Gurpatwant Singh Pannun: “చెక్ కోర్టుకు వెళ్లండి”.. పన్నూ హత్య కుట్ర కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు..
Gurpatwant Singh Pannun: ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర పన్నాడనే అభియోగాలతో నిఖిల్ గుప్తా అనే భారతీయుడిని అమెరికా కోరిక మేరకు చెక్ రిపబ్లిక్ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతడు చెక్ రిపబ్లిక్ జైలులో ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ కేసులో నిఖిల్ గుప్తా కుటుంబం సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. భారత ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరింది.
చెక్ రిపబ్లిక్ లో నిఖిల్ గుప్తాను అక్రమంగా నిర్భందించారని, తనకు సాయం చేసేలా ఈ విషయంలో భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టుని కోరారు. పిటినర్ భారతీయుడు కావడంతో అతని ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని, రాజకీయ కుట్రలకు అతను బాధితుడయ్యాడని కుటుంబం సుప్రీంకి తెలిపింది. అయితే ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇది సున్నితమైన అంశమని.. మరో దేశంలో జరిగే అరెస్టు తమ న్యాయశాఖ పరిధిలోకి రావని, అందువల్ల మీరు చెక్ రిపబ్లిక్ కోర్టు వెళ్లండి అంటూ సూచించింది. జనవరి 4న దీనిపై మరోసారి విచారించనుంది.
Also Read
- Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
- Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
- Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
- Manish Sisodia: కోర్టులో మీరుంటే విచారణకు రాను.. జస్టిస్ స్వర్ణకాంతకు మనీష్ సిసోడియా లేఖ
Read Also: Krishna Janmabhoomi: కృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా సర్వేపై స్టే ఇవ్వలేం.. స్పష్టం చేసిన సుప్రీంకోర్టు..
అమెరికన్ సిటిజన్ అయిన గురుపత్వంత్ సింగ్ పన్నూ అనే వ్యక్తి ఖలిస్తానీ ఉగ్రవాదిగా భారత్ గుర్తించింది. అయితే ఇతడిని అమెరికన్ గడ్డపై హతమార్చేందుకు నిఖిల్ గుప్తా అనే వ్యక్తి, ఓ కాంట్రాక్ట్ కిల్లర్కి డబ్బులిచ్చి ప్లాన్ చేశాడని అమెరికా న్యాయశాఖ అభియోగాలు మోపింది. ఈ కుట్రలో ఓ భారతీయ ప్రభుత్వ ఉద్యోగి ప్రమేయం కూడా ఉందని ఆరోపించింది. నిఖిల్ గుప్తా చెక్ రిపబ్లిక్ దేశంలో ఉండటంతో అతడిని అరెస్ట్ చేయాలని అమెరికా కోరగా.. అక్కడి అధికారులు నిర్భందించారు. అమెరికా అతడిని తమకు అప్పగించాలని చెక్ అధికారులను కోరుతోంది. ఈ కేసులో నిఖిల్ గుప్తా దోషిగా తేలితే 20 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
-
Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
-
Ashu Reddy: హైకోర్టును ఆశ్రయించిన అషురెడ్డి ..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!