Sanjay Raut: కుంభమేళాలో 2000 మంది మరణించారు.. ఉద్ధవ్ ఎంపీ సంచలన ఆరోపణ..
- కుంభమేళా తొక్కిసలాటలో 2000 మంది మరణించారు..
- రాజ్యసభలో సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanjay Raut: ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాలో ఇటీవల తొక్కిసలాట జరిగింది. ఈ సంఘటనలో మొత్తం 30 మంది మరణించగా, 60 మంది గాయపడ్డారు. ఇప్పుడు దీనిపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. ప్రతిపక్షాలు మృతుల సంఖ్యని స్పష్టం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. కాంగ్రెస్, ఎస్పీ సహా ఇతర ప్రతిపక్షాలు యోగి సర్కార్పై ఆరోపణలు చేస్తున్నాయి.
Read Also: Chinese ship: అరేబియా సముద్రంలోకి చైనా నౌకలు.. భారత్కి అలర్ట్..
Also Read
- Dhurandhar-2: ‘ధురంధర్ 2’ దేశ భద్రతకు ముప్పా? కేంద్రానికి హై కోర్టు కీలక ఆదేశాలు..
- Indian Railways: రైళ్లలో వరుస అగ్నిప్రమాదాలు.. కుట్రదారులెవరో బయటపెట్టిన రైల్వే శాఖ
- Karnataka: కాంగ్రెస్ అధిష్టానానికి కొత్త తలనొప్పి.. కేరళ కథ సుఖాంతం.. కర్ణాటకలో మొదలైన అసలు సినిమా!
- CM Vijay: సీఎం విజయ్కి షాక్ ఇచ్చిన మిత్రపక్షాలు.. 'రెండు ఆకుల' రాజకీయంలో దళపతి వెనకడుగు!
ఇదిలా ఉంటే, ఈ సంఘటనపై ఉద్ధవ్ ఠాక్రే శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు చేశారు. జనవరి 29న జరిగిన తొక్కిసలాటలో 2000 మంది మరణించారని మంగళవారం రాజ్యసభలో ఆరోపించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా తొక్కిసలాట మృతుల అధికారిక సంఖ్యను ఆయన ప్రశ్నించారు.
“4-5 రోజుల క్రితం తొక్కిసలాట జరిగినప్పుడు, అది తొక్కిసలాట కాదని, పుకారు అని చెప్పారు. 30 మంది మరణించారు. ఆ సంఖ్య నిజమేనా? మృతుల సంఖ్యని దాచవద్దు. ఒక్క వ్యక్తి మరణించినా మేము బాధ్యత తీసుకుంటాము, మేము మా కళ్ళతో చూసిన గణాంకాల ప్రకారం 2,000 మంది చనిపోయారు,” అని అతను అన్నారు. ఈ ఘటనకు నిర్వహణ లోపమే కారణమని, కుంభమేళాని రాజకీయ మార్కెటింగ్ కోసం ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. ఇతర దేశాల్లో ఇలాంటి ఘటనలు జరిగేతే ప్రధానిని రాజీనామా చేయాలనే డిమాండ్లు వచ్చేవని అన్నారు.
తాజావార్తలు
-
Dhurandhar-2: ‘ధురంధర్ 2’ దేశ భద్రతకు ముప్పా? కేంద్రానికి హై కోర్టు కీలక ఆదేశాలు..
-
Indian Railways: రైళ్లలో వరుస అగ్నిప్రమాదాలు.. కుట్రదారులెవరో బయటపెట్టిన రైల్వే శాఖ
-
AP Crime: ప్రేమ పేరుతో వివాహితకు వేధింపులు.. యువకుడికి గుండు కొట్టి ఊరేగించిన స్థానికులు..!
-
NTR: ఎన్టీఆర్ ఇంట్లోకి కొత్త అతిథులు.. జపాన్ పేర్లు ఎందుకు పెట్టారో తెలుసా?
-
Chris Gayle: అబ్బబ్బా ఏం ఆడుతున్నాడు, వైభవ్కు అభిమానిగా మారిపోతున్నా.. యూనివర్స్ బాస్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!