Uttar Pradesh: కూతురి మామతో లేచిపోయిన నలుగురు పిల్లల తల్లి..
- కుమార్తె మామతో లేచిపోయిన తల్లి..
- యూపీలో నలుగురు పిల్లల తల్లి ఘటన వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్లోని అలీఘర్లో ఒక మహిళ తన కూతురికి కాబోయే భర్తతో లేచిపోయింది. ఈ సంఘటన యావత్ దేశంలో వైరల్గా మారింది. అయితే, ఇలాంటి మరో సంఘటన యూపీలోని బాదౌన్లో జరిగింది. ఒక మహిళ తన కుమార్తె మామగారితో పారిపోయింది. మమత అనే మహిళ, తన కూతురి మమా శైలేంద్ర అలియాస్ బిల్లుతో లేచిపోవడం సంచలనంగా మారింది.
ఆ మహిళ భర్త సునీల్ కుమార్ మాట్లాడుతూ.. తాను నెలకు రెండుసార్లు మాత్రమే ఇంటికి వచ్చే వాడినని, తాను లేనప్పుడు తన భార్య మమత తన కుమార్తె మామగారిని ఇంటికి రమ్మని చెప్పేదని అతను చెప్పాడు. శైలేంద్ర వచ్చినప్పుడల్లా తను వేరే గదిలోకి వెళ్లుమని చెప్పేదని మమత కుమారుడు కూడా చెప్పాడు.
Also Read
- Mahua Moitra: రామమందిర విరాళాల స్కామ్పై స్పందించరే.. బీజేపీపై మహువా మొయిత్రా ఫైర్
- Ketan Agarwal Case: కేతన్ పాస్పోర్ట్ పోయినప్పుడు జరిగిందిదే.. క్యాబ్ డ్రైవర్ సంచలన వ్యాఖ్యలు
- Ketan Agarwal Case: షాపింగ్ కోసం కేతన్ నుంచి రూ.కోటి కొట్టేసిన సియా.. అవి ఎవరికిచ్చిందంటే..!
- Viral Video: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న తాతా.. 18 వేల అడుగుల ఎత్తు నుంచి దూకేసిన 80 ఏళ్ల వృద్ధుడు!
Read Also: Maharashtra: స్కూళ్లలో హిందీని తప్పనిసరి చేస్తూ జీవో.. ప్రతిపక్ష కూటమి అభ్యంతరం
43 ఏళ్ల మమతకు నలుగురు పిల్లలు ఉన్నారు. ఇరు కుటుంబాల నుంచి ఎలాంటి ప్రతిఘటన ఎదురు కావద్దని పారిపోయినట్లు సమాచారం. మమత పిల్లల్లో ఒక కుమార్తెకి 2022లో వివాహం జరిగింది. ఆమె కుమార్తె మామ అయిన శైలేంద్ర (46)తో కాలక్రమేణా సంబంధాన్ని పెంచుకున్నట్లు తెలుస్తోంది. మమత భర్త ట్రక్ డ్రైవర్ అయిన సునీల్ కుమార్ మాట్లాడుతూ.. తాను సుదీర్ఘ పర్యటనలో ఉన్నప్పటికీ, క్రమం తప్పకుండా ఇంటికి డబ్బులు పంపేవాడిని, తాను లేనప్పుడు మమతా శైలేంద్రను కలిసేదని చెప్పాడు.
మమతా కుమారుడు మాట్లాడుతూ, తన తండ్రి అరుదుగా ఇంట్లో ఉండేవాని, ప్రతీ మూడో రోజు అమ్మ(మమతా) శైలేంద్రను ఇంటికి పిలిచేదని, తమని వేరే గదికి పంపేదని, ఇప్పుడు ఆమె అతడితో పారిపోయిందని చెప్పాడు. శైలేంద్ర అర్ధరాత్రి మమత ఇంటికి వచ్చి, తెల్లవారుజామున వెళ్లిపోయేవాడని పొరుగువారు కూడా చెప్పారు. సునీల్ కుమార్ స్థానిక పోలీస్ స్టేషన్లో శైలేంద్రపై లిఖితపూర్వక ఫిర్యాదు సమర్పించారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
Cleaning Tips: ఇల్లాళ్లకు స్మార్ట్ కిచెన్ ఐడియాస్.. వంటగదిని క్లీన్గా ఉంచే 12 అదిరిపోయే చిట్కాలు!
-
Nitin Nabin: గిరిజనుల అభివృద్ధికి బీజేపీ కట్టుబడింది.. కాంగ్రెస్ తెలంగాణను ఏటీఎంగా వాడుకుంటోంది
-
Trump-Iran: ఇరాన్ చర్చలు కోరింది.. రేపు దోహాలో కీలక భేటీ అంటూ ట్రంప్ ప్రకటన
-
Mahua Moitra: రామమందిర విరాళాల స్కామ్పై స్పందించరే.. బీజేపీపై మహువా మొయిత్రా ఫైర్
ట్రెండింగ్
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!