also: AlluArjun : ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య 70MMకు అల్లు అర్జున్
68 ఏళ్ల చౌరా చండీగఢ్లోని బురైల్ బైల్ నుంచి తప్పించుకున్న ఘటనలో ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు. 2004లో జైలు నుంచి సొరంగం తవ్వి నలుగురు ఖైదీలు తప్పించుకుపోయారు. ఈ నలుగురు ఖైదీల్లో బబ్బర్ ఖల్సా చీఫ్ జగ్తార్ సింగ్ హవారా, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ హంతకులు పరమ్జిత్ సింగ్ భియోరా , జగ్తార్ సింగ్ తారా, హత్యా దోషి దేవి సింగ్ ఉన్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం కింద చౌరాను 2013లో అరెస్టు చేశారు. ఐదేళ్ల తర్వాత బెయిల్పై విడుదలయ్యాడు.
ఇటీవల సిక్కు మత సంస్థ అకాలీ తఖ్త్ సుఖ్బీర్ సింగ్ బాదల్కి మతపరమైన శిక్ష విధించింది. 2015లో డేరా సచ్చ సౌదా చీఫ్ గుర్మీత్ సింగ్ రామ్ రహీమ్కి క్షమాభిక్ష పెట్టినందుకు సిక్కు సంస్థ విచారణ జరిపింది. దోషిగా తేలినందుకు స్వర్ణదేవాలయంలో టాయ్లెట్స్, వంటగది శుభ్రం చేయాలని శిక్షను విధించింది. ఈ శిక్ష అనుభవిస్తున్న సమయంలోనే ఆయనపై హత్యాయత్నం జరిగింది.
తాజావార్తలు
-
Tollywood: పర్సంటేజ్ సిస్టమ్ నుండి మినహాయింపు కోరిన 17 సినిమాల జాబితా..
-
Tawa Paneer Tikka Recipe: ఇంట్లోనే ఈజీగా రెస్టారెంట్ స్టైల్ ‘తవా పనీర్ టిక్కా’.. సీక్రెట్ రెసిపీ మీకోసం!
-
CM Revanth Reddy: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై రేవంత్ ఫైర్.. కేంద్రంపై తీవ్ర విమర్శలు
-
Telangana Temples Revenue: ఆధ్యాత్మికతతో పాటు ఆర్థిక రికార్డులు.. 2025-26లో రూ.556 కోట్ల ఆదాయం
-
Meta Smart Glasses: సరికొత్త టెక్నాలజీ ఫీచర్.. గాలిలో వేళ్లు ఊపితే చాలు వాట్సాప్లో మెసేజ్ పంపొచ్చు!
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..