Madhya Pradesh: భర్తకు భార్య షాక్.. రూ.4లక్షల నగలతో ప్రియుడితో పరారైన నవ వధువు
- భర్తకు భార్య షాక్
- 4లక్షల నగలతో ప్రియుడితో పరారైన నవ వధువు మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెళ్లి చూపులు.. ఒకరికొకరు ఇష్టపడడం.. పెద్దలు పెళ్లికి ముహూర్తాలు పెట్టడం. బంధువులకు పెళ్లి కార్డులు పంచడం. మండపాలు, లైటింగ్, గ్రాండ్గా వివాహ ఏర్పాట్లు, కొత్త బట్టలు, నగలు, ఇలా అన్ని ఏర్పాట్లు చేసుకుని అమ్మాయి-అబ్బాయి ఇద్దరు పెళ్లి చేసుకుని ఏడడుగులు నడిచి సంతోషంగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. హాయ్గా సంసారం సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో నవ వధువు ఒక్కసారిగా షాకిచ్చింది. నగలు, నగదు తీసుకుని ప్రియుడితో పరారైంది. ఈ ఘటనతో వరుడు బంధువులంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Singapore: స్టార్ హోటల్ ఎంట్రన్స్లో మలవిసర్జన.. భారతీయుడికి కోర్టు రూ.25 వేలు ఫైన్
Also Read
- Honour killing: హిందూ యువకుడితో ప్రేమ.. కుమార్తెను ముక్కలుగా నరికి చంపిన తండ్రి..
- Snowfall: దేశమంతా ఎండలు భగభగలు.. లడఖ్లో మాత్రం భారీ హిమపాతం.. వీడియోలు వైరల్
- Pulwama Attack: అజ్ఞాత వ్యక్తుల సంచలనం.. పాక్లో పుల్వామా సూత్రధారి హతం..
- Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్ షాక్.. "ఎక్స్" అకౌంట్ నిలిపివేత..
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో రెండు నెలల క్రితమే ఓ జంట పెళ్లి చేసుకున్నారు. కేవలం అంటే కేవలం రెండు నెలల్లో భర్తతో ఆమె 17 రోజులే ఉంది. మనిషేమో ఇక్కడా.. మనసేమో ప్రియుడి దగ్గర ఉంది. భర్తతో ఉంటూనే ప్రియుడితో ఊహాల్లో విహరిస్తోంది. మొత్తానికి సమయం చూసి ఇంట్లో ఉన్న రూ.4లక్షల నగలు తీసుకుని ప్రియుడితో పరారైంది. ఇదిలా ఉంటే పెళ్లైన దగ్గర నుంచి ప్రియుడితో టచ్లోనే ఉంది. పెళ్లి ఫొటోలు కూడా ప్రియుడికి పంపించింది. అంతేకాదు.. ఈ పెళ్లికి ముందే ప్రియుడిని వివాహం చేసుకున్నట్లు సమాచారం. బాధితడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: NDA Govt: వక్ఫ్ బిల్లు, వన్ నేషన్-వన్ ఎలక్షన్.. బీజేపీ నెక్ట్స్ ప్లాన్ ఏంటి?
బాధితుడు సంతోష్ ప్రజాపతి.. అంజలి అనే యువతిని గ్వాలియర్లోని జైన్ ధర్మశాలలో వివాహం చేసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత మహిళ కుటుంబం ఆమెకు వీడ్కోలు పలికింది. ఆమె తన భర్తతో కలిసి వెళ్లింది. రెండు రోజుల తర్వాత సంతోష్ బయటి పనికి వెళ్లాడు. రెండు వారాల తర్వాత తిరిగి వచ్చేసరికి భార్య కనిపించలేదు. ఇంట్లో వాళ్లను అడిగిన వెంటనే ఆమె తన తల్లి ఇంటికి వెళ్లి త్వరలో తిరిగి వస్తుందని అతని కుటుంబ సభ్యులు అతనికి సమాచారం ఇచ్చారు. ఆమె తిరిగి రాకపోవడంతో అతనికి అనుమానం వచ్చి అల్మీరాలో రూ. 4 లక్షల విలువైన నగలు మరియు రూ.25,000 నగదు మాయమైనట్లు గ్రహించాడు. ఆ తర్వాత తన కూతురు తన ప్రియుడితో కలిసి పారిపోయిందని అత్తగారి నుంచి కాల్ వచ్చింది. ఇంతలో అంజలి తన పాత వివాహ ఫోటోలను ఫేస్బుక్ మెసెంజర్ ద్వారా సంతోష్కు పంపింది. ఆర్య సమాజ్ మందిర్లో వారి వివాహానికి మూడు నెలల ముందు తన ప్రేమికుడిని వివాహం చేసుకున్నట్లు వెల్లడించింది. దీంతో కోపోద్రిక్తుడైన సంతోష్ జనక్గంజ్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు.
ఇది కూడా చదవండి: RBI: ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్కు ఊరట.. గోల్డ్ లోన్ బిజినెస్పై ఆర్బీఐ ఆంక్షలు ఎత్తివేత
తాజావార్తలు
-
RBI: రూపాయికి కొంత ఉపశమనం.. ఆర్బీఐ చర్యలతో భారీ ఊరట..
-
Honour killing: హిందూ యువకుడితో ప్రేమ.. కుమార్తెను ముక్కలుగా నరికి చంపిన తండ్రి..
-
Snowfall: దేశమంతా ఎండలు భగభగలు.. లడఖ్లో మాత్రం భారీ హిమపాతం.. వీడియోలు వైరల్
-
SIR Phase-3 : దేశవ్యాప్తంగా ‘SIR ఫేజ్-3’ షెడ్యూల్ విడుదల, అక్టోబర్ 1న తుది జాబితా..!
-
AP: ఏపీ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నూతన కమిటీ నియామకం..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!