Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Huge Jam As Rahul Priyanka Gandhi Stopped At Delhi Up Border On Way To Sambhal

Rahul Gandhi: ఉద్రిక్తంగా మారన రాహుల్ గాంధీ సంభాల్ పర్యటన..

Published Date :December 4, 2024 , 12:22 pm
By Venu Goapl Reddy
  • రాహుల్ గాంధీ ‘‘సంభాల్’’ పర్యటనను అడ్డుకున్న అధికారులు..
  • ఇటీవల మసీదు సర్వేలో హింసాత్మక ఘటనలు..
  • బీజేపీ ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ నేతలు..
Rahul Gandhi: ఉద్రిక్తంగా మారన రాహుల్ గాంధీ సంభాల్ పర్యటన..
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Rahul Gandhi: ఉత్తర్ ప్రదేశ్‌లో ఇటీవల సంభాల్‌‌లోని షాహీ జామా మసీదు సర్వే వివాదం తీవ్ర హింసకు కారణమైంది. రాళ్లదాడి, గృహాల ధ్వంసం, వాహనాలకు నిప్పంటించిన గుంపు హింసాత్మకంగా ప్రవర్తించింది. ఈ హింసాత్మక దాడుల్లో ఐదుగురు వ్యక్తులు మరణించారు. ఇదిలా ఉంటే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, వయనాడ్ ఎంపీ ప్రియాంకాగాంధీతో పాటు కాంగ్రెస్ ఎంపీలు రోజు సంభాల్ వెళ్లేందుకు ప్రయత్నించడం వివాదాస్పదంగా మారింది. ఢిల్లీ -నోయిడా రహదారిపై హైడ్రామా కొనసాగింది. రాహుల్ గాంధీ వెళ్లేందుకు పోలీసులు అడ్డుచెప్పారు.

పోలీసులు జాతీయ రహదారిని దిగ్భందించడంతో సరిహద్దుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. రహదారికి అడ్డంగా బారికేట్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ని స్తంభింపచేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు బారికేడ్లు ఎక్కేందుకు ప్రయత్నించారు. ఉదయం 10.15 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరిని కాన్వాయ్‌ని 11 గంటల ప్రాంతంలో యూపీ సరిహద్దుల్లో అడ్డుకున్నారు. దీనిపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మండిపడ్డారు. ‘‘మన దేశంలో శాంతి, మత సామరస్యం కోసం బాధిత కుటుంబాలను కలవాలనుకుంటున్నాము. ప్రభుత్వం తమకు సంభాల్ వెళ్లేందుకు అనుమతించాలి’’ అని ట్వీట్ చేశారు.

Also Read

  • PM Modi: కాంగ్రెస్‌కు కొత్త పేరు పెట్టిన మోడీ.. ‘MMC’ అంటే ముస్లిం లీగ్, మావోవాది కాంగ్రెస్!
  • S Keerthana: 29 ఏళ్లకే మంత్రి.. 5 భాషల్లో ప్రావీణ్యం.. విజయ్ కేబినెట్‌లో స్పెషల్‌గా కీర్తన..
  • Tamil Nadu Election Twist: తమిళ రాజకీయాల్లో మళ్లీ ట్విస్ట్.. మద్రాస్ హైకోర్టు మెట్లు ఎక్కిన మాజీ మంత్రి!
  • PM Modi Telangana Visit: తెలంగాణపై మోడీ వరాల జల్లు.. రూ.9,377 కోట్లతో పలు ప్రాజెక్టులకు శ్రీకారం
Add as a preferred
source on google

Read Also: HYD Cyber Crime Police: తస్మాత్‌ జాగ్రత్త.. ఈ నంబర్ల నుంచి ఫోన్‌ వస్తుందా? లిప్ట్‌ చేయొద్దు..

కాంగ్రెస్ నాయకులు జిల్లాలోకి ప్రవేశించే ముందు వారిని అడ్డుకోవాలని సంభాల్ అధికారులు పొరుగు జిల్లాలకు లేఖలు రాశారు. బులంద్ షహర్, అమ్రోహా, ఘజియాబాద్, గౌతమ్ బుద్ధనగర్ అధికారులు లేఖలు పంపారు. రాహుల్ గాంధీని, కాంగ్రెస్ నేతల్ని సరిహద్దుల్లో అడ్డుకోవాలని కోరారు. ప్రభుత్వం వైఖరిని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ తప్పుపట్టారు. సంభాల్‌లో అల్లర్లు జరిగాయని, అందుకే అక్కడి వెళ్తున్నామని, అక్కడికి వెళ్లే హక్కు మాకుందని అని అన్నారు.

సంభాల్‌లోని జామా మసీదు ప్రాచీన్ హరిహర్ మందిరమని హిందూ పక్షం స్థానిక కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో కోర్టు మసీదు సర్వేకి అనుమతించింది. నవంబర్ 24న సర్వేకోసం వెళ్లిన అధికారులపై వేల సంఖ్యలో గుంపు రాళ్ల దాడికి పాల్పడింది. కొందరు గన్ ఫైర్ చేశారు. అయితే, ఈ హింసాత్మక అల్లర్లను అడ్డుకునేందుకు పోలీసులు టియర్ గ్యాస్ పేల్చాల్చి వచ్చింది. ఈ హింసాత్మక అల్లర్లలో ఐదుగురు మరణించారు. 30 మంది వరకు పోలీసులకు గాయాలయ్యాయి. సంభాల్ హింసలో పాకిస్తాన్‌కి చెందిన ఆరు బుల్లెట్ కాట్రిడ్జ్‌లను ఫోరెన్సిక్ స్వాధీనం చేసుకుంది. ఈ ఘటనపై 7 ఎఫ్ఐఆర్లు బుక్ అయ్యాయి. స్థానిక సమాజ్ వాదీ (ఎస్పీ) ఎంపీ జియా ఉర్ రెహ్మాన్ బార్క్‌తో పాటు స్థానిక ఎమ్మెల్యే కుమారుడి హస్తం కూడా ఉన్నట్లు అభియోగాలు నమోదయ్యాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Priyanka Gandhi
  • rahul gandhi
  • Sambhal Violence
  • Uttar Pradesh

తాజావార్తలు

  • PM Modi Hyd Tour Live Updates : హైదరాబాద్‌లో మోడీ సందడి.. పర్యటన మినిట్‌ టూ మినిట్‌ అప్డేట్స్‌..!

  • CSK vs LSG: లక్నో ప్లేఆఫ్ ఆశలు ఆవిరి.. చెపాక్‌లో చెన్నై వీరవిహారం!

  • Narendra Modi : ఏడాది పాటు బంగారం కొనద్దు.. ప్రధాని మోడీ పిలుపు.!

  • PM Modi: కాంగ్రెస్‌కు కొత్త పేరు పెట్టిన మోడీ.. ‘MMC’ అంటే ముస్లిం లీగ్, మావోవాది కాంగ్రెస్!

  • Urvil Patel: పొట్టుపొట్టు కొట్టిన ఉర్విల్ పటేల్.. ఐపీఎల్ హిస్టరీలోనే నయా రికార్డ్ .. 13 బంతుల్లోనే ఫిఫ్టీ!

  • PM Modi: బెంగాల్ ఉత్సాహం తెలంగాణలో కూడా కనిపిస్తోంది..

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions