Amit Shah: తెలంగాణపైనే నా ఫోకస్.. కేసీఆర్ నుంచి రాష్ట్రాన్ని విముక్తి కలిగించాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
My Focus Is On Telangana Says Amit Shah: ఇప్పుడు తన ఫోకస్ మొత్తం తెలంగాణ మీదే ఉందని, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేవరకు ఎంత సమయమైనా కేటాయిస్తానని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. మంగళవారం ఢిల్లీలో బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఇంట్లో జరిగిన తెలంగాణ బీజేపీ మినీ కోర్ కమిటీ మీటింగ్లో ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. దాదాపు రెండున్నర గంటల పాటు సాగిన ఈ సమావేశంలో.. పార్టీ నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఎందరో యువకుల ఆత్మ బలిదానాలతో, సుదీర్ఘ పోరాటంతో తెలంగాణను ప్రజలు సాధించుకున్నారని, అయితే ఒక కుటుంబం చేతిలో రాష్ట్రం బందీ అయ్యిందని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబ పాలన నుంచి తెలంగాణను విముక్తి చేసేందుకు.. ఉద్యమాలను మరింత ఉధృతం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు. గత తొమ్మిదేళ్ల నుంచి ఒక కుటుంబం చేతిలో రాష్ట్రం ఎంత నష్టపోయిందో, కేంద్ర ప్రభుత్వ పథకాలు పేదలకు అందకుండా ఎలా దారి మళ్లించారో.. జనాలకు వివరించాల్సిందిగా సూచించారు.
Dangerous Man: డేంజరస్ మ్యాన్.. పాక్, చైనాల్లో శిక్షణ పొంది ముంబైలోకి ఎంట్రీ
Also Read
- Explainer: రెస్టారెంట్ కిచెన్లో బొద్దింకల కాపురం..ఈగల సంసారం.. మీరు తింటున్నది ఇదే!
- Jharkhand Student Protest: జార్ఖండ్లో ఉద్రిక్తంగా మారిన నిరుద్యోగుల పోరు.. అర్ధరాత్రి పోలీసులు ఎందుకు వచ్చారు?
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
- IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
అలాగే.. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం చేపట్టాల్సిన పలు కార్యక్రమాలపై అమిత్ షా చర్చించారు. మార్చి నుంచి సెప్టెంబర్ వరకు.. రాష్ట్రంలో నిర్వహించాల్సిన కార్యక్రమాల రోడ్ మ్యాప్ను అందజేశారు. ఇప్పటి నుంచే 119 అసెంబ్లీ సీట్లలో బలమైన అభ్యర్థులను సిద్ధం చేసుకోవాలని, కనీసం 90 సీట్లలో నెగ్గాలన్న లక్ష్యంతో పని చేయాలని సూచించారు. బూత్, శక్తి కేంద్రాలు, మండల, నియోజకవర్గ స్థాయిలో బీజేపీని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ముఖ్యంగా.. ‘హర్ ఘర్ లోటస్’ ప్రోగ్రామ్ను వెంటనే చేపట్టాలని ఆదేశించారు. మోడీ సర్కార్ ఎన్ని నిధులిచ్చింది? కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్రంలో అమలవ్వకుండా కేసీఆర్ స్కార్ ఎలా అడ్డుకుంది? కేంద్రాన్ని బద్నాం చేసే రీతిలో బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాల వివరాల్ని గడప గడపకు తీసుకెళ్లాలని చెప్పారు. ‘‘ప్రస్తుతం నా దృష్టంతా కేవలం తెలంగాణపైనే ఉంది. రాష్ట్ర ప్రజలు బీజేపీని విశ్వసిస్తున్నారు. దీన్ని అనుకూలంగా మలుచుకొని.. అధికారంలోకి వచ్చేదాకా పని చేయాలి’’ అని అమిత్ షా చెప్పుకొచ్చారు.
Love Tragedy: మరో యువతితో పెళ్లి.. ప్రియురాల్ని మర్చిపోలేక యువకుడు ఆత్మహత్య
తాజావార్తలు
-
Best FD Interest Rates August 2026: FDపై 8.50 శాతం వరకు వడ్డీ.. ఆగస్టు 2026లో టాప్ రేట్లు అందిస్తున్న బ్యాంకుల పూర్తి జాబితా
-
Srinu Vaitla : జార్జ్క్రిష్తో కంబ్యాక్ ఇచ్చేందుకు శ్రీనువైట్ల భారీ స్కెచ్
-
Mallika Sherawat: ‘టామ్ క్రూజ్కు నాపై క్రష్’.. వీడియో కూడా ఉంది.. 49 ఏళ్ల మల్లికా కామెంట్స్ వైరల్
-
Tirupati Crime: వారంలో ప్రియుడు వివాహం..! ప్రియురాలు ఆత్మహత్య
-
Bhadradri Kothagudem: తీవ్ర విషాదం.. వేటగాళ్ల విద్యుత్ ఉచ్చుకు ఫారెస్ట్ ఆఫీసర్ బలి!
ట్రెండింగ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!