Chinese ship: అరేబియా సముద్రంలోకి చైనా నౌకలు.. భారత్కి అలర్ట్..
- అరేబియా సముద్రంలో చైనా నౌకలు..
- ‘‘మత్స్య పరిశోధన’’ కోసమని చెబుతున్న చైనా..
- నౌకల్ని అనుమతించిన మాల్దీవులు..
- భారత్కి ఆందోళన కలిగించే పరిణామం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chinese ship: భారత్కి చైనా నుంచి భద్రతపరమైన సమస్యలు తప్పడం లేదు. తాజాగా చైనాకు చెందిన నౌకలు, ఇండియాకు సమీపంలో అరేబియా సముద్రంలో కనిపించాయి. భద్రతా నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కీలమైన సముద్రం నిఘాను సేకరించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అయితే, చైనా మాత్రం ‘‘మత్స్య పరిశోధన’’ కోసమని చెబుతోంది. రెండు నౌకలు లాన్ హై 101 , 201 అరేబియా సముద్రంలో పరిశోధనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్( OSINT) నిపుణుడు డామియన్ సైమన్ హిందూ మహాసముద్రం ప్రాంతంలో ఈ నౌకల గమనాన్ని పోస్ట్ చేశారు.
ఇదిలా ఉంటే, మాల్దీవుల అధ్యక్షుడిగా గెలిచినప్పటి నుంచి మహ్మద్ ముయిజ్జు చైనా అనుకూల, భారత వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాడు. తాజాగా చైనా నౌకల్ని మాల్దీవులు అనుమతించడం భారత్ని ఆందోళనపరుస్తోంది. ఈ నౌకల్లో అండర్ వాటర్ డ్రోన్లు, రిమోట్ ఆపరేటేడ్ వెహికల్స్ (ROVలు) ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఇది సముద్రగర్భాన్ని మ్యాప్ చేయడంతో పాటు కీలక సైనిక సమాచారాన్ని సంపాదించగలదు.
Also Read
- CJP Protest: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..118 మంది పోలీసులకు గాయాలు.. పోలీసుల అదుపులో 70 మంది
- Sikkim: సిక్కింలో కొండచరియలు విరిగిపడి 7 మంది మృతి.. సొరంగంలో చిక్కుకున్న 27 మంది కార్మికులు!
- CJP Protest: జంతర్ మంతర్ వీడేదిలేదు.. మరోసారి పార్లమెంట్ మార్చ్.. సీజేపీ స్పష్టమైన హెచ్చరిక
- Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
Read Also: PM Modi: నెహ్రూ గురించి తెలియాలంటే “జాన్ ఎఫ్ కెన్నడీ పుస్తకం చదవండి”..
ఈ నౌకలు పరిశోధన ముసుగులో వ్యూహాత్మక డేటాతో పాటు సముద్ర గూఢచర్యానికి పాల్పడుతోందని ఆరోపణలు ఉన్నాయి. తాజాగా చైనా కార్యక్రమాలు ఫిబ్రవరి 7 నుంచి 11 వరకు కరాచీలో పాకిస్తాన్ నావికాదళం నిర్వహించే మల్టీ నేషనల్ నేవల్ ఎక్సర్సైజ్ సమయంలో కనిపించాయి. ఈ విన్యాసాలలో చైనా ఆర్మీ పాల్గొనే అవకాశం ఉంది. ఈ పరిణామాలు హిందూ మహాసముద్రంలో చైనా-పాక్ సైనిక సహకారాన్ని మరింత పెంచుతుందనే ఆందోళన నెలకొంది.
గతంలో శ్రీలంక చైనా నౌకల్ని అనుమతించడం కూడా వివాదాస్పదమైంది. హంబన్టోట తీరానికి చైనా నౌకలు రావడంపై భారత్ తన అభ్యంతరాన్ని శ్రీలంకకు తెలియజేసింది. గత కొంత కాలంగా చైనా హిందూ మహాసముద్రంలో తన ఉనికిని పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. భారత ఆధిపత్యాన్ని అధిగమించాలని అనుకుంటోంది. దక్షిణాసియా అంతటా తన వాణిజ్య, సైనిక ఆస్తుల్ని కూడబెడుతోంది.
తాజావార్తలు
-
CJP Protest: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..118 మంది పోలీసులకు గాయాలు.. పోలీసుల అదుపులో 70 మంది
-
Sikkim: సిక్కింలో కొండచరియలు విరిగిపడి 7 మంది మృతి.. సొరంగంలో చిక్కుకున్న 27 మంది కార్మికులు!
-
Team India: వైభవ్ సూర్యవంశీలా.. ఆ స్టార్ ఆటగాడి కెరీర్ను కూడా గంభీర్ నాశనం చేస్తున్నాడు!
-
BCCI New Rules: దేశీయ క్రికెట్లో కొత్త రూల్స్.. చివరి ఓవర్ నుంచి వైడ్ వరకు కీలక మార్పులు..!
-
CJP Protest: జంతర్ మంతర్ వీడేదిలేదు.. మరోసారి పార్లమెంట్ మార్చ్.. సీజేపీ స్పష్టమైన హెచ్చరిక
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!