Muslims Boycott Elections: ఎన్నికలను బహిష్కరించిన ముస్లింలు.. కారణం ఇదే..
Muslims Boycott Polls In Gujarat Village: గుజరాత్ లో రెండో విడత ఎన్నికలు ఈ రోజు జరుగుతున్నాయి. ఇప్పటికే తొలి విడత డిసెంబర్ 1న పూర్తవగా.. నేడు రెండో విడత ఎన్నికలు జరుగుతున్నాయి. డిసెంబర్ 8న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో పాటు పలువురు ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇదిలా ఉంటే ఓ గ్రామంలోని ముస్లింలు మాత్రం ఎన్నికలను బహిష్కరించారు.
గుజరాత్ లోని ఖేడా జిల్లా ఉంధేలా గ్రామంలో ముస్లింలు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించారు. అక్టోబర్ నెలలో ముస్లిం యువకులను పోలీసులు కట్టేసి కొట్టారు. అయితే ఈ ఘటనపై ఆగ్రహంతోనే ఆ గ్రామంలోని ముస్లింలు ఎన్నికలను బహిష్కరించారు. అక్టోబర్ నెలలో దసరా, నవరాత్రి సందర్భంగా గర్భా కార్యక్రమంపై రాళ్లు విసిరారనే ఆరోపణలపై గ్రామానికి చెందిన కొంతమంది యువకునలు పోలీసులు కొట్టారు. పోలీసులు కొంత మంది ముస్లిం యువకులను అరెస్ట్ చేసి, స్తంబానికి కట్టేసి లాఠీలతో కొట్టారు. సాధారణ దుస్తులతో ఉన్న పోలీసులు, వారిని కొడుతుంటే అదిచూస్తున్న జనాలు హర్షం వ్యక్తం చేశాయి. ప్రజలకు క్షమాపనలు చెప్పాలని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులను పోలీసులు ఆదేశించారు.
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
Read Also: Minister KTR : చెరువు మాయమైందంటూ మంత్రికి ట్వీట్.. అక్కడికెళ్లి చూసి అవాక్కైన అధికారులు
అయితే ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో..దీనిపై విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. దీనిపై కొంతమంది నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఇన్స్టాంట్ జస్టిస్ పేరుతో ఇలాంటి చర్యలకు పాల్పడటాన్ని తప్పబట్టారు. అయితే మరికొంత మంది మాత్రం పోలీసులకు మద్దతుగా నిలిచారు.
అక్టోబర్ 3న ఉంధేలా గ్రామంలో ఆలయ ప్రాంగణలో జరిగి గర్భా కార్యక్రమంపై 150 మంది గుంపు రాళ్లు రువ్వినట్లు అభియోగాలు నమోదు అయ్యాయి. ఈ కేసులో 43 మంది పేర్లు నమోదు అయ్యాయి. ముస్లిం కమ్యూనిటీ సభ్యులు ఆలయం ముందు గర్భా నిర్వహించడాన్ని వ్యతిరేకించారు. ఆలయానికి ముందు మసీదు ఉండటంతో అభ్యంతరం తెలిపారు. ఆ తరువాత గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు పెద్ద ఎత్తున గ్రామంలో మోహరించి పరిస్థితి చక్కదిద్దారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!