Priyanka Gandhi: ప్రచారంలో మదర్ థెరిస్సా ప్రస్తావన.. పాత జ్ఞాపకాలు పంచుకున్న ప్రియాంక
- ప్రచారంలో మదర్ థెరిస్సా ప్రస్తావన
- పాత జ్ఞాపకాలు పంచుకున్న ప్రియాంక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వయనాడ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంకాగాంధీ దూసుకుపోతున్నారు. సోమవారం కొండ నియోజకవర్గంలో ప్రియాంక ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ.. మదర్ థెరిస్సాను గుర్తుచేసుకున్నారు. తన తండ్రి రాజీవ్ గాంధీ హత్య జరిగిన కొద్ది రోజులకు మదర్ థెరెసా మమ్మల్ని పలకరించడానికి ఇంటికి వచ్చారని.. అప్పుడు తనకు 19ఏళ్లు అని చెప్పారు. ఆమె వచ్చిన సమయంలో జ్వరంతో బాధపడుతున్నానని.. అమ్మను పలకరించిన అనంతరం థెరెసా తన దగ్గరికి వచ్చి తలపై చేయి పెట్టి ఆశీర్వదించారన్నారు. నిరుపేదల కోసం పని చేయాలని తనను ఆహ్వానించారని గుర్తుచేశారు. దాదాపు 6 సంవత్సరాల తర్వాత తాను వారి సంస్థతో కలిసి పని చేయడానికి వెళ్లినట్లు చెప్పారు. అక్కడ ఉన్న సోదరీమణులతో కలిసి బాత్రూంలు శుభ్రం చేయడం, వంట చేయడం వంటి పనులు చేసినట్లు తెలిపారు. అప్పుడే కష్టాల్లో ఉన్న వారికి సమాజం ఎలా చేయూతనందిస్తుందో తెలుసుకున్నానన్నారు. వయనాడ్ విపత్తు సమయంలో తోటివారికి ఎలా సాయం చేయాలో మదర్ థెరెస్సా మాటలు రుజువు చేశాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే పేదల సమస్యల గురించి ఆలోచిస్తుందని ప్రియాంక అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ వ్యాపారవేత్తలైన తన స్నేహితులకు అనుకూలంగా పాలసీలు రూపొందిస్తున్నారని ఆరోపించారు.
ఇది కూడా చదవండి: CM Relief Fund: వరద బాధితుల కోసం విరాళాల వెల్లువ..
Also Read
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
- USA: "నువ్వు ముస్లింవా?" అని భారతీయుడిపై 15 సార్లు కత్తితో దాడి..
నవంబర్ 13న వయనాడ్ బైపోల్ ఎన్నిక జరగనుంది. ఇప్పటికే ప్రియాంకపై పోటీగా బీజేపీ కూడా బలమైన అభ్యర్థిని నిలబెట్టింది. బీజేపీలో క్రీయాశీలకంగా ఉన్న నవ్య హరిదాస్ను బరిలోకి దింపింది. ఈమె కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు. రెండు జాతీయ పార్టీలు పోటీపోటీగా ప్రచారం చేస్తున్నారు.
ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ రాయ్బరేలీ, వయనాడ్ నుంచి పోటీ చేశారు. రెండు చోట్ల నుంచి భారీ మెజార్టీతో గెలుపొందారు. అయితే గాంధీ కుటుంబానికి కుంచుకోట అయిన రాయ్బరేలీ స్థానాన్ని ఉంచుకుని.. వయనాడ్ స్థానాన్ని రాహుల్గాంధీ వదులుకున్నారు. దీంతో వయనాడ్లో ఉపఎన్నిక అనివార్యమైంది. నవంబర్ 13న పోలింగ్ జరుగుతుండగా.. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 23న విడుదల కానున్నాయి.
ఇది కూడా చదవండి: Cyber Security Awareness : సైబర్ నేరాలపై భారత సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ కీలక సూచనలు
#WATCH | Wayanad, Kerala: During her public rally in Panamaram, Congress leader and candidate for Wayanad Lok Sabha by-elections, Priyanka Gandhi Vadra says, " During one of the most difficult times of him (Rahul Gandhi), you, people of Wayanad stood by him. It is you who stood… pic.twitter.com/QIYp8Agj3k
— ANI (@ANI) October 28, 2024
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!