Sukhbir Singh Badal: మాజీ డిప్యూటీ సీఎం బాదల్పై హత్యాయత్నం.. నిందితుడికి ఖలిస్తాన్ ఉగ్ర లింకులు..
- మాజీ డిప్యూటీ సీఎం బాదల్పై హత్యాయత్నం..
- తుపాకీతో కాల్చేందుకు యత్నించిన నరేన్ సింగ్ చౌరా..
- నిందితుడికి ఖలిస్తాన్ ఉగ్రసంస్థ బబ్బర్ఖల్సాతో సంబంధం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sukhbir Singh Badal: పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం సుఖ్బీర్ సింగ్ బాదల్పై హత్యాయత్నం సంచలనంగా మారింది. ఈ రోజు ఉదయం అమృత్సర్లోని స్వర్ణదేవాలయం ప్రవేశద్వారం వద్ద సేవ చేస్తున్న బాదల్పై అగంతకుడు దాడికి యత్నించాడు. తుపాకీతో కాల్చే ప్రయత్నం చేశాడు. అయితే, అక్కడే ఉన్న కొంత మంది అతడిని అడ్డుకున్నారు. దీంతో బాదల్ సురక్షితంగా బయటపడ్డారు. వీల్ చైర్లో ఉన్న మిస్టర్ బాదల్ గోల్డెన్ టెంపుల్ గేట్ వద్ద ‘సేవాదర్’ స్థలంలో ఉన్న సమయంలో ఉదయం 9 గంటలకు ఈ సంఘటన జరిగింది.
నిందితుడని నరేన్ సింగ్ చౌరాగా గుర్తించారు. అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు ముందుగా గేటు వద్దకు వచ్చి జేబులోని తుపాకీ తీయడం అక్కడ ఉన్న కెమెరాల్లో రికార్డైంది. నరేన్ సింగ్ చౌరా అమృత్ సర్కి 60 కిమీ దూరంలోని గురుదాస్పూర్ జిల్లా చౌరా అనే గ్రామ నివాసి. ఇతనికి నిషేధిత సిక్కు ఉగ్రవాద సంస్థ ‘‘బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్’’తో సంబంధం ఉన్నట్లు భద్రతా ఏజెన్సీలు తెలిపాయి.
Also Read
- Jantar Mantar Protest: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో బిగ్ ట్విస్ట్
- Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు కేంద్రం సిద్ధం.. ఆగస్టు 17న ప్రత్యేక పార్లమెంట్ సమావేశం.?
- Plastic Currency Notes: ఆర్బీఐ కీలక నిర్ణయం.. మార్కెట్లోకి ప్లాస్టిక్ రూ.10, రూ.20 నోట్లు..! మరి పాత నోట్ల పరిస్థితి ఏంటి..?
- Modi-Meta: మెటాకు కేంద్రం 3 రోజులు డెడ్లైన్.. క్షమాపణ చెప్పకుంటే..!
Read Also: AlluArjun : ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య 70MMకు అల్లు అర్జున్
68 ఏళ్ల చౌరా చండీగఢ్లోని బురైల్ బైల్ నుంచి తప్పించుకున్న ఘటనలో ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు. 2004లో జైలు నుంచి సొరంగం తవ్వి నలుగురు ఖైదీలు తప్పించుకుపోయారు. ఈ నలుగురు ఖైదీల్లో బబ్బర్ ఖల్సా చీఫ్ జగ్తార్ సింగ్ హవారా, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ హంతకులు పరమ్జిత్ సింగ్ భియోరా , జగ్తార్ సింగ్ తారా, హత్యా దోషి దేవి సింగ్ ఉన్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం కింద చౌరాను 2013లో అరెస్టు చేశారు. ఐదేళ్ల తర్వాత బెయిల్పై విడుదలయ్యాడు.
ఇటీవల సిక్కు మత సంస్థ అకాలీ తఖ్త్ సుఖ్బీర్ సింగ్ బాదల్కి మతపరమైన శిక్ష విధించింది. 2015లో డేరా సచ్చ సౌదా చీఫ్ గుర్మీత్ సింగ్ రామ్ రహీమ్కి క్షమాభిక్ష పెట్టినందుకు సిక్కు సంస్థ విచారణ జరిపింది. దోషిగా తేలినందుకు స్వర్ణదేవాలయంలో టాయ్లెట్స్, వంటగది శుభ్రం చేయాలని శిక్షను విధించింది. ఈ శిక్ష అనుభవిస్తున్న సమయంలోనే ఆయనపై హత్యాయత్నం జరిగింది.
తాజావార్తలు
-
Trump-Netanyahu: ట్రంప్నకు నెతన్యాహు షాక్.. కీలక ప్రతిపాదన తిరస్కరణ!
-
Suriya: 200 రోజులు కష్టపడ్డా ఫ్లాప్.. 45 రోజుల్లో తీస్తే ఇండస్ట్రీ హిట్! ఆ రెండు సినిమాలపై సూర్య షాకింగ్ కామెంట్స్..
-
School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
-
Jantar Mantar Protest: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో బిగ్ ట్విస్ట్
-
AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అజెండాలో అమరావతి.. కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్..!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!