SIR Phase-3 : దేశవ్యాప్తంగా ‘SIR ఫేజ్-3’ షెడ్యూల్ విడుదల, అక్టోబర్ 1న తుది జాబితా..!
- తెలంగాణలో ఓటరు జాబితా సవరణ షెడ్యూల్ విడుదల
- ఇంటింటికీ వెళ్లనున్న బూత్ లెవెల్ ఆఫీసర్లు
- జూలై 31న డ్రాఫ్ట్ ఓటరు జాబితా ప్రచురణ
- అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో ఎన్నికల ప్రక్రియను మరింత పారదర్శకంగా, ఖచ్చితత్వంతో నిర్వహించేందుకు భారత ఎన్నికల సంఘం (ECI) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఓటరు జాబితాల సమగ్ర సవరణ, నవీకరణే (Update) లక్ష్యంగా ప్రతిష్టాత్మక స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) – ఫేజ్ 3 కార్యక్రమాన్ని ప్రారంభించబోతోంది. దేశవ్యాప్తంగా మొత్తం 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలలో ఈ డ్రైవ్ను దశలవారీగా నిర్వహించనున్నారు. అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించడం, డూప్లికేట్ , మరణించిన వారి ఓట్లను తొలగించడమే ఈ #SIR2026 ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం.
ఈ ఫేజ్-3 డ్రైవ్లో తెలంగాణ , పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన స్పెషల్ షెడ్యూల్ను ఎలక్షన్ కమిషన్ అధికారికంగా రిలీజ్ చేసింది. ఈ సవరణ ప్రక్రియకు అక్టోబర్ 1, 2026 నాటికి అర్హత సాధించే వారిని ప్రామాణికంగా (Qualifying Date) నిర్ణయించారు. తెలంగాణలో జూన్ 15 నుండి జూన్ 24 వరకు ఓటరు జాబితా సవరణకు సంబంధించి ప్రాథమిక సన్నాహాలు, అధికారులకు శిక్షణ (Training) , అవసరమైన ఫారాల ప్రింటింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఆ తర్వాత జూన్ 25 నుండి జూలై 24 వరకు బూత్ లెవెల్ ఆఫీసర్లు (BLOs) ప్రతి ఇంటికి స్వయంగా పర్యటించి (House-to-House Visit) అర్హులైన ఓటర్ల వివరాలను సేకరిస్తారు. ఇదే సమయంలో జూలై 24 లోపు పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ (Rationalization) ప్రక్రియను కూడా అధికారులు పూర్తి చేస్తారు.
Also Read
ఈ ఇంటెన్సివ్ డ్రైవ్ ముగిసిన తర్వాత, సేకరించిన వివరాల ఆధారంగా జూలై 31న ‘డ్రాఫ్ట్ ఓటరు జాబితా’ (కరడు ఓటరు జాబితా) ను పబ్లిష్ చేస్తారు. ఈ డ్రాఫ్ట్ లిస్ట్పై ఓటర్లు తమ అభ్యంతరాలు, క్లెయిమ్స్ (Claims & Objections) దాఖలు చేసుకోవడానికి జూలై 31 నుండి ఆగస్టు 30 వరకు అంటే నెల రోజుల పాటు సమయం ఇస్తారు. అభ్యంతరాలు , క్లెయిమ్స్ అన్నింటినీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి సెప్టెంబర్ 28 లోపు పరిష్కరిస్తారు. చివరగా అన్ని రకాల సవరణలు పూర్తి చేసిన తర్వాత అక్టోబర్ 1న తెలంగాణ అధికారిక ‘తుది ఓటరు జాబితా’ను (Final Electoral Roll) విడుదల చేస్తారు.
ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను వంద శాతం పారదర్శకంగా నిర్వహించడానికి ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా పొలిటికల్ పార్టీలు కూడా ప్రతి పోలింగ్ బూత్ వద్ద తమ తరపున బూత్ లెవెల్ ఏజెంట్లను (BLAs) నియమించుకోవాలని ఈసీఐ సూచించింది. అర్హత కలిగి ఉండి ఇప్పటివరకు ఓటు హక్కు లేని ప్రతి పౌరుడూ ఓటరుగా నమోదయ్యేలా చూసేందుకు ప్రజలందరూ ఈ డ్రైవ్లో భాగస్వాములు కావాలని అధికారులు కోరుతున్నారు.
తాజావార్తలు
-
Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
-
CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
-
CM Revanth Reddy : హైదరాబాద్కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!