Amit Shah: తెలంగాణపైనే నా ఫోకస్.. కేసీఆర్ నుంచి రాష్ట్రాన్ని విముక్తి కలిగించాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
My Focus Is On Telangana Says Amit Shah: ఇప్పుడు తన ఫోకస్ మొత్తం తెలంగాణ మీదే ఉందని, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేవరకు ఎంత సమయమైనా కేటాయిస్తానని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. మంగళవారం ఢిల్లీలో బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఇంట్లో జరిగిన తెలంగాణ బీజేపీ మినీ కోర్ కమిటీ మీటింగ్లో ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. దాదాపు రెండున్నర గంటల పాటు సాగిన ఈ సమావేశంలో.. పార్టీ నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఎందరో యువకుల ఆత్మ బలిదానాలతో, సుదీర్ఘ పోరాటంతో తెలంగాణను ప్రజలు సాధించుకున్నారని, అయితే ఒక కుటుంబం చేతిలో రాష్ట్రం బందీ అయ్యిందని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబ పాలన నుంచి తెలంగాణను విముక్తి చేసేందుకు.. ఉద్యమాలను మరింత ఉధృతం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు. గత తొమ్మిదేళ్ల నుంచి ఒక కుటుంబం చేతిలో రాష్ట్రం ఎంత నష్టపోయిందో, కేంద్ర ప్రభుత్వ పథకాలు పేదలకు అందకుండా ఎలా దారి మళ్లించారో.. జనాలకు వివరించాల్సిందిగా సూచించారు.
Dangerous Man: డేంజరస్ మ్యాన్.. పాక్, చైనాల్లో శిక్షణ పొంది ముంబైలోకి ఎంట్రీ
Also Read
- Sejal Pawar: డాక్టర్ అని చెప్పుకుంటూ చెత్త కూతలు కూసిన సెజల్ పవార్! అసలు రంగు బయటపెట్టిన కేఈఎమ్ హాస్పిటల్..
- Saayoni Ghosh: 17 ఏళ్లకే హీరోయిన్గా.. అనతికాలంలో ఎంపీగా.. ట్రెండింగ్గా మారిన సయానీ ఘోష్ కథేంటి?
- India summons US: అమెరికా దాడులపై భారత్ సీరియస్.. యూఎస్ దౌత్యవేత్తకు సమన్లు..
- Kerala: కన్న బిడ్డను చంపిన తల్లి నిర్దోషి.. కేరళ హైకోర్టు సంచలన తీర్పు! అసలు కారణం తెలిస్తే షాక్ అవుతారు..
అలాగే.. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం చేపట్టాల్సిన పలు కార్యక్రమాలపై అమిత్ షా చర్చించారు. మార్చి నుంచి సెప్టెంబర్ వరకు.. రాష్ట్రంలో నిర్వహించాల్సిన కార్యక్రమాల రోడ్ మ్యాప్ను అందజేశారు. ఇప్పటి నుంచే 119 అసెంబ్లీ సీట్లలో బలమైన అభ్యర్థులను సిద్ధం చేసుకోవాలని, కనీసం 90 సీట్లలో నెగ్గాలన్న లక్ష్యంతో పని చేయాలని సూచించారు. బూత్, శక్తి కేంద్రాలు, మండల, నియోజకవర్గ స్థాయిలో బీజేపీని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ముఖ్యంగా.. ‘హర్ ఘర్ లోటస్’ ప్రోగ్రామ్ను వెంటనే చేపట్టాలని ఆదేశించారు. మోడీ సర్కార్ ఎన్ని నిధులిచ్చింది? కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్రంలో అమలవ్వకుండా కేసీఆర్ స్కార్ ఎలా అడ్డుకుంది? కేంద్రాన్ని బద్నాం చేసే రీతిలో బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాల వివరాల్ని గడప గడపకు తీసుకెళ్లాలని చెప్పారు. ‘‘ప్రస్తుతం నా దృష్టంతా కేవలం తెలంగాణపైనే ఉంది. రాష్ట్ర ప్రజలు బీజేపీని విశ్వసిస్తున్నారు. దీన్ని అనుకూలంగా మలుచుకొని.. అధికారంలోకి వచ్చేదాకా పని చేయాలి’’ అని అమిత్ షా చెప్పుకొచ్చారు.
Love Tragedy: మరో యువతితో పెళ్లి.. ప్రియురాల్ని మర్చిపోలేక యువకుడు ఆత్మహత్య
తాజావార్తలు
-
Iran-US: ఇరాన్ మళ్లీ కొత్త మెలిక.. హార్ముజ్, యురేనియంపై కీలక వ్యాఖ్యలు
-
Sejal Pawar: డాక్టర్ అని చెప్పుకుంటూ చెత్త కూతలు కూసిన సెజల్ పవార్! అసలు రంగు బయటపెట్టిన కేఈఎమ్ హాస్పిటల్..
-
Clothes Drying Tips: వర్షాకాలంలో బట్టలు ఆరబెట్టడానికి కష్టపడుతున్నారా? ఈ సులభమైన చిట్కాలతో గంటల్లోనే డ్రై..!
-
Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్కు చేర్చిన క్షణాలు..
-
EMI Crime: ట్రాక్టర్ EMI చెల్లించడానికి కోసం బంధువుల దారుణం..
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!