Chinese ship: అరేబియా సముద్రంలోకి చైనా నౌకలు.. భారత్కి అలర్ట్..
- అరేబియా సముద్రంలో చైనా నౌకలు..
- ‘‘మత్స్య పరిశోధన’’ కోసమని చెబుతున్న చైనా..
- నౌకల్ని అనుమతించిన మాల్దీవులు..
- భారత్కి ఆందోళన కలిగించే పరిణామం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chinese ship: భారత్కి చైనా నుంచి భద్రతపరమైన సమస్యలు తప్పడం లేదు. తాజాగా చైనాకు చెందిన నౌకలు, ఇండియాకు సమీపంలో అరేబియా సముద్రంలో కనిపించాయి. భద్రతా నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కీలమైన సముద్రం నిఘాను సేకరించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అయితే, చైనా మాత్రం ‘‘మత్స్య పరిశోధన’’ కోసమని చెబుతోంది. రెండు నౌకలు లాన్ హై 101 , 201 అరేబియా సముద్రంలో పరిశోధనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్( OSINT) నిపుణుడు డామియన్ సైమన్ హిందూ మహాసముద్రం ప్రాంతంలో ఈ నౌకల గమనాన్ని పోస్ట్ చేశారు.
ఇదిలా ఉంటే, మాల్దీవుల అధ్యక్షుడిగా గెలిచినప్పటి నుంచి మహ్మద్ ముయిజ్జు చైనా అనుకూల, భారత వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాడు. తాజాగా చైనా నౌకల్ని మాల్దీవులు అనుమతించడం భారత్ని ఆందోళనపరుస్తోంది. ఈ నౌకల్లో అండర్ వాటర్ డ్రోన్లు, రిమోట్ ఆపరేటేడ్ వెహికల్స్ (ROVలు) ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఇది సముద్రగర్భాన్ని మ్యాప్ చేయడంతో పాటు కీలక సైనిక సమాచారాన్ని సంపాదించగలదు.
Also Read
- Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
- Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
- PM Modi: ఉజ్బెకిస్థాన్కు చేరుకున్న మోడీ.. అధ్యక్షుడు మిర్జియోయెవ్ ఘన స్వాగతం
- Reservation row: కేంద్ర మంత్రుల మధ్య మాటల యుద్ధం.. మంట పెట్టిన ‘‘రిజర్వేషన్’’ అంశం..
Read Also: PM Modi: నెహ్రూ గురించి తెలియాలంటే “జాన్ ఎఫ్ కెన్నడీ పుస్తకం చదవండి”..
ఈ నౌకలు పరిశోధన ముసుగులో వ్యూహాత్మక డేటాతో పాటు సముద్ర గూఢచర్యానికి పాల్పడుతోందని ఆరోపణలు ఉన్నాయి. తాజాగా చైనా కార్యక్రమాలు ఫిబ్రవరి 7 నుంచి 11 వరకు కరాచీలో పాకిస్తాన్ నావికాదళం నిర్వహించే మల్టీ నేషనల్ నేవల్ ఎక్సర్సైజ్ సమయంలో కనిపించాయి. ఈ విన్యాసాలలో చైనా ఆర్మీ పాల్గొనే అవకాశం ఉంది. ఈ పరిణామాలు హిందూ మహాసముద్రంలో చైనా-పాక్ సైనిక సహకారాన్ని మరింత పెంచుతుందనే ఆందోళన నెలకొంది.
గతంలో శ్రీలంక చైనా నౌకల్ని అనుమతించడం కూడా వివాదాస్పదమైంది. హంబన్టోట తీరానికి చైనా నౌకలు రావడంపై భారత్ తన అభ్యంతరాన్ని శ్రీలంకకు తెలియజేసింది. గత కొంత కాలంగా చైనా హిందూ మహాసముద్రంలో తన ఉనికిని పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. భారత ఆధిపత్యాన్ని అధిగమించాలని అనుకుంటోంది. దక్షిణాసియా అంతటా తన వాణిజ్య, సైనిక ఆస్తుల్ని కూడబెడుతోంది.
తాజావార్తలు
-
Bank Locker Swept: వరదల్లో కొట్టుకుపోయిన బ్యాంకు లాకర్.. రూ. లక్షల్లో డబ్బు.. ఎగబడిన జనం
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
NBK111 vs King100: బాలయ్య vs నాగ్.. క్రిస్మస్ బాక్సాఫీస్పై మరో బిగ్ క్లాష్!
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు!
-
Irummudi: ‘బాహుబలి’, ‘పుష్ప’ సినిమాలను వెనక్కి నెట్టిన రవితేజ ‘ఇరుముడి’!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!